IT Knowledge Hub In Puppalaguda Hyderabad : పుప్పాలగూడలో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులు, రెవెన్యూ, స్పెషల్ పోలీసు సొసైటీలకు కేటాయించిన భూముల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
సుప్రీంకోర్టు రద్దు చేసింది : సుమారు 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. పుప్పాలగూడలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్లు, రెవెన్యూ అధికారులు, స్పెషల్ పోలీస్ మ్యూచువల్ కో-ఆపరేటివ్ సొసైటీలకు గతంలో ప్రభుత్వం కేటాయించిన 200 ఎకరాలను సుప్రీంకోర్టు రద్దు చేసినట్లు అధికారులు వివరించారు.
ఏఐ టెక్నాలజీ : వాటి పక్కన టీజీఐఐసీకి చెందిన మరో 250 ఎకరాలు ఉన్నట్లు మంత్రులకు తెలిపారు. ఏఐ టెక్నాలజీలో వేగంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవాలని మంత్రుల సబ్ కమిటీ స్పష్టం చేసింది. పుప్పాలగూడలో 450 ఎకరాల్లో నాలెడ్జ్ హబ్ అభివృద్ధి చేస్తూ దశాబ్దాలుగా కొనసాగుతున్న హైదరాబాద్ ప్రగతిని మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు. కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
హెచ్సీయూ విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తేయండి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
గతంలో అసెంబ్లీ ఆమోదం లేకుండా రూ.2.30లక్షల కోట్లు ఖర్చు చేశారు : భట్టి విక్రమార్క