ఈ రెండు వేసి "పల్లీ చట్నీ" చేయండి - హోటల్స్ను మించిన టేస్ట్ - టిఫెన్ కాస్త ఎక్కువే తింటారు!
ఈ స్టైల్లో "పల్లీ చట్నీ" చేసుకోండి - టిఫెన్స్ని నంజుకొని తినకుండా ముంచుకొని తింటారు!

Published : May 8, 2025 at 10:28 AM IST
Easy Guide to Make Peanut Chutney : టిఫెన్స్లోకి ఎక్కువ మంది చేసే చట్నీలలో పల్లీ పచ్చడి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. దీన్ని ఒక్కొక్కరు ఒక్కోవిధంగా చేస్తుంటారు. పల్లీలను వేయించడం దగ్గర నుంచి అందులో వేసే ఇంగ్రీడియంట్స్ వరకు ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. అయితే, మీరూ ఇప్పటివరకు రకరకాల వెరైటీల్లో ఈ చట్నీని ట్రై చేసి ఉంటారు. కానీ, ఈసారి కాస్త స్పెషల్గా ఈ పద్ధతిలో పల్లీ చట్నీ చేసుకోండి. పర్ఫెక్ట్గా కుదరడమే కాకుండా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇలా చేస్తే ఇడ్లీ, దోశ, బోండా వంటివి చట్నీలో నంజుకొని తినకుండా, ముంచి ఒకటికి నాలుగు తింటారు. పైగా ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ! మరి, ఈ సూపర్ టేస్టీ పల్లీ చట్నీ కోసం కావాల్సిన పదార్థాలేంటి, తయారీ విధానంపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.
కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :
- పల్లీలు - ఒక కప్పు
- పచ్చిమిర్చి - 5 నుంచి 6
- నూనె - ఒక టేబుల్స్పూన్
- ధనియాలు - ఒక టేబుల్స్పూన్
- జీలకర్ర - అరటీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - మూడు
- ఉప్పు - రుచికి సరిపడా
- చింతపండు - ఉసిరికాయ సైజంత
- బెల్లం - చిన్న ముక్క
వేసవిలో ఒంటికి చలువ చేసే "టిఫెన్" - బరువు తగ్గాలనుకునేవారు, షుగర్ ఉన్నోళ్లు హాయిగా తినొచ్చు!

తయారీ విధానం :
- ఈ చట్నీ తయారీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి పల్లీలను వేసి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి.
- కొద్దిసేపటికి పల్లీలు వేగి పొట్టు ఊడడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి.
- అవి పూర్తిగా చల్లారిన తర్వాత మళ్లీ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ పల్లీలు పూర్తిగా వేగే వరకు మరికాసేపు కలుపుతూ వేయించుకోవాలి.
- ఇలా చేయడం ద్వారా వేరుశనగ గుండ్లు మచ్చలు లేకుండా అన్ని ఒకే రంగులో లోపలి వరకు చక్కగా వేగి పచ్చడి రుచి బాగుంటుంది.
- అలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పుగుత్తితో ఒకసారి పల్లీలను మెదిపి పొట్టు మొత్తం తొలగించుకొని పక్కన పెట్టుకోవాలి.

- ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక పచ్చిమిర్చి ముక్కలు, ధనియాలు, జీలకర్ర వేసి కాసేపు వేయించుకోవాలి.
- అవి కొద్దిగా వేగిన తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు, వేయించిన పచ్చిమిర్చి మిశ్రమం, ఉప్పు, చింతపండు, బెల్లం ముక్క వేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో తగినన్ని నీటిని కొద్దికొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆపై గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే, ఈ స్టేజ్లో ఉప్పు, కారం, పులుపు వంటివి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చట్నీకి తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి.

తాలింపు కోసం :
- నూనె - 1 టేబుల్స్పూన్
- ఆవాలు - ఒకటీస్పూన్
- శనగపప్పు - ఒక టేబుల్స్పూన్
- మినపప్పు - ఒక టేబుల్స్పూన్
- అందుకోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడయ్యాక ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి తుంపలు, కరివేపాకు వేసి పోపుని చక్కగా వేయించుకోవాలి.
- అది వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీ చట్నీలో వేసి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతే, సూపర్ టేస్టీగా ఉండే కమ్మని "పల్లీ చట్నీ" రెడీ!
- ఇక్కడ చట్నీ కాస్త పలుచగా ఉంటే ఇష్టపడేవారు మరికొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు.

టిప్స్ :
- ఇక్కడ చట్నీ కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే పచ్చిమిర్చిని కాస్త పెంచి వేసుకోవచ్చు.
- పల్లీలను వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్ మీదనే నిదానంగా వేయించుకోవాలి. అప్పుడే అవి లోపలి వరకు చక్కగా వేగి చట్నీ రుచికరంగా వస్తుంది.
ఒంగోలు స్పెషల్ "గంగాళం ఉప్మా with ఎర్ర చట్నీ" - ఒక్కసారి తింటే జిందగీ ఫుల్ ఖుష్!
కొబ్బరి చట్నీలో ఒక్క గుప్పెడు ఇవి వేస్తే చాలు - రుచి అమోఘంగా ఉంటుంది! - ఈ సారి తప్పక ట్రై చేయండి!

