ETV Bharat / spiritual

రేపు "ఆదివారం అమావాస్య" - దీపం ఇలా పెట్టి చూడండి - అదృష్టం కలిసొస్తుందట! - CHAITRA AMAVASYA 2025

రేపు చైత్ర అమావాస్య - రావిచెట్టుకు పూజ, శునకాలకు ఆహారం పెడితే శుబాలు

chaitra_amavasya_2025
chaitra_amavasya_2025 (Gettyimages)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 26, 2025 at 4:45 PM IST

Updated : April 26, 2025 at 5:08 PM IST

3 Min Read

chaitra amavasya 2025 : ఏప్రిల్ 27 ఆదివారం రోజున వచ్చే చైత్ర అమావాస్య ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉందని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ తెలిపారు. ఈ రోజున కొన్ని పరిహారాలు, దానాలు, పూజలు చేయడం వల్ల సంవత్సరం మొత్తం అదృష్టం కలిసివస్తుందని వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాట్లల్లోనే!

"మహా నైవేద్యం రోజూ పెట్టాలా? - పూజల్లో కొబ్బరికాయ కుళ్లిపోతే ఎలాంటి ఫలితం ఉంటుంది?"

chaitra_amavasya_2025
chaitra_amavasya_2025 (gettyimages)

"ఏప్రిల్ 27న ఆదివారం వచ్చే చైత్ర అమావాస్య సమస్త శుభాలు కలిగిస్తుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఏ పరిహారం, పూజచేసినా వేల రెట్ల ఫలితం ఉంటుంది. ఈ రోజున పాటించాల్సిన విధివిధానాల్లో ముందుగా ఉదయం, సాయంత్రం తులసి మొక్క వద్ద ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. ఇంట్లో విష్ణు మూర్తి, లక్ష్మీదేవి, శ్రీకృష్ణుని విగ్రహాలుంటే గంగాజలంతో అభిషేకం జరిపించడం వల్ల అఖండ ఐశ్వర్యాలు లభిస్తాయి. సముద్రాలు, నదులకు దగ్గర్లో ఉన్న వారు ఈ రోజున గంగా స్నానం మంచిది. అలా చేయలేని వాళ్లు ప్రత్యామ్నాయంగా రోజూ చేసే నీళ్లలోనే కొద్దిగా గంగా జలం కలుపుకొని గంగా, గంగా అని స్మరిస్తూ స్నానం చేస్తే ఎంతో ఫలితం ఉంటుంది" అని మాచిరాజు పేర్కొన్నారు.

chaitra_amavasya_2025
chaitra_amavasya_2025 (gettyimages)

ఇక సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆరిపోకుండా వెలిగేలా అఖండ దీపాన్ని వెలిగించాలని తెలిపారు. ఈ దీపం ఇంటి హాల్ లో ఈశాన్యం మూలన వెలిగించాలని, పీఠం వేసి ముగ్గులు, పువ్వులతో అలంకరించి పెద్ద మట్టి ప్రమిదలో నువ్వుల నూనె, ఆవునెయ్యి వేసుకుని మూడు వత్తులతో వెలిగించాలి. ఇలా చేయడం వల్ల సంవత్సరమంతా తిరుగులేని అదృష్టం కలిసొస్తుందని మాచిరాజు కిరణ్ కుమార్ వివరించారు.

chaitra_amavasya_2025
chaitra_amavasya_2025 (gettyimages)

చైత్ర అమావాస్య కావడంతో ఉదయం స్నానం చేసిన తర్వాత రావి చెట్టు దగ్గర నీళ్లుపోయాలని, సాయంత్రం నువ్వుల నూనె దీపం వెలిగించాలని తెలిపారు. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందట. ఇక ఇంట్లో దేవుడి గదిలో శక్తి వంతమైన ధన దీపాన్ని వెలిగించుకోవాలని, ఆవునెయ్యి దీపంలో రెండు లవంగాలు, కుంకుమ పువ్వు పొడి వేసి ఎర్ర వత్తులతో దీపం వెలిగించాలని సూచించారు. ఇలా చేస్తే సంవత్సరమంతా నవగ్రహాల్లో కుజుడి అనుగ్రహం, శత్రు బాధలు తొలగిపోయి, గృహ యోగం, దృష్టి దోషాలు పోయి లాభం జరుగుతుందన్నారు.

chaitra_amavasya_2025
chaitra_amavasya_2025 (gettyimages)

చైత్ర అమావాస్య రోజున ఈ రోజున నీటి కుండ, తెల్లటి వస్త్రాలు దానం చేయాలని, గోసేవ చేయడం గోవుకు ఆహారం తినిపించాలని తెలిపారు. మూగజీవాలు, పక్షులు, పావురాలు, శునకాలకు ఆహారం పెట్టడం ద్వారా గ్రహ దోషం పోతుందని చెప్పారు. ఇంట్లో ధూపం వేసుకోవడం వల్ల సంవత్సరం మొత్తం ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉండదని, ఈ ధూపంలో గోమయం పిడకల్లో ఆవు నెయ్యి బెల్లం పొడి, సాంబ్రాణీ ఉంచి వెలిగించి వేసుకోవాలి వివరించారు. ఈ ప్రత్యేకమైన ధూపాన్ని వెలిగించడం వల్ల అన్ని ఇబ్బందుల నుంచి బయటపడొచ్చని అన్నారు. ఇది చాలా శక్తి వంతమైన చైత్ర అమావాస్యను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మాచిరాజు కిరణ్ కుమార్ తెలిపారు.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

"విశ్వావసు" నామ సంవత్సరంలో "వీరే" హీరోలు - 'ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే'!

