Semi Gravy Fish Fry in Telugu : నాన్వెజ్ ప్రియులు ఫిష్ పులుసు ఎంత ఇష్టంగా తింటారో చేపల వేపుడు ఓ పట్టు పట్టేస్తారు. చేపల పులుసు కోసం వాటిని మ్యారినేట్ చేసిన తర్వాత మంచి ముక్కలను పాన్లో కాస్త నూనె వేసి ఫ్రై చేస్తుంటారు. కారం, మసాలాలతో ఈ ఫిష్ ఫ్రై అలాగే తింటుంటారు. అయితే, ఈ చేప ముక్కలను ఫ్రై చేసిన తర్వాత ఇలా గ్రేవీతో వేపుడు చేయండి. టేస్ట్ వేడివేడి అన్నంలోకి అద్దిరిపోతుంది. ఈ సెమీ గ్రేవీ చేపల వేపుడు ఒక్కటి ఉంటే చాలు అన్నం తృప్తిగా తినొచ్చు. పైగా ఈ చేపల వేపుడు చేయడం కూడా చాలా ఈజీ. మరి సింపుల్గా సెమీ గ్రేవీ చేపల వేపుడు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
హోటల్ చట్నీ టేస్ట్ సీక్రెట్ ఏమీ లేదు! - పల్లీలను ఇలా చేసి చూడండి చట్నీ కోసమే టిఫిన్ తినేస్తారు!

కావాల్సిన పదార్థాలు
- చేప ముక్కలు - కేజీ
- 6 టేబుల్స్పూన్లు - ఆయిల్
- ఉప్పు, కారం - రుచికి సరిపడా
- ఉల్లిపాయలు - 3
- కరివేపాకు - 4
- టీస్పూన్ - అల్లం వెల్లుల్లి పేస్ట్
- అరటీస్పూన్ - పసుపు
- టీస్పూన్ - ధనియాలపొడి
- టీస్పూన్ - జీలకర్ర పొడి
- పచ్చిమిర్చి - 3

మ్యారినేషన్ మసాలా ప్రిపేర్ చేయడం కోసం
- 2 టీస్పూన్లు - అల్లం-వెల్లుల్లి పేస్ట్
- రుచికి సరిపడా కారం, ఉప్పు
- టీస్పూన్ - పసుపు
- ధనియాలపొడి - టేబుల్స్పూన్

తయారీ విధానం
- ముందుగా చేప ముక్కలు ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపండి. ఆపై రెండుమూడు సార్లు నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేపలను ఉప్పు, నిమ్మరసంతో కడగడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటాయి.
- మసాలా ప్రిపేర్ చేయడం కోసం ఒక ప్లేట్లో 2 టీస్పూన్లు అల్లం-వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా కారం, ఉప్పు, టీస్పూన్ పసుపు, ధనియాలపొడి టేబుల్స్పూన్ వేసి కొద్దిగా నూనె వేసి పేస్ట్లాగా కలుపుకోవాలి. పేస్ట్ మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవచ్చు.

- ఈ మసాలా పేస్ట్ని చేప ముక్కలకు పట్టించాలి. మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి.
- ఒక మిక్సీ గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ గ్రేవీ చేపల ఫ్రైలోకి ఉల్లిపాయలు కాస్త ఎక్కువగా వేసుకుంటేనే రుచిగా ఉంటుంది.
- ఇప్పుడు స్టవ్పై కడాయి పెట్టి 6 టేబుల్స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేయండి. ఈ గ్రేవీకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది.

- ఆయిల్ వేడయ్యాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు వేడివేడి నూనెలో చేప ముక్కలు వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- చేప ముక్కలు వేసిన తర్వాత కరివేపాకు వేయండి. చేప ముక్కలు ఒక వైపు వేగిన తర్వాత మరొక వైపు తిప్పి కాల్చుకోవాలి. చేపలను క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇప్పుడు పాన్లోని అదే నూనెలో గ్రైండ్ చేసిన ఆనియన్ పేస్ట్ వేసి నిమిషంపాటు ఫ్రై చేసుకోవాలి.

- ఆపై టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, అరటీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, టీస్పూన్ ధనియాలపొడి, టీస్పూన్ జీలకర్ర పొడి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి 2 నిమిషాలపాటు బాగా ఫ్రై చేసుకోవాలి.
- అనంతరం ఫ్రై చేసుకున్న చేప ముక్కలు వేసి నిదానంగా కలుపుకోవాలి. చివరిగా చేపల ఫ్రైలో కాస్త కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ ఆఫ్ చేయండి.
- అంతే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే సూపర్ టేస్టీగా గ్రేవీతో ఉండే చేపల వేపుడు మీ ముందుంటుంది.
- ఈ సెమీ గ్రేవీ ఫిష్ ఫ్రై తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి!
కరకరలాడే "అలసంద వడలు" - పిండి ఇలా కలిపితే టేస్టీ మరియు క్రిస్పీ!
చేపల పులుసు కమ్మగా ఉండాలా - ఈ "మసాలా దినుసులు" యాడ్ చేస్తే అదుర్స్!