ETV Bharat / politics

కాంగ్రెస్‌పై కేసీఆర్ విషం కక్కారు: తెలంగాణ మంత్రుల ఫైర్‌ - MINISTERS REACTION ON KCR SPEECH

ఎల్కతుర్తిలో బీఆర్ఎస్​ అధినేత కాంగ్రెస్​పై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రులు - అధికారం పోయిందనే అక్కసును వెళ్లగక్కారన్న మంత్రి సీతక్క

Ministers Reaction On Kcr Speech
Ministers Reaction On Kcr Speech (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 28, 2025 at 12:29 AM IST

3 Min Read

Ministers Reaction On Kcr Speech : కేసీఆర్‌ మనసంతా విషంతో నిండిపోయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆక్షేపించారు. ఆయన ప్రసంగం మొత్తంలో కాంగ్రెస్‌ను విలన్‌లా చిత్రీకరించడం తప్ప ఇంకేమీ లేదని పొంగులేటి విమర్శించారు. మంచి సలహాలు, సూచనలు ఇస్తారేమోనని కేసీఆర్‌ ప్రసంగం విన్నామని, అందులో ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్​ రజతోత్సవాల సందర్భంగా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్‌ చేసిన ప్రసంగంపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ తీరును తప్పుబట్టారు.

బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ వ్యాఖ్యలపై : గత సీఎం పరిపాలన వల్ల ధనిక రాష్ట్రం అప్పులపాలైందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అప్పులున్నప్పటికీ ప్రజలకు సంక్షేమం అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ను విలన్‌గా చిత్రీకరిస్తున్నారా? అని మండి పడ్డారు. కడుపంతా విషం నింపుకొని కేసీఆర్ మాట్లాడటటమనేది బాధ కలిగించింది. 2 సార్లు బీఆర్ఎస్​కు అధికారం ఇస్తే ఎలా కొల్లగొట్టారో ప్రజలు గమనించారని ఆయన వివరించారు. కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి మంచి సలహాలు ఇస్తారని ఎదురుచూశామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఐదారు పర్యాయాలు అసెంబ్లీ జరిగిందని కేవలం రెండుసార్లు మాత్రమే కేసీఆర్‌ వచ్చారని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు సచివాలయానికి కూడా కేసీఆర్‌ వెళ్లలేదని దుయ్యబట్టారు.

దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది : కేసీఆర్‌ దొర మాదిరిగా పరిపాలిస్తే మా ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు అందుబాటులో ఉందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజలకు కాంగ్రెస్‌ అందిస్తున్నటువంటి మంచి పాలన గురించి తట్టుకోలేక కేసీఆర్‌ విషం కక్కారని మండిపడ్డారు. గతంలో వరి వేస్తే ఉరి అని చెప్పి కేసీఆర్‌ మాత్రం 150 ఎకరాల్లో వరి వేశారన్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కేసీఆర్‌ మాట్లాడుతున్నారని పొంగులేటి తెలిపారు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు రూ.82 వేల కోట్లు బకాయిలు పెట్టిందని గుర్తుచేశారు.

బీఆర్ఎస్ సభకు ఆటంకాలు సృష్టించామని కేసీఆర్‌ ఆరోపించారన్న పొంగులేటి సభకు అసలు ఆటంకం సృష్టించలేదని వివరించారు. మేం ఇబ్బంది పెట్టి ఉంటే సభ జరిగేదా?అని ప్రశ్నించారు. ఆ పార్టీ నేతలు అడిగినన్ని బస్సులను సభకు పంపామని వివరించారు. గత సీఎం పరిపాలన వల్ల ధనిక రాష్ట్రం అప్పులపాలైందని దుయ్యబట్టారు.

వర్సిటీ భూముల విషయంలో : యూనివర్సిటీ ఆస్తులు అమ్ముతున్నామని కేసీఆర్‌ ఆరోపించారన్న పొంగులేటి అసలు విశ్వవిద్యాలయ ఆస్తులను మేం ఎక్కడ విక్రయించాము? ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తోందని పొంగులేటి వివరించారు. కేసీఆర్‌ తెచ్చిన ధరణిలో ఎన్ని కుంభకోణాలు జరిగాయో అందరికీ తెలుసన్నారు. ‘ధరణి’ గురించి కేసీఆర్‌ ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం పేదలకు ఇస్తున్న సన్నబియ్యం గురించి ఎందుకు మాట్లాడలేదు? అని పొంగులేటి నిలదీశారు.