"శివుడికి ఇష్టమైన పువ్వులు ఏమిటో తెలుసా? - జిల్లేడు మాత్రం కాదు - వీటితో పూజిస్తే అష్టైశ్వర్యాలు"

chaitra amavasya 2025 : ఏప్రిల్ 27 ఆదివారం రోజున వచ్చే చైత్ర అమావాస్య ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉందని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ తెలిపారు. ఈ రోజున కొన్ని పరిహారాలు, దానాలు, పూజలు చేయడం వల్ల సంవత్సరం మొత్తం అదృష్టం కలిసివస్తుందని వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాట్లల్లోనే!

"మహా నైవేద్యం రోజూ పెట్టాలా? - పూజల్లో కొబ్బరికాయ కుళ్లిపోతే ఎలాంటి ఫలితం ఉంటుంది?"

chaitra_amavasya_2025
chaitra_amavasya_2025 (gettyimages)

"ఏప్రిల్ 27న ఆదివారం వచ్చే చైత్ర అమావాస్య సమస్త శుభాలు కలిగిస్తుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఏ పరిహారం, పూజచేసినా వేల రెట్ల ఫలితం ఉంటుంది. ఈ రోజున పాటించాల్సిన విధివిధానాల్లో ముందుగా ఉదయం, సాయంత్రం తులసి మొక్క వద్ద ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. ఇంట్లో విష్ణు మూర్తి, లక్ష్మీదేవి, శ్రీకృష్ణుని విగ్రహాలుంటే గంగాజలంతో అభిషేకం జరిపించడం వల్ల అఖండ ఐశ్వర్యాలు లభిస్తాయి. సముద్రాలు, నదులకు దగ్గర్లో ఉన్న వారు ఈ రోజున గంగా స్నానం మంచిది. అలా చేయలేని వాళ్లు ప్రత్యామ్నాయంగా రోజూ చేసే నీళ్లలోనే కొద్దిగా గంగా జలం కలుపుకొని గంగా, గంగా అని స్మరిస్తూ స్నానం చేస్తే ఎంతో ఫలితం ఉంటుంది" అని మాచిరాజు పేర్కొన్నారు.

chaitra_amavasya_2025
chaitra_amavasya_2025 (gettyimages)

ఇక సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆరిపోకుండా వెలిగేలా అఖండ దీపాన్ని వెలిగించాలని తెలిపారు. ఈ దీపం ఇంటి హాల్ లో ఈశాన్యం మూలన వెలిగించాలని, పీఠం వేసి ముగ్గులు, పువ్వులతో అలంకరించి పెద్ద మట్టి ప్రమిదలో నువ్వుల నూనె, ఆవునెయ్యి వేసుకుని మూడు వత్తులతో వెలిగించాలి. ఇలా చేయడం వల్ల సంవత్సరమంతా తిరుగులేని అదృష్టం కలిసొస్తుందని మాచిరాజు కిరణ్ కుమార్ వివరించారు.

chaitra_amavasya_2025
chaitra_amavasya_2025 (gettyimages)

చైత్ర అమావాస్య కావడంతో ఉదయం స్నానం చేసిన తర్వాత రావి చెట్టు దగ్గర నీళ్లుపోయాలని, సాయంత్రం నువ్వుల నూనె దీపం వెలిగించాలని తెలిపారు. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందట. ఇక ఇంట్లో దేవుడి గదిలో శక్తి వంతమైన ధన దీపాన్ని వెలిగించుకోవాలని, ఆవునెయ్యి దీపంలో రెండు లవంగాలు, కుంకుమ పువ్వు పొడి వేసి ఎర్ర వత్తులతో దీపం వెలిగించాలని సూచించారు. ఇలా చేస్తే సంవత్సరమంతా నవగ్రహాల్లో కుజుడి అనుగ్రహం, శత్రు బాధలు తొలగిపోయి, గృహ యోగం, దృష్టి దోషాలు పోయి లాభం జరుగుతుందన్నారు.

chaitra_amavasya_2025
chaitra_amavasya_2025 (gettyimages)

చైత్ర అమావాస్య రోజున ఈ రోజున నీటి కుండ, తెల్లటి వస్త్రాలు దానం చేయాలని, గోసేవ చేయడం గోవుకు ఆహారం తినిపించాలని తెలిపారు. మూగజీవాలు, పక్షులు, పావురాలు, శునకాలకు ఆహారం పెట్టడం ద్వారా గ్రహ దోషం పోతుందని చెప్పారు. ఇంట్లో ధూపం వేసుకోవడం వల్ల సంవత్సరం మొత్తం ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉండదని, ఈ ధూపంలో గోమయం పిడకల్లో ఆవు నెయ్యి బెల్లం పొడి, సాంబ్రాణీ ఉంచి వెలిగించి వేసుకోవాలి వివరించారు. ఈ ప్రత్యేకమైన ధూపాన్ని వెలిగించడం వల్ల అన్ని ఇబ్బందుల నుంచి బయటపడొచ్చని అన్నారు. ఇది చాలా శక్తి వంతమైన చైత్ర అమావాస్యను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మాచిరాజు కిరణ్ కుమార్ తెలిపారు.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

"విశ్వావసు" నామ సంవత్సరంలో "వీరే" హీరోలు - 'ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే'!

"శివుడికి ఇష్టమైన పువ్వులు ఏమిటో తెలుసా? - జిల్లేడు మాత్రం కాదు - వీటితో పూజిస్తే అష్టైశ్వర్యాలు"

Last Updated : April 26, 2025 at 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.