ETV Bharat / spiritual

ధర్మం మహిమను తెలిపే చక్వవేణ మహారాజు కథ - STORY OF KING CHAKVENA IN TELUGU

త్యాగంతోనే ధనానికి విలువ! ధర్మం గొప్పతనాన్ని తెలిపే చక్వవేణ మహారాజు కథ!

Story Of King Chakvena
Story Of King Chakvena (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 27, 2025 at 5:30 AM IST

4 Min Read

Story Of King Chakvena In Telugu : ధనం పెరిగిన కొద్దీ దానం పెరగాలి. విలాసాలు, డాబు పెంచుకున్నారంటే, ఏ నాటికైనా పతనం తప్పదు. వరిపంటకు నీరు లేకపోతే ఎండిపోతుంది, సమంగా ఉంటే బంగారం పండుతుంది, అధికమైతే, ఆ నీటనే మునిగి, కుళ్ళి, నశిస్తుంది. ఇక్కడ నీటినే ధనం అనుకుంటే, తగినంత లేకుంటే కరువు, సరిపడా ఉంటే సమృద్ధి, ఎక్కువైతే తనను తానే నశింపచేసుకునే రాచమార్గం !

దానంతో దైవానుగ్రహం
అధికంగా ఉన్న ధనాన్ని దానం చేస్తే అందుకు ప్రతిఫలంగా దైవానుగ్రహమనే దివ్య ఫలాన్ని పొందవచ్చు. డబ్బు ఉందనే అహంకారంతో డాబు దర్పాలను ప్రదర్శించుకునే వారు, ఇతరులను చులకనగా చూసే వారిని ధర్మాత్ములు అనుకరించరాదు. అంతర్గత శాంతి, ధర్మచక్రం యొక్క బలం ఎలా ఉంటుందో తెలిపే చక్వవేణ మహారాజు కథను ప్రతిఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి.

చక్వవేణ మహారాజు కథ
పూర్వం చక్వవేణుడు అనే ధర్మాత్ముడు, సదాచారపరాయణుడు, సత్యవాది, దయామయుడు, మహాజ్ఞాని, అయిన మహారాజు ఉండేవాడు. అతను రాజద్రవ్యాన్ని తన సొంత అవసరాల కోసం వాడుకోవడం దోషంగా భావించి, భార్యతో తన పొలంలో వ్యవసాయం చేసుకునేవాడు. రాణి నాగలి లాగితే, రాజు విత్తనాలు చల్లేవాడు. వారు తమ పొలంలో పండిన ప్రత్తితో బట్టలు చేసుకు ధరించేవాడు. తమ పొలంలో పండిన ఆహారమే తినేవారు. రాణికి ఖరీదైన ఆభరణాలు ఉండేవి కావు. వారి కష్టార్జితం వారి జీవనానికే సరిపోయేది.

రాణి కోరిక
ఒకనాడు ఆ రాజ్యంలో జరిగిన తీర్ధానికి వచ్చిన ధనికులైన వ్యాపారుల భార్యలు, ఆడంబరంగా రాణిని దర్శించి, ఆమె కూడా మహారాజును అడిగి, అటువంటివి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వారి మాటలు విన్న రాణి, చక్వవేణుడిని, తనకూ విలువైన వస్త్రాభరణాలు కావాలని కోరింది.

రాజు ధర్మబద్ధమైన ఆలోచన
రాణి కోరిక ఎలా తీర్చాలా అని రాజు బాగా ఆలోచించాడు. తాను రాజద్రవ్యాన్ని ముట్టడు, కాని తను సామ్రాట్టు కనుక, దుష్టులు, బలవంతులు, అత్యాచారులు అయిన రాజుల నుంచి పన్నును వసూలు చెయ్యవచ్చు అని అనుకున్నాడు.

