ETV Bharat / spiritual

కార్తిక సోమవారం వీటిల్లో ఏ ఒక్క పని చేసినా - శివుడి అనుగ్రహం తప్పకుండా పొందుతారట!

కార్తికంలో వచ్చే సోమవారాలు శివారాధనకు చాలా విశిష్టమైనవి - ఆ రోజు ఈ పనులు చేస్తే చాలు పరమేశ్వరుడి అనుగ్రహం మీపైనే!

KARTHIKA MASAM 2024
Karthika Somavaram (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : November 10, 2024 at 12:28 PM IST

3 Min Read
Choose ETV Bharat

Karthika Somavaram Pooja Rituals : ప్రస్తుతం శివకేశవులకు ఎంతో ఇష్టమైన కార్తిక మాసం నడుస్తోంది. అందులో భాగంగానే ప్రతిఒక్కరూ ఈ నెల మొత్తం విశేషమైన పూజలు చేస్తుంటారు. అయితే, పరమశివుడి సంపూర్ణ అనుగ్రహం కలగాలంటే కార్తిక సోమవారం కొన్ని ప్రత్యేకమైన నియమాలు తప్పకుండా పాటించాలంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

స్కాంద పురాణంలోని వైష్ణవ ఖండం ప్రకారం.. కార్తిక సోమవారం నాడు ఈ 6 పనుల్లో ఏ ఒక్కటి చేసినా సరే.. పరమశివుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్. ఆ నియమాల్లో ఏ ఒక్కటి ఫాలో అయినా కూడా శివుడు పరమానంద భరితుడై మీ మనోభిష్టాలన్ని నెరవేరుస్తాడని చెబుతున్నారు. అవేంటంటే..

ఉపవాసం : కార్తిక సోమవారం ఉపవాసం ఉండి రోజంతా శివ నామస్మరణ చేసుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే పరమశివుడి అనుగ్రహం పొందడమే కాకుండా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు. అంటే.. వండిన ఆహారాన్ని స్వీకరించకుండా కేవలం పాలు, పండ్లు మాత్రమే తీసుకుంటూ ఉండాలి. ఇక నెక్ట్​ డే ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత మీరు భోజనం స్వీకరించాలి.

ఏకభుక్తం : పరమేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం పొందాలంటే మీరు చేయాల్సిన మరో పని ఏకభుక్తం. అంటే.. ఉదయం శివ పూజ చేశాక ఆహారం స్వీకరించొచ్చు. కానీ, సాయంత్రం మళ్లీ శివ పూజ, శివాభిషేకం చేశాక రాత్రి అన్నం తినకుండా కేవలం పాలు, పండ్లు మాత్రమే తీసుకోవాలి. తర్వాతి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆపై మీరు ఆహారం తీసుకోవాలి.

నక్తం : కార్తిక సోమవారం ఉదయం పూట శివ పూజ, శివాభిషేకం చేశాక భోజనం చేయవద్దు. మళ్లీ, సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించి శివుడికి అన్నం నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత ఆకాశంలో నక్షత్రం చూసి పరమేశ్వరుడికి పెట్టిన ఆ అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. దీన్నే నక్తం అంటారు. అన్నింటిలో కంటే ఈ ఒక్కటి పాటించినా శివుడి అనుగ్రహానికి ఈజీగా పాత్రులు కాగలంటున్నారు.

అయాచితం : కార్తికమాసంలో సోమవారం ఈ నియమం పాటించినా మంచి ఫలితం ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు కిరణ్ కుమార్. అయాచితం అంటే ఏమిటంటే.. మీరు ఆహారం తినడానికి ప్రయత్నించకుండా ఎవరు ఏది ఇస్తే దాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించడంగా చెబుతారు.

స్నానం : కార్తిక సోమవారం మీరు ఏ పూజలు చేయకపోయినా తెల్లవారు జామున చన్నీటి స్నానం చేసినా చాలు శివుడి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందంటున్నారు.

తిలధానం : కార్తీక సోమవారం రోజు వేకువ జామున స్నానం, ఉపవాసం, ఏకభుక్తం.. వంటివి వీలుకానప్పుడు తిలధానం అనే ఈ ప్రత్యేకమైన విధిని పాటించినా పరశివుడి అనుగ్రహం పొందవచ్చంటున్నారు. తిలధానం అంటే ఏమిటంటే.. నల్లటి వస్త్రంలో ఒకటింపావు కేజీ నల్ల నువ్వులు మూటకట్టి శివాలయం లేదా మీ ఇంటి ప్రాంగణంలో ఎవరైనా బ్రహ్మణుడికి దానం ఇవ్వాలి.

ఇలా పైన చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటి కార్తిక సోమవారం పాటించినా పరమేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహంతో పాటు విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇవీ చదవండి :

నవంబర్​ 12న ఉత్థాన ఏకాదశి - ఆ రోజున ఈ దీపం వెలిగిస్తే.. మహా విష్ణువు అనుగ్రహం మీపైనే!

కార్తిక దీపం ఆ మూడు ప్రాంతాల్లో వెలిగించాలి - అవేంటో మీకు తెలుసా?