ETV Bharat / spiritual

"విశ్వావసు" నామ సంవత్సరంలో "వీరే" హీరోలు - 'ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే'! - UGADI HOROSCOPE 2025

మూడు రాశుల వారికి కలిసిరానున్న ఉగాది - అనుకున్న పనులు నెరవేరే చాన్స్!

Ugadi Horoscope 2025 in Telugu
Ugadi Horoscope 2025 in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 22, 2025 at 2:27 PM IST

3 Min Read

Ugadi Horoscope 2025 in Telugu : విశ్వావసు నామ సంవత్సరంలో శని సంచారంలో మార్పు వల్ల కొన్ని రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతోందని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్​ కుమార్​ తెలిపారు. ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఆయన మాటల్లోనే 'విశ్వావసు నామ సంవత్సరం- ఉగాది తర్వాత ద్వాదశ రాశులలో మూడు రాశులకి శని సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతోంది. ఎప్పుడైనా సరే జన్మ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే మూడు, ఆరు, 11 రాశుల్లో శని భగవానుడు ఉన్నట్లైతే, శని భగవానుడు ఆ మూడు రాశులకి అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తాడు. ఉగాది తర్వాత శని సంచారంలో మార్పు వల్ల 12 రాశుల్లో మూడు రాశుల వాళ్లకి సంవత్సరం మొత్తం విశేషమైన రాజయోగం పట్టబోతోంది. ఆ మూడు రాశుల్లో మొట్టమొదటి రాశి 'మకర రాశి'. కారణం ఏంటంటే 2025 సంవత్సరం మార్చి నెల 30వ తేదీ శని భగవానుడు కుంభ రాశిలో నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మకర రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మకరం, కుంభం, మీనం. శని సంచారంలో మార్పు జరిగిన మీన రాశి మూడవ రాశి అవుతుంది. అంటే మకర రాశి వాళ్లకి ఉగాది తర్వాత శని భగవానుడు తృతీయంలో మూడో స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది విశేషమైన రాజయోగాన్ని కలిగిస్తుందని మాచిరాజు తెలిపారు. మూడో స్థానంలో శని చాలా బలంగా ఉంటాడు. తృతీయంలో శని ఉన్నప్పుడు కష్టానికి తగిన ప్రతిఫలం కచ్చితంగా లభిస్తుంది. సోదరులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి. ప్రాపర్టీస్​ పరంగా విశేషమైన లాభం చేకూరుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా మకర రాశి వాళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు.

శివుడు మూడో కన్ను తెరిస్తే ఏం జరుగుతుంది? - 'నంది కొమ్ముల మధ్యలో నుంచి ఎందుకు దర్శించుకుంటారంటే!'

శని సంచారంలో మార్పు వల్ల విశేషమైనటువంటి రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి 'తుల రాశి'. దానికి కారణం తుల రాశి నుంచి లెక్కపెట్టినప్పుడు శని సంచారంలో మార్పు జరిగినటువంటి మీన రాశి ఆరవ రాశి అవుతుంది. కాబట్టి, తుల రాశి వాళ్లకి శని భగవానుడు ఉగాది తర్వాత ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే తుల రాశి వాళ్లకి ఉగాది తర్వాత అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయట. ఎంత పెద్ద అప్పులున్నా సరే త్వరగా బయటపడతారు. శత్రు బాధలు, దృష్టి దోషాలు తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. విశేషమైన ధన లాభాన్ని పొందుతారు' అని మాచిరాజు కిరణ్​ కుమార్​ చెప్పారు.

ఉగాది తర్వాత 'వృషభ రాశి' వారికి అఖండ రాజయోగం పట్టబోతోందని మాచిరాజు కిరణ్​ కుమార్​ పేర్కొన్నారు. కారణం ఏంటంటే వృషభ రాశి నుంచి లెక్కపెట్టినప్పుడు శని సంచారంలో మార్పు జరిగిన మీన రాశి 11వ రాశి అవుతుంది. అంటే మీన రాశి వాళ్లకి ఉగాది తర్వాత సంవత్సరం మొత్తం కూడా శని భగవానుడు లాభ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 11వ స్థానంలో శని సంచారం ఉంటే కొద్దిగా కష్టపడ్డా 100 రెట్లు విశేషమైన ఫలితం ఉంటుంది. వృత్తిపరంగా అద్భుతమైన పురోభివృద్ధి, ప్రమోషన్లు వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. విశేషమైన ధన లాభం కలుగుతుంది. కుటుంబంలో అందరూ కూడా అత్యున్నత స్థాయికి వెళ్లగలుగుతారు.

శని లాభ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆర్థిక పరంగా, అలాగే ఆరోగ్యం, కుటుంబ పరంగా వృషభ రాశి వాళ్లకి ఉగాది తర్వాత శుభ ఫలితాలు కలుగుతాయని మాచిరాజు తెలిపారు. పట్టిందల్లా బంగారంలాగా ఉంటుందని పేర్కొన్నారు. విశ్వావసు నామ సంవత్సరంలో శని సంచారంలో మార్పు వల్ల మకర, తుల, వృషభ రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతోందని అన్నారు. వీరు కొద్దిగా కష్టపడితేనే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పారు.

ముఖ్య గమనిక : ఉగాది తర్వాత కొన్ని రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతోందని తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం

దేవాలయానికి ఎందుకు వెళ్లాలి! - ప్రదక్షిణల పరమార్థం ఏమిటో తెలుసా?

