ETV Bharat / spiritual

వరూధిని ఏకాదశి వ్రత కథ- చదివినా, విన్నా సకల పాపాలు తొలగిపోతాయ్! - VARUTHINI EKADASHI 2025

వరూధిని ఏకాదశి వ్రత కథ మీ కోసం!

Varuthini Ekadashi Vrat Katha
Varuthini Ekadashi Vrat Katha (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : April 24, 2025 at 12:01 AM IST

2 Min Read

Varuthini Ekadashi Vrat Katha : హిందూ సంప్రదాయం ప్రకారం మనం చేసే నోములు, వ్రతాలకు సంపూర్ణ ఫలం దక్కాలంటే ఆ వ్రతకథను కూడా తప్పనిసరిగా చదువుకోవాలి. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన వరూధిని ఏకాదశి వ్రత విధానం గురించి తెలుసుకున్నాం కదా! ఈ కథనంలో వరూధిని ఏకాదశి వ్రతకథ ప్రాముఖ్యాన్ని తెలుసుకుందాం.

వరూధిని ఏకాదశి వ్రత కథ
వరూధిని ఏకాదశి వ్రత కథను పద్మపురాణంలో వివరించి ఉంది. పూర్వం నర్మదా నదీతీరంలో మాంధాత అనే రాజు ఉండేవాడు. ప్రజారంజకంగా పరిపాలించే మాంధాతకు భక్తిభావం కూడా ఎక్కువే! మాంధాత భగవంతుని గురించి ఎక్కువగా తపస్సు చేస్తుండేవాడు.

మాంధాతపై ఎలుగుబంటి దాడి
ఒకరోజు మాంధాత తపస్సులో మునిగి ఉన్న సమయంలో అతని కాలును ఒక ఎలుగుబంటి గాయపరుస్తుంది. ఎలుగుబంటి రాజు కాలు పట్టి అలాగే అడవిలోకి లాక్కెళ్లసాగింది. ఆ సమయంలో మాంధాత విష్ణుమూర్తిని ప్రార్ధించాడు.

మాంధాతను రక్షించిన విష్ణుమూర్తి
మాంధాత ప్రార్ధనలు ఆలకించిన విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఎలుగుబంటిని సంహరించి రాజును రక్షించాడు. అయితే ఈ ప్రమాదంలో రాజు తన కాలును పోగొట్టుకుంటాడు. అందుకు చింతిస్తున్న రాజుతో విష్ణుమూర్తి పూర్వజన్మ పాపం వల్లనే ఇలా జరిగిందని, మాంధాత వరూధిని ఏకాదశి వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని చెబుతాడు. మాంధాత విష్ణుమూర్తి చెప్పినట్లుగా వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పాపవిముక్తుడై వైకుంఠాన్ని చేరుకుంటాడు.

బ్రహ్మహత్యా పాపం నుంచి విముక్తి పొందిన శివుడు
పురాణాల ప్రకారం వరూధిని ఏకాదశికి సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. బ్రహ్మపై ఆగ్రహించిన శివుడు అతని శిరస్సును ఖండిస్తాడు. దానితో శివునికి బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంటుంది. పరమ శివుడు కూడా బ్రహ్మహత్యా పాపం నుంచి విముక్తి కోసం వరూధిని ఏకాదశి వ్రతం చేసి పాపవిముక్తి పొందాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వరూధిని ఏకాదశి వ్రతమహాత్యాన్ని వివరించినట్లుగా తెలుస్తోంది.

వరూధిని ఏకాదశి వ్రతం వేయి అశ్వమేధయాగాలకు, కోటి కన్యాదాన ఫలానికి సమానమైనది. అందుకే ఈ వ్రతానికి ఇంతటి ప్రాశస్త్యం.

ఈ వరూధిని ఏకాదశి వ్రతకథను చదివినా, విన్నా సకల పాపాల నుంచి ముక్తి లభిస్తుందని శాస్త్రవచనం.

ఓం నమో నారాయణాయ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

Varuthini Ekadashi Vrat Katha : హిందూ సంప్రదాయం ప్రకారం మనం చేసే నోములు, వ్రతాలకు సంపూర్ణ ఫలం దక్కాలంటే ఆ వ్రతకథను కూడా తప్పనిసరిగా చదువుకోవాలి. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన వరూధిని ఏకాదశి వ్రత విధానం గురించి తెలుసుకున్నాం కదా! ఈ కథనంలో వరూధిని ఏకాదశి వ్రతకథ ప్రాముఖ్యాన్ని తెలుసుకుందాం.

వరూధిని ఏకాదశి వ్రత కథ
వరూధిని ఏకాదశి వ్రత కథను పద్మపురాణంలో వివరించి ఉంది. పూర్వం నర్మదా నదీతీరంలో మాంధాత అనే రాజు ఉండేవాడు. ప్రజారంజకంగా పరిపాలించే మాంధాతకు భక్తిభావం కూడా ఎక్కువే! మాంధాత భగవంతుని గురించి ఎక్కువగా తపస్సు చేస్తుండేవాడు.

మాంధాతపై ఎలుగుబంటి దాడి
ఒకరోజు మాంధాత తపస్సులో మునిగి ఉన్న సమయంలో అతని కాలును ఒక ఎలుగుబంటి గాయపరుస్తుంది. ఎలుగుబంటి రాజు కాలు పట్టి అలాగే అడవిలోకి లాక్కెళ్లసాగింది. ఆ సమయంలో మాంధాత విష్ణుమూర్తిని ప్రార్ధించాడు.

మాంధాతను రక్షించిన విష్ణుమూర్తి
మాంధాత ప్రార్ధనలు ఆలకించిన విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఎలుగుబంటిని సంహరించి రాజును రక్షించాడు. అయితే ఈ ప్రమాదంలో రాజు తన కాలును పోగొట్టుకుంటాడు. అందుకు చింతిస్తున్న రాజుతో విష్ణుమూర్తి పూర్వజన్మ పాపం వల్లనే ఇలా జరిగిందని, మాంధాత వరూధిని ఏకాదశి వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని చెబుతాడు. మాంధాత విష్ణుమూర్తి చెప్పినట్లుగా వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పాపవిముక్తుడై వైకుంఠాన్ని చేరుకుంటాడు.

బ్రహ్మహత్యా పాపం నుంచి విముక్తి పొందిన శివుడు
పురాణాల ప్రకారం వరూధిని ఏకాదశికి సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. బ్రహ్మపై ఆగ్రహించిన శివుడు అతని శిరస్సును ఖండిస్తాడు. దానితో శివునికి బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంటుంది. పరమ శివుడు కూడా బ్రహ్మహత్యా పాపం నుంచి విముక్తి కోసం వరూధిని ఏకాదశి వ్రతం చేసి పాపవిముక్తి పొందాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వరూధిని ఏకాదశి వ్రతమహాత్యాన్ని వివరించినట్లుగా తెలుస్తోంది.

వరూధిని ఏకాదశి వ్రతం వేయి అశ్వమేధయాగాలకు, కోటి కన్యాదాన ఫలానికి సమానమైనది. అందుకే ఈ వ్రతానికి ఇంతటి ప్రాశస్త్యం.

ఈ వరూధిని ఏకాదశి వ్రతకథను చదివినా, విన్నా సకల పాపాల నుంచి ముక్తి లభిస్తుందని శాస్త్రవచనం.

ఓం నమో నారాయణాయ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.