రావణాసురుని పన్ను విధించిన చక్వవేణుడు
చక్వవేణుడు తన మంత్రిని పిలిపించి “రాక్షస రాజైన రావణుడి వద్దకు వెళ్లి, నేను నాలుగు మణుగుల బరువైన బంగారాన్ని పన్నుగా చెల్లించమని, ఆజ్ఞాపించాను అని చెప్పి, తీసుకురమ్మని” ఆదేశించాడు.

రావణాసురుని పరిహాసం
చక్వవేణుని మంత్రి తెచ్చిన వార్తను విన్న రావణుడు అతన్ని పరిహాసం చేసి, పంపాడు. ఇదే విషయాన్ని మండోదరికి చెప్పగా, ఆమె ‘స్వామి! పొరపాటు చేసారు. వారడిగిన బంగారం ఇవ్వాల్సింది. చక్వవేణుడి మహిమను రేపు ఉదయం మీకు చూపుతాను‘ అంది.

రావణునికి కనువిప్పు కలిగించిన మండోదరి
మండోదరి మరుసటి రోజు ఉదయం పావురాలకు గింజలు వేసి, అవి తింటూ ఉండగా, ‘రావణుడి మీద ఆన, గింజలు ముట్టకండి‘ అంది. కానీ పావురాలు మండోదరి మాటలు లెక్కచెయ్యక, తినసాగాయి. వెంటనే ఆమె ‘చక్వవేణుడిపై ఆన, ఇక గింజలు ముట్టకండి’ అంది. వెంటనే అన్ని పావురాలు గింజలు తినకుండా ఎగిరిపోయాయి. కానీ ఒక చెవిటి పావురం మండోదరి మాటలు వినబడక, గింజ తినగానే దాని తల తెగి, క్రింద పడింది. తర్వాత రాణి, ‘చక్వవేణ మహారాజుపై ఆనను ఉపసంహరిస్తున్నాను, గింజలు తినండి,’ అనగానే, పక్షులు మళ్ళీ గింజలు తినసాగాయి. అప్పుడు రాణి రావణునితో ‘చూసారా స్వామి! ఇదీ చక్వవేణుడి ధర్మ చక్ర మహిమ!’ అంది, మండోదరి. కానీ ఏదీ అంత తేలిగ్గా ఒప్పకోని రావణుడు 'పిచ్చి పక్షులకు ఏమి తెలుస్తుంది?’ అంటూ కొట్టి పారేసాడు.

చక్వవేణుని మంత్రి ఉపాయం
జరిగినదంతా చూసిన చక్వవేణుని మంత్రి ఎలాగైనా రావణునికి చక్వవేణుని ధర్మనిరతి గురించి తెలియజేయాలని నిశ్చయించుకుంటాడు. వెంటనే సముద్ర తీరానికి చేరి, ఇసుక, మట్టితో లంకా నగర నమూనాను ఉన్నదున్నట్లుగా అచ్చం అలాగే చేసి ‘ఒక వినోదం చూపుతాను’ అంటూ రావణుడిని సముద్ర తీరానికి పిలుచుకువచ్చాడు.

మంత్రి చూపిన అద్భుతం - ఆశ్చర్యపోయిన రావణుడు
‘చక్వవేణ మహారాజుపై ఆన’ అంటూ నమూనాలో తూర్పువైపు ఉన్న బురుజులు, ప్రాకారాలను పడగొట్టగానే, లంకలో నిజంగా అమరిఉన్న నిజమైన తూర్పు వైపు బురుజు, ప్రాకారం కూలిపోయాయి. రావణుడు అది చూసి హతాశుడయ్యాడు. అలాగే మంత్రి, నమూనాలో ఉన్న తూర్పువైపు స్థూపాలు ‘చక్వవేణ మహారాజుపై ఆన’ అంటూ, పడగొట్టగానే నిజ లంకాపుర స్థూపాలు కూలిపోయాయి. ఇది చూసి బెదిరిన రావణుడు చక్వవేణుడు అడిగిన బంగారాన్ని మంత్రికి ఇచ్చి అతడిని పంపేశాడు.