అధికారం పోయిందని అక్కసు : అధికారం పోయిందనే అక్కసును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెళ్లగక్కారని మంత్రి సీతక్క విమర్శించారు. అధికారం పోయిన తర్వాత ఆయన ఫ్యామిలీలో చీలికలు వస్తున్నాయని బాధపడుతున్నారు తప్ప ప్రజల కోసం కాదని అన్నారు. ‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం పదిహేను నెలల్లోనే 59 వేల ఉద్యోగాలు ఇచ్చిందని సీతక్క గుర్తుచేశారు. పార్టీ రజతోత్సవ వేళ ఎవరైనా పార్టీ త్యాగాలు, గొప్పదనాలు చెప్పుకొంటారని కానీ, కేసీఆర్‌ మాత్రం కాంగ్రెస్‌ను విమర్శించేందుకే సభ పెట్టారని మండిపడ్డారు. పేద మహిళల కోసం ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పిస్తే వారిని అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ అంతదారుణంగా పోలీసు వ్యవస్థను ఇంకెవరూ వాడుకోలేదు.

కేసీఆర్‌ గర్వం ఇంకా తగ్గలేదు: ప్రజలు ఓడించి ప్రతిపక్షంలో కూర్చుబెట్టినప్పటికీ కేసీఆర్‌లో ఇంకా గర్వం తగ్గలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. పార్టీ రజతోత్సవ వేదికపై కేసీఆర్‌ మినహా ఒక్క నేత అయినా మాట్లాడకుండా నిరంకుశంగా వ్యవహరించారని విమర్శించారు. బీఆర్ఎస్​ నేతలు నిజాయితీపరులైతే ఆ పార్టీ ఖాతాలో రూ.వేల కోట్లు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. ‘‘ కాళేశ్వరం కార్పొరేషన్‌ ఎండీగా ఉన్న ఉద్యోగి దగ్గర ఇవాళ రూ.200 కోట్లు దొరికాయన్నారు. ఆయనే అంత సంపాదించారంటే కేసీఆర్‌ కుటుంబం ఇంకెంత దోచుకుందో అర్థం చేసుకోవాలని తెలిపారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి ఇచ్చారా? 10 ఏళ్లు ప్రైవేటు వ్యక్తి చేతిలో ఉన్న కంచ గచ్చిబౌలి భూములను ఎందుకు పట్టించుకోలేదు? అని నిలదీశారు. ఏ తప్పూ చేయకపోతే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నిందితులు విదేశాల్లో ఎందుకు దాక్కున్నారు?’’ అని జూపల్లి ప్రశ్నించారు.

కేసీఆర్‌ అవకాశవాది : కేసీఆర్‌ అవకాశవాదిలా మాట్లాడారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అభిప్రయా. ‘‘సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్‌ అనలేదా?ఇవాళ విలన్‌ అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వారికి ఆ సభా వేదికపై ఎందుకు నివాళి అర్పించలేదు. పార్టీ పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎవరికైనా ఇచ్చారా’’ అని నిలదీశారు.

'ఆపరేషన్‌ కగార్‌' వెంటనే ఆపేయండి! - ప్రభుత్వం నక్సలైట్లను చర్చలకు పిలవాలి : కేసీఆర్​

Ministers Reaction On Kcr Speech : కేసీఆర్‌ మనసంతా విషంతో నిండిపోయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆక్షేపించారు. ఆయన ప్రసంగం మొత్తంలో కాంగ్రెస్‌ను విలన్‌లా చిత్రీకరించడం తప్ప ఇంకేమీ లేదని పొంగులేటి విమర్శించారు. మంచి సలహాలు, సూచనలు ఇస్తారేమోనని కేసీఆర్‌ ప్రసంగం విన్నామని, అందులో ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్​ రజతోత్సవాల సందర్భంగా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్‌ చేసిన ప్రసంగంపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ తీరును తప్పుబట్టారు.

బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ వ్యాఖ్యలపై : గత సీఎం పరిపాలన వల్ల ధనిక రాష్ట్రం అప్పులపాలైందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అప్పులున్నప్పటికీ ప్రజలకు సంక్షేమం అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ను విలన్‌గా చిత్రీకరిస్తున్నారా? అని మండి పడ్డారు. కడుపంతా విషం నింపుకొని కేసీఆర్ మాట్లాడటటమనేది బాధ కలిగించింది. 2 సార్లు బీఆర్ఎస్​కు అధికారం ఇస్తే ఎలా కొల్లగొట్టారో ప్రజలు గమనించారని ఆయన వివరించారు. కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి మంచి సలహాలు ఇస్తారని ఎదురుచూశామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఐదారు పర్యాయాలు అసెంబ్లీ జరిగిందని కేవలం రెండుసార్లు మాత్రమే కేసీఆర్‌ వచ్చారని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు సచివాలయానికి కూడా కేసీఆర్‌ వెళ్లలేదని దుయ్యబట్టారు.

దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది : కేసీఆర్‌ దొర మాదిరిగా పరిపాలిస్తే మా ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు అందుబాటులో ఉందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజలకు కాంగ్రెస్‌ అందిస్తున్నటువంటి మంచి పాలన గురించి తట్టుకోలేక కేసీఆర్‌ విషం కక్కారని మండిపడ్డారు. గతంలో వరి వేస్తే ఉరి అని చెప్పి కేసీఆర్‌ మాత్రం 150 ఎకరాల్లో వరి వేశారన్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కేసీఆర్‌ మాట్లాడుతున్నారని పొంగులేటి తెలిపారు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు రూ.82 వేల కోట్లు బకాయిలు పెట్టిందని గుర్తుచేశారు.

