KTR Spoke on Kancha Gachibowli Lands : పర్యావరణంపై ప్రధాని మోదీకి ఉన్న చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంత విషయంలో మోదీ ఆవేదన కేవలం మాటలకే పరిమితం కాకుండా భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ చేపట్టి కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని సూచించారు.
Dear Hon'ble Prime Minister @narendramodi ji,
— KTR (@KTRBRS) April 18, 2025
I was heartened to hear your speech about the destruction of Kancha Gachibowli Forest by Telangana CM Revanth Reddy. However, I hope it's not just lip service
The devastation in Kancha Gachibowli is not just a grave environmental… pic.twitter.com/8byfzDwUkR
కంచ గచ్చిబౌలి అంశం కేవలం వందల ఎకరాల పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రూ.10 వేల కోట్ల ఆర్థిక మోసం అని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐ, ఆర్బీఐ, సెబీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ సంస్థలకు ఆధారాలతో సహా ఈ ఆర్థిక మోసం గురించి తెలియజేశామని కేటీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మోసాలు చేసే వారిని ప్రజలు ముందు నిల్చోబెట్టాల్సిన అవసరం ఉందని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
'చెట్లు కొట్టేసే ముందు పర్మిషన్ తీసుకున్నారా?' : కంచ గచ్చిబౌలి వ్యవహారంపై సుప్రీం సీరియస్
'ఆ 400 ఎకరాలు ముమ్మాటికీ ప్రభుత్వ భూములే' : 'కంచ గచ్చిబౌలి'పై సుప్రీంలో అఫిడవిట్