చక్వవేణుడి భార్యలో పరివర్తన
తిరిగి వచ్చిన మంత్రి చక్వవేణుడికి బంగారం ఇవ్వగా, అతడు అది ఎలా తెచ్చావో చెప్పమని మంత్రిని అడిగాడు. మంత్రి చెప్పింది విన్న రాణి ఆశ్చర్యచకితురాలు అయ్యింది. చక్వవేణుడి ధర్మనిరతి, ధర్మానికి ఉన్న శక్తిని గుర్తించి ఆమె పరివర్తనం చెంది ఆ బంగారం తీసుకోడానికి నిరాకరించింది. అప్పుడు ఆ బంగారం తిరిగి రావణుడికి ఇచ్చివేస్తారు. అన్ని లోకాలను ప్రభావితం చెయ్యగల చక్వవేణుడి త్యాగబుద్ధిని తెలుసుకుని, రావణుడి హృదయం కూడా పరివర్తన చెంది, బంగారం తిరిగి తెచ్చిన మంత్రిని ఆదరించి, పంపివేసాడు.

త్యాగంతోనే ధనానికి విలువ
ధనం ఎప్పుడూ జీవనదిలా ప్రవహిస్తూ ఉండాలి. త్యాగంతోనే ధనానికి విలువ పెరుగుతుంది. దానంకు ఉపయోగపడని ధనం మురికి గుంటలోని నీరు వలే ఎవరికి ఉపయోగపడకుండా మురిగిపోతుంది. మోసంతో ఆర్జించిన మృష్టాన్నం కూడా విషతుల్యమే అవుతుంది. పవిత్ర ద్రవ్యం వల్ల ప్రాప్తించిన పిడికెడు అన్నమైనా అమృతతుల్యం అవుతుంది.

లోభత్వము వీడి దానగుణం, ధర్మగుణం పెంచుకుంటే ప్రపంచమే పాదాక్రాంతం అవుతుంది! ఇది సత్యం ..!!

లోకా సమస్తా సుఖినోభవన్తు!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

Story Of King Chakvena In Telugu : ధనం పెరిగిన కొద్దీ దానం పెరగాలి. విలాసాలు, డాబు పెంచుకున్నారంటే, ఏ నాటికైనా పతనం తప్పదు. వరిపంటకు నీరు లేకపోతే ఎండిపోతుంది, సమంగా ఉంటే బంగారం పండుతుంది, అధికమైతే, ఆ నీటనే మునిగి, కుళ్ళి, నశిస్తుంది. ఇక్కడ నీటినే ధనం అనుకుంటే, తగినంత లేకుంటే కరువు, సరిపడా ఉంటే సమృద్ధి, ఎక్కువైతే తనను తానే నశింపచేసుకునే రాచమార్గం !

దానంతో దైవానుగ్రహం
అధికంగా ఉన్న ధనాన్ని దానం చేస్తే అందుకు ప్రతిఫలంగా దైవానుగ్రహమనే దివ్య ఫలాన్ని పొందవచ్చు. డబ్బు ఉందనే అహంకారంతో డాబు దర్పాలను ప్రదర్శించుకునే వారు, ఇతరులను చులకనగా చూసే వారిని ధర్మాత్ములు అనుకరించరాదు. అంతర్గత శాంతి, ధర్మచక్రం యొక్క బలం ఎలా ఉంటుందో తెలిపే చక్వవేణ మహారాజు కథను ప్రతిఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి.

