Tirumala Arjitha Seva Tickets July Quota 2025 : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం భారత్లో ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ ఏడుకొండలపై విష్ణుమూర్తి అవతారంలో శ్రీనివాసుడు కొలువై ఉన్నాడు. కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు బారులు తీరుతుంటారు. అయితే, శ్రీవారి దర్శనభాగ్యం మాత్రమే కాకుండా ఆ వెంకన్నకు సేవ చేసుకునే భాగ్యాన్ని కూడా కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ).
అందులో భాగంగా 3 నెలల ముందుగానే ఆన్లైన్ ద్వారా ఆర్జిత సేవల టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జులై నెల కోటా విడుదల తేదీలను ప్రకటించింది టీటీడీ. మరి, ఏయే టికెట్లు ఏయే తేదీల్లో రిలీజ్ చేయనుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆర్జిత సేవా టికెట్లు : జులై, 2025కు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, అర్చన, తోమాల, అష్టదళ పాదపద్మారాధన వంటి సేవల కోటాను ఈ నెల 19న(రేపు) మార్నింగ్ 10 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేయనుంది టీటీడీ. ఈ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం రేపటి నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మొబైల్కు మెసేజ్ వచ్చిన భక్తులు ఈ నెల 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు అందుకు సంబంధించిన డబ్బులు చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయని పేర్కొంది టీటీడీ.
కల్యాణోత్సవం, వర్చువల్ సేవల కోటా : ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లకు సంబంధించిన జులై కోటాను ఏప్రిల్ 22న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన టికెట్లను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ.
టీటీడీ కీలక నిర్ణయం - సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు ఈజీగా రూమ్స్ - కానీ?

అంగప్రదక్షిణ టోకెన్లు : ఈ నెల 23న మార్నింగ్ 10 గంటలకు జులైకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అలాగే, అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం కోటా టికెట్లు, మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది టీటీడీ .
స్పెషల్ దర్శనం టికెట్లు ఎప్పుడంటే?
ఇకపోతే జులై నెల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల (రూ.300 దర్శన టికెట్లు) కోటాను ఏప్రిల్ 24 ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారు. అలాగే, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి, తిరుమలలో గదుల బుకింగ్ కోటాను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొస్తారు టీటీడీ అధికారులు.
కాబట్టి జులైలో తిరుమల వెళ్లాలనుకుంటున్న భక్తులు ఈ విషయాన్ని గమనించి https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ను సందర్శించి శ్రీవారి ఆర్జితసేవలు, స్పెషల్ దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

తక్కువ ధరకే హైదరాబాద్ నుంచి తిరుమల - IRCTC సమ్మర్ ప్యాకేజీ!
భక్తులకు-శ్రీవారికి మధ్య 'గూగుల్ ఏఐ' - భక్తుడు ఎప్పుడైనా దర్శనం చేసుకునేలా శాశ్వత ఐడీ కార్డు?