Make Delicious Curd Curry at Home : భోజనం సమయానికి ఇంట్లో తగిన కూర లేకపోతే ఎంతో చిరాగ్గా ఉంటుంది. మళ్లీ కర్రీ చేయాలంటే అదో పెద్ద కష్టం. ఇలాంటి సందర్భాల్లో వెంటనే చేసుకునే రెసిపీ ఉంది. అదే కమ్మని "పెరుగు కర్రీ". మరి, కూరగాయలు లేకుండానే చేసే ఈ కర్రీ ఎలా తయారవుతుందో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- పెరుగు - ఒక కప్పు
- శనగపిండి - ఒక స్పూన్
- నూనె - మూడు స్పూన్లు
- పసుపు - పావు స్పూన్
- ధనియాల పొడి - అర స్పూన్
- కారం - ఒక స్పూన్
- ఆవాలు - అర స్పూన్
- జీలకర్ర - అర స్పూన్
- గరం మసాలా - పావు స్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- ఉప్పు - తగినంత
తయారీ విధానమిలా :
- కడాయిలో నూనె వేసి, వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడే దాకా చూడాలి.
- ఇప్పుడు శనగపిండిని వేసుకొని, ఉండలు కట్టకుండా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలపాలి.
- ఇప్పుడు స్టౌ సిమ్లో పెట్టి, పసుపు, ఉప్పు, కారం, ధనియా పొడి, మసాలా వేసుకోవాలి.
- మసాలాలన్నింటినీ నూనెలో చక్కగా కలపాలి.
- ఇప్పుడు స్టౌ మీడియం ఫ్లేమ్కి పెంచి, పెరుగు వేసి, ఉండలు కట్టకుండా మొత్తం కలిసేలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి.
- పెరుగు వేశాక కూర చిక్కబడటం మొదలవ్వుద్ది. మీకు కావాల్సిన చిక్కదనం వచ్చే దాకా ఉడికించాలి.
- ఆ తర్వాత కొత్తిమీర చల్లి, స్టౌ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నోరూరించే "కమ్మని పెరుగు కూర" సిద్ధమై పోతుంది.
- నచ్చితే తప్పుకుండా ట్రై చేయండి. చపాతీ, అన్నం, రోటీలోకి చాలా బాగుంటుంది.
టిప్స్ :
- ఇక్కడ పెరుగును చెప్పిన పరిమాణంలో కంటే కాస్త ఎక్కువ కూడా తీసుకోవచ్చు. అయితే, పెరుగు కొద్దిగా ఎక్కువగా ఉంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది.
- అలాగే, కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకోవడం వద్దనేది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే కూర మంచి కలర్ఫుల్గా కనిపించడానికి ఇది తోడ్పడుతుంది.
- ఇక్కడ శనగపిండిని వేయించేటప్పుడు కలుపుతూ ఉండడం చాలా ముఖ్యం. లేదంటే పిండి అడుగంటుకుపోతుందని గుర్తుంచుకోవాలి.
- చివర్లో కొత్తిమీర తరుగు వేయడం వల్ల కూరకు మంచి రుచి, సువాసన వస్తుంది.
ఈ సమ్మర్లో చారు ఉండాల్సిందే - ఈ పద్ధతిలో చేయండి - ఏకంగా రసం తాగేస్తారు!