చక్వవేణ మహారాజు కథ
పూర్వం చక్వవేణుడు అనే ధర్మాత్ముడు, సదాచారపరాయణుడు, సత్యవాది, దయామయుడు, మహాజ్ఞాని, అయిన మహారాజు ఉండేవాడు. అతను రాజద్రవ్యాన్ని తన సొంత అవసరాల కోసం వాడుకోవడం దోషంగా భావించి, భార్యతో తన పొలంలో వ్యవసాయం చేసుకునేవాడు. రాణి నాగలి లాగితే, రాజు విత్తనాలు చల్లేవాడు. వారు తమ పొలంలో పండిన ప్రత్తితో బట్టలు చేసుకు ధరించేవాడు. తమ పొలంలో పండిన ఆహారమే తినేవారు. రాణికి ఖరీదైన ఆభరణాలు ఉండేవి కావు. వారి కష్టార్జితం వారి జీవనానికే సరిపోయేది.

రాణి కోరిక
ఒకనాడు ఆ రాజ్యంలో జరిగిన తీర్ధానికి వచ్చిన ధనికులైన వ్యాపారుల భార్యలు, ఆడంబరంగా రాణిని దర్శించి, ఆమె కూడా మహారాజును అడిగి, అటువంటివి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వారి మాటలు విన్న రాణి, చక్వవేణుడిని, తనకూ విలువైన వస్త్రాభరణాలు కావాలని కోరింది.

రాజు ధర్మబద్ధమైన ఆలోచన
రాణి కోరిక ఎలా తీర్చాలా అని రాజు బాగా ఆలోచించాడు. తాను రాజద్రవ్యాన్ని ముట్టడు, కాని తను సామ్రాట్టు కనుక, దుష్టులు, బలవంతులు, అత్యాచారులు అయిన రాజుల నుంచి పన్నును వసూలు చెయ్యవచ్చు అని అనుకున్నాడు.

రావణాసురుని పన్ను విధించిన చక్వవేణుడు
చక్వవేణుడు తన మంత్రిని పిలిపించి “రాక్షస రాజైన రావణుడి వద్దకు వెళ్లి, నేను నాలుగు మణుగుల బరువైన బంగారాన్ని పన్నుగా చెల్లించమని, ఆజ్ఞాపించాను అని చెప్పి, తీసుకురమ్మని” ఆదేశించాడు.

రావణాసురుని పరిహాసం
చక్వవేణుని మంత్రి తెచ్చిన వార్తను విన్న రావణుడు అతన్ని పరిహాసం చేసి, పంపాడు. ఇదే విషయాన్ని మండోదరికి చెప్పగా, ఆమె ‘స్వామి! పొరపాటు చేసారు. వారడిగిన బంగారం ఇవ్వాల్సింది. చక్వవేణుడి మహిమను రేపు ఉదయం మీకు చూపుతాను‘ అంది.

రావణునికి కనువిప్పు కలిగించిన మండోదరి
మండోదరి మరుసటి రోజు ఉదయం పావురాలకు గింజలు వేసి, అవి తింటూ ఉండగా, ‘రావణుడి మీద ఆన, గింజలు ముట్టకండి‘ అంది. కానీ పావురాలు మండోదరి మాటలు లెక్కచెయ్యక, తినసాగాయి. వెంటనే ఆమె ‘చక్వవేణుడిపై ఆన, ఇక గింజలు ముట్టకండి’ అంది. వెంటనే అన్ని పావురాలు గింజలు తినకుండా ఎగిరిపోయాయి. కానీ ఒక చెవిటి పావురం మండోదరి మాటలు వినబడక, గింజ తినగానే దాని తల తెగి, క్రింద పడింది. తర్వాత రాణి, ‘చక్వవేణ మహారాజుపై ఆనను ఉపసంహరిస్తున్నాను, గింజలు తినండి,’ అనగానే, పక్షులు మళ్ళీ గింజలు తినసాగాయి. అప్పుడు రాణి రావణునితో ‘చూసారా స్వామి! ఇదీ చక్వవేణుడి ధర్మ చక్ర మహిమ!’ అంది, మండోదరి. కానీ ఏదీ అంత తేలిగ్గా ఒప్పకోని రావణుడు 'పిచ్చి పక్షులకు ఏమి తెలుస్తుంది?’ అంటూ కొట్టి పారేసాడు.

