CM Revanth Reddy Comments on KCR Comments : ఆపరేషన్ కగార్పై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మావోయిస్టుల అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు. కేసీఆర్ ప్రసంగంలో స్పష్టత లేదని, కేవలం అక్కసు వెళ్లగక్కారని రేవంత్రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ఎన్ని చెప్పినా బీఆర్ఎస్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఎంత చెప్పినా హైదరాబాద్లోనే టైమ్ పాస్ చేస్తున్నారని, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలు వివరించాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీలో ఓపికగా ఉంటేనే పదవులు వస్తాయని, తొందరపడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నష్టపోతారని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
జానారెడ్డి, కేకేలతో సీఎం రేవంత్ భేటీ : ఆపరేషన్ కగార్పై ప్రభుత్వం ఎలా వ్యవహరించాలనే అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు కే.కేశవరావుతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని ప్రజా సంఘాల ప్రతినిధులు ఆదివారం రేవంత్ రెడ్డిని కోరిన నేపథ్యంలో ఇవాళ జానారెడ్డి, కేకేతో ఆయన భేటీ అయ్యారు. ఆపరేషన్ కగార్పై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం విధానం ప్రకటించనున్నట్లుగా ఆయన వెల్లడించారు. చర్చల తర్వాత మీడియా ప్రతినిధులతో రేవంత్ రెడ్డి చిట్ చాట్గా మాట్లాడారు.
బీఆర్ఎస్ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు : ఆదివారం జరిగిన కేసీఆర్ సభపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రసంగంలో స్పష్టత లేదని, అభద్రతా భావంతో అక్కసు వెళ్లగక్కారని ఆరోపించారు. కేసీఆర్ ఎన్ని చెప్పినా బీఆర్ఎస్ను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. కేసీఆర్, మోదీ తమ అవసరాలకు అనుగుణంగా మాటలు మారుస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీకి, తనకు గ్యాప్ ఉందన్న చర్చలో వాస్తవం లేదని, అయితే తమ సంబంధాన్ని బయటి ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
దేశానికి ఇందిరా గాంధీ లాంటి ప్రధాని కావాలి : దేశానికి ఇందిరాగాంధీ లాంటి ప్రధాని కావాలని, రెండు దేశాలను ఓడించిన ఘనత ఇందిరమ్మదేనని అన్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఎంత చెప్పినా హైదరాబాద్లోనే టైమ్ పాస్ చేస్తున్నారని, ప్రజల్లోకి వెళ్లి పథకాలను వివరించాలని స్పష్టం చేశారు. పార్టీలో ఓపికగా ఉంటేనే పదవులు వస్తాయన్న ఆయన, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నష్టపోతారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అధికారుల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుందన్నారు.

తమ వారు వేరే వాళ్లు అంటూ ఉండరు : అధికారుల్లో తమ వారు, వేరే వాళ్లు అంటూ ఉండరని వ్యాఖ్యానించారు. సమర్థత ఉన్న అధికారులను గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నప్పటికీ కొనసాగించక తప్పదని సీఎం అన్నారు. కొందరు అధికారులు సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఎన్నికలకు చివరి 6 నెలలు తన పాలనపై చర్చ జరుగుతుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మరో ఇరవై ఏళ్లు తాను రాజకీయాల్లో ఉంటానని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. అరెస్టుల విషయంలో తొందరపడమని, చట్ట ప్రకారమే నడుచుకుంటామని సీఎం స్పష్టం చేశారు. పార్టీలో ఓపికగా ఉంటే పదవులు వస్తాయని, తొందరపడి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే నష్టపోతారని రేవంత్ రెడ్డి అన్నారు. తాను మాటిస్తే చేసి తీరుతానని, ఇచ్చిన హామీ మేరకు అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ ఇప్పించినట్లు చెప్పారు.
'ఆపరేషన్ కగార్' వెంటనే ఆపేయండి! - ప్రభుత్వం నక్సలైట్లను చర్చలకు పిలవాలి : కేసీఆర్
ఇప్పటి నుంచి నేను బయటికి వస్తా, అందరి తరఫున పోరాడుతా : కేసీఆర్