THUMBA FLOWER : "తుమ్మి పువ్వులు తెచ్చినీకు లింగ పూజలు చేద్దామంటే కొమ్మకొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగ" అంటూ పరమశివుడిపై కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ చేసిన గానం వినసొంపుగా ఉంటుంది. అసలు ఈ తుమ్మి పూల కథేంటి? తుమ్మి పూలు శివుడికి అంతగా ఎందుకు ఇష్టం? అని ఆలోచిస్తే తెరవెనుక ఆసక్తికరమైన ఓ పౌరాణిక కథ ఉంది.
"విశ్వావసు" నామ సంవత్సరంలో "వీరే" హీరోలు - 'ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే'!
పరమశివుడికే భోళా శంకరుడు అనే పేరుంది. భక్తులు పిలిచిన వెంటనే పలికే దైవం ఆయన. కేవలం నీళ్లతో అభిషేకించినా కరిగిపోయే మనసున్నవాడు. కోరిన కోర్కెలు తీర్చే దేవుళ్లలో అందరికంటే ముందుంటాడు. పరమశివుడి పూజ అనగానే బిల్వ దళం గుర్తొస్తుంది. లేదంటే జిల్లేడు పూలతో అభిషేకం జరిపిస్తుంటాం. అయితే, ఆయనకు అన్నింటికీ మించి తుమ్మిపువ్వులంటే ఎంతో ఇష్టమట. "శివుడికి ఇష్టమైన విష్ణువుకు సైతం తుమ్మి పువ్వులు ఎంతో ఇష్టమని ఈ పూలతో పూజ చేస్తే సర్వ సంపదలు కలుగుతాయని పురాణాల్లో పేర్కొన్నట్లు" ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్కుమార్ వెల్లడించారు.
శివ పురాణం ప్రకారం వెయ్యి తెల్లజిల్లేడు పుష్పాలను తెచ్చి శివసహస్రనామం చదివి అభిషేకం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక గన్నేరు పుష్పాన్ని సమర్పించినా అంత ఫలితం ఉంటుందట. అదే విధంగా వెయ్యి గన్నేరు పుష్పాలను తెచ్చి శివసహస్రనామం చదివి అభిషేకిస్తే ఎంత పుణ్యమైతే వస్తుందో ఒక్క మారేడు దళంతో అంతే ఫలితం ఉంటుందని శాస్త్రం వెల్లడిస్తోంది. శివలింగంపైన ఒక బిల్వపత్రాన్ని పెడితే మూడు జన్మల పాపాలను హరించివేస్తాడట ఆ మహాశివయ్య.
శివుడు మూడో కన్ను తెరిస్తే ఏం జరుగుతుంది? - 'నంది కొమ్ముల మధ్యలో నుంచి ఎందుకు దర్శించుకుంటారంటే!'
ఇక వెయ్యి బిల్వదలాలకు మించిన ఫలితం ఒక్క తామరపువ్వు ఇస్తుందని, వెయ్యి తామర పువ్వుల ఫలితం ఒక్క ఉమ్మెత్తపువ్వు అందిస్తుందని శివపురాణం ద్వారా తెలుస్తోంది. ఇక వెయ్యి ఉమ్మెత్తపువ్వులను తీసుకొచ్చి అభిషేకం చేస్తే వచ్చే ఫలితం ఒక్క జమ్మిపువ్వు ఇస్తుందట. చివరగా వెయ్యి జమ్మిపువ్వుల ఫలితం ఒక్క తుమ్మి పువ్వు పెడితే వస్తుందని పండితులు చెప్తున్నారు. మారేడు దళాలకు మించి తుమ్మి పువ్వు అంటే శివుడికి ఎందుకు అంత ఇష్టమో తెలుసుకుందాం.
శివపురాణం ప్రకారం ఓ ఆటవికుడు అడవిలో వెళ్తూ చలి బారిన పడతాడు. దాంతో సమీపంలోని బండరాళ్ల వద్ద అతడు సేదతీరే ప్రయత్నం చేస్తాడు. పక్కనే ఉన్న శివలింగానికి నమస్కరించి తన దగ్గర వున్న వస్త్రాన్ని కప్పుకొని నిద్రపోతాడు. నిద్రలో మెలకువ వచ్చిన ఆ ఆటవికుడు "శివుడికి కూడా చలేస్తుందేమో!" అనే ఆందోళనతో తన వద్ద ఉన్న వస్త్రాన్ని శివలింగంపై కప్పుతాడట. కల్మషం లేని అతడి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమని అడుగుతాడట. దాంతో ఆ భక్తుడు శివుడి పాదాలు ఎల్లపుడూ తనపై ఉండాలని కోరుకోవాలని భావించి చలికి తడబడి తన పాదాలు శివుడిపై ఉండాలని తప్పుగా అడుగుతాడు. శివుడు ప్రసాదించిన ఆ వరంతో మరు జన్మలో ఆ ఆటవికుడు తుమ్మి పువ్వు(పాదాల రూపం)లుగా జన్మించి శివలింగంపైకి చేరుతాడు.
ముఖ్య గమనిక : తుమ్మిపూల నేపథ్యం గురించి ఇక్కడ చెప్పిన వివరాలు వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం
'సంపాదించిన డబ్బు పైసా కూడా మిగలడం లేదా ? - ఈ పరిహారాలు చేస్తే చూడండి!'
'ఏం చేసినా మీ కష్టాలు పోవడం లేదా? - ఫైనల్గా ఇంట్లో ఆ మూలన దీపం వెలిగించి చూడండి!'