చక్వవేణుని మంత్రి ఉపాయం
జరిగినదంతా చూసిన చక్వవేణుని మంత్రి ఎలాగైనా రావణునికి చక్వవేణుని ధర్మనిరతి గురించి తెలియజేయాలని నిశ్చయించుకుంటాడు. వెంటనే సముద్ర తీరానికి చేరి, ఇసుక, మట్టితో లంకా నగర నమూనాను ఉన్నదున్నట్లుగా అచ్చం అలాగే చేసి ‘ఒక వినోదం చూపుతాను’ అంటూ రావణుడిని సముద్ర తీరానికి పిలుచుకువచ్చాడు.

మంత్రి చూపిన అద్భుతం - ఆశ్చర్యపోయిన రావణుడు
‘చక్వవేణ మహారాజుపై ఆన’ అంటూ నమూనాలో తూర్పువైపు ఉన్న బురుజులు, ప్రాకారాలను పడగొట్టగానే, లంకలో నిజంగా అమరిఉన్న నిజమైన తూర్పు వైపు బురుజు, ప్రాకారం కూలిపోయాయి. రావణుడు అది చూసి హతాశుడయ్యాడు. అలాగే మంత్రి, నమూనాలో ఉన్న తూర్పువైపు స్థూపాలు ‘చక్వవేణ మహారాజుపై ఆన’ అంటూ, పడగొట్టగానే నిజ లంకాపుర స్థూపాలు కూలిపోయాయి. ఇది చూసి బెదిరిన రావణుడు చక్వవేణుడు అడిగిన బంగారాన్ని మంత్రికి ఇచ్చి అతడిని పంపేశాడు.

చక్వవేణుడి భార్యలో పరివర్తన
తిరిగి వచ్చిన మంత్రి చక్వవేణుడికి బంగారం ఇవ్వగా, అతడు అది ఎలా తెచ్చావో చెప్పమని మంత్రిని అడిగాడు. మంత్రి చెప్పింది విన్న రాణి ఆశ్చర్యచకితురాలు అయ్యింది. చక్వవేణుడి ధర్మనిరతి, ధర్మానికి ఉన్న శక్తిని గుర్తించి ఆమె పరివర్తనం చెంది ఆ బంగారం తీసుకోడానికి నిరాకరించింది. అప్పుడు ఆ బంగారం తిరిగి రావణుడికి ఇచ్చివేస్తారు. అన్ని లోకాలను ప్రభావితం చెయ్యగల చక్వవేణుడి త్యాగబుద్ధిని తెలుసుకుని, రావణుడి హృదయం కూడా పరివర్తన చెంది, బంగారం తిరిగి తెచ్చిన మంత్రిని ఆదరించి, పంపివేసాడు.

త్యాగంతోనే ధనానికి విలువ
ధనం ఎప్పుడూ జీవనదిలా ప్రవహిస్తూ ఉండాలి. త్యాగంతోనే ధనానికి విలువ పెరుగుతుంది. దానంకు ఉపయోగపడని ధనం మురికి గుంటలోని నీరు వలే ఎవరికి ఉపయోగపడకుండా మురిగిపోతుంది. మోసంతో ఆర్జించిన మృష్టాన్నం కూడా విషతుల్యమే అవుతుంది. పవిత్ర ద్రవ్యం వల్ల ప్రాప్తించిన పిడికెడు అన్నమైనా అమృతతుల్యం అవుతుంది.

లోభత్వము వీడి దానగుణం, ధర్మగుణం పెంచుకుంటే ప్రపంచమే పాదాక్రాంతం అవుతుంది! ఇది సత్యం ..!!

లోకా సమస్తా సుఖినోభవన్తు!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.