బీఆర్ఎస్ సభకు ఆటంకాలు సృష్టించామని కేసీఆర్‌ ఆరోపించారన్న పొంగులేటి సభకు అసలు ఆటంకం సృష్టించలేదని వివరించారు. మేం ఇబ్బంది పెట్టి ఉంటే సభ జరిగేదా?అని ప్రశ్నించారు. ఆ పార్టీ నేతలు అడిగినన్ని బస్సులను సభకు పంపామని వివరించారు. గత సీఎం పరిపాలన వల్ల ధనిక రాష్ట్రం అప్పులపాలైందని దుయ్యబట్టారు.

వర్సిటీ భూముల విషయంలో : యూనివర్సిటీ ఆస్తులు అమ్ముతున్నామని కేసీఆర్‌ ఆరోపించారన్న పొంగులేటి అసలు విశ్వవిద్యాలయ ఆస్తులను మేం ఎక్కడ విక్రయించాము? ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తోందని పొంగులేటి వివరించారు. కేసీఆర్‌ తెచ్చిన ధరణిలో ఎన్ని కుంభకోణాలు జరిగాయో అందరికీ తెలుసన్నారు. ‘ధరణి’ గురించి కేసీఆర్‌ ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం పేదలకు ఇస్తున్న సన్నబియ్యం గురించి ఎందుకు మాట్లాడలేదు? అని పొంగులేటి నిలదీశారు.

అధికారం పోయిందని అక్కసు : అధికారం పోయిందనే అక్కసును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెళ్లగక్కారని మంత్రి సీతక్క విమర్శించారు. అధికారం పోయిన తర్వాత ఆయన ఫ్యామిలీలో చీలికలు వస్తున్నాయని బాధపడుతున్నారు తప్ప ప్రజల కోసం కాదని అన్నారు. ‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం పదిహేను నెలల్లోనే 59 వేల ఉద్యోగాలు ఇచ్చిందని సీతక్క గుర్తుచేశారు. పార్టీ రజతోత్సవ వేళ ఎవరైనా పార్టీ త్యాగాలు, గొప్పదనాలు చెప్పుకొంటారని కానీ, కేసీఆర్‌ మాత్రం కాంగ్రెస్‌ను విమర్శించేందుకే సభ పెట్టారని మండిపడ్డారు. పేద మహిళల కోసం ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పిస్తే వారిని అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ అంతదారుణంగా పోలీసు వ్యవస్థను ఇంకెవరూ వాడుకోలేదు.

కేసీఆర్‌ గర్వం ఇంకా తగ్గలేదు: ప్రజలు ఓడించి ప్రతిపక్షంలో కూర్చుబెట్టినప్పటికీ కేసీఆర్‌లో ఇంకా గర్వం తగ్గలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. పార్టీ రజతోత్సవ వేదికపై కేసీఆర్‌ మినహా ఒక్క నేత అయినా మాట్లాడకుండా నిరంకుశంగా వ్యవహరించారని విమర్శించారు. బీఆర్ఎస్​ నేతలు నిజాయితీపరులైతే ఆ పార్టీ ఖాతాలో రూ.వేల కోట్లు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. ‘‘ కాళేశ్వరం కార్పొరేషన్‌ ఎండీగా ఉన్న ఉద్యోగి దగ్గర ఇవాళ రూ.200 కోట్లు దొరికాయన్నారు. ఆయనే అంత సంపాదించారంటే కేసీఆర్‌ కుటుంబం ఇంకెంత దోచుకుందో అర్థం చేసుకోవాలని తెలిపారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి ఇచ్చారా? 10 ఏళ్లు ప్రైవేటు వ్యక్తి చేతిలో ఉన్న కంచ గచ్చిబౌలి భూములను ఎందుకు పట్టించుకోలేదు? అని నిలదీశారు. ఏ తప్పూ చేయకపోతే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నిందితులు విదేశాల్లో ఎందుకు దాక్కున్నారు?’’ అని జూపల్లి ప్రశ్నించారు.

కేసీఆర్‌ అవకాశవాది : కేసీఆర్‌ అవకాశవాదిలా మాట్లాడారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అభిప్రయా. ‘‘సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్‌ అనలేదా?ఇవాళ విలన్‌ అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వారికి ఆ సభా వేదికపై ఎందుకు నివాళి అర్పించలేదు. పార్టీ పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎవరికైనా ఇచ్చారా’’ అని నిలదీశారు.

'ఆపరేషన్‌ కగార్‌' వెంటనే ఆపేయండి! - ప్రభుత్వం నక్సలైట్లను చర్చలకు పిలవాలి : కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.