'చింతలు తీర్చే 'చింత కొమ్మ తాంత్రిక పరిహారం' - ఇంటి వాస్తు దోషాలకు చెక్'

Ugadi Horoscope 2025 in Telugu : విశ్వావసు నామ సంవత్సరంలో శని సంచారంలో మార్పు వల్ల కొన్ని రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతోందని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్​ కుమార్​ తెలిపారు. ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఆయన మాటల్లోనే 'విశ్వావసు నామ సంవత్సరం- ఉగాది తర్వాత ద్వాదశ రాశులలో మూడు రాశులకి శని సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతోంది. ఎప్పుడైనా సరే జన్మ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే మూడు, ఆరు, 11 రాశుల్లో శని భగవానుడు ఉన్నట్లైతే, శని భగవానుడు ఆ మూడు రాశులకి అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తాడు. ఉగాది తర్వాత శని సంచారంలో మార్పు వల్ల 12 రాశుల్లో మూడు రాశుల వాళ్లకి సంవత్సరం మొత్తం విశేషమైన రాజయోగం పట్టబోతోంది. ఆ మూడు రాశుల్లో మొట్టమొదటి రాశి 'మకర రాశి'. కారణం ఏంటంటే 2025 సంవత్సరం మార్చి నెల 30వ తేదీ శని భగవానుడు కుంభ రాశిలో నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మకర రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మకరం, కుంభం, మీనం. శని సంచారంలో మార్పు జరిగిన మీన రాశి మూడవ రాశి అవుతుంది. అంటే మకర రాశి వాళ్లకి ఉగాది తర్వాత శని భగవానుడు తృతీయంలో మూడో స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది విశేషమైన రాజయోగాన్ని కలిగిస్తుందని మాచిరాజు తెలిపారు. మూడో స్థానంలో శని చాలా బలంగా ఉంటాడు. తృతీయంలో శని ఉన్నప్పుడు కష్టానికి తగిన ప్రతిఫలం కచ్చితంగా లభిస్తుంది. సోదరులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి. ప్రాపర్టీస్​ పరంగా విశేషమైన లాభం చేకూరుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా మకర రాశి వాళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు.

శివుడు మూడో కన్ను తెరిస్తే ఏం జరుగుతుంది? - 'నంది కొమ్ముల మధ్యలో నుంచి ఎందుకు దర్శించుకుంటారంటే!'

శని సంచారంలో మార్పు వల్ల విశేషమైనటువంటి రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి 'తుల రాశి'. దానికి కారణం తుల రాశి నుంచి లెక్కపెట్టినప్పుడు శని సంచారంలో మార్పు జరిగినటువంటి మీన రాశి ఆరవ రాశి అవుతుంది. కాబట్టి, తుల రాశి వాళ్లకి శని భగవానుడు ఉగాది తర్వాత ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే తుల రాశి వాళ్లకి ఉగాది తర్వాత అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయట. ఎంత పెద్ద అప్పులున్నా సరే త్వరగా బయటపడతారు. శత్రు బాధలు, దృష్టి దోషాలు తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. విశేషమైన ధన లాభాన్ని పొందుతారు' అని మాచిరాజు కిరణ్​ కుమార్​ చెప్పారు.

ఉగాది తర్వాత 'వృషభ రాశి' వారికి అఖండ రాజయోగం పట్టబోతోందని మాచిరాజు కిరణ్​ కుమార్​ పేర్కొన్నారు. కారణం ఏంటంటే వృషభ రాశి నుంచి లెక్కపెట్టినప్పుడు శని సంచారంలో మార్పు జరిగిన మీన రాశి 11వ రాశి అవుతుంది. అంటే మీన రాశి వాళ్లకి ఉగాది తర్వాత సంవత్సరం మొత్తం కూడా శని భగవానుడు లాభ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 11వ స్థానంలో శని సంచారం ఉంటే కొద్దిగా కష్టపడ్డా 100 రెట్లు విశేషమైన ఫలితం ఉంటుంది. వృత్తిపరంగా అద్భుతమైన పురోభివృద్ధి, ప్రమోషన్లు వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. విశేషమైన ధన లాభం కలుగుతుంది. కుటుంబంలో అందరూ కూడా అత్యున్నత స్థాయికి వెళ్లగలుగుతారు.

శని లాభ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆర్థిక పరంగా, అలాగే ఆరోగ్యం, కుటుంబ పరంగా వృషభ రాశి వాళ్లకి ఉగాది తర్వాత శుభ ఫలితాలు కలుగుతాయని మాచిరాజు తెలిపారు. పట్టిందల్లా బంగారంలాగా ఉంటుందని పేర్కొన్నారు. విశ్వావసు నామ సంవత్సరంలో శని సంచారంలో మార్పు వల్ల మకర, తుల, వృషభ రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతోందని అన్నారు. వీరు కొద్దిగా కష్టపడితేనే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పారు.

ముఖ్య గమనిక : ఉగాది తర్వాత కొన్ని రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతోందని తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం

దేవాలయానికి ఎందుకు వెళ్లాలి! - ప్రదక్షిణల పరమార్థం ఏమిటో తెలుసా?

'చింతలు తీర్చే 'చింత కొమ్మ తాంత్రిక పరిహారం' - ఇంటి వాస్తు దోషాలకు చెక్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.