ETV Bharat / offbeat

"ఈ వేసవి చల్లచల్లగా గడిచేలా IRCTC టూర్ ప్లాన్" - విజయవాడ నుంచి భారత్ గౌరవ్ ప్రత్యేక రైళ్లు - IRCTC SAPTA JYOTIRLINGA YATRA

సప్త జ్యోతిర్లింగాల దర్శనం - హరిద్వార్, రిషికేశ్ సందర్శించే చాన్స్

irctc_summer_package
irctc_summer_package (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 3, 2025 at 2:57 PM IST

2 Min Read

IRCTC Summer package : వేసవిలో పుణ్యక్షేత్రాలను సందర్శించే యాత్రికుల సౌకర్యార్థం IRCTC ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. భారత్ గౌరవ్ ప్రత్యేక రైళ్ల పేరిట విజయవాడ మీదుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి రైల్వే శాఖ నడుపనుంది. యాత్రికులకు అందుబాటు ధరలో టికెట్ చార్జీలు నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు.

తిరుపతిలో శ్రీవారి దర్శనం కావాలా? - IRCTC స్పెషల్ ప్యాకేజీ - గదులు సైతం!

వైష్ణోదేవి ఆలయంతో పాటు అయోధ్య, ద్వారక నగరాలను చూసివచ్చేలా IRCTC ప్యాకేజీలు ఉన్నాయి. ముందుగా ఈ నెల 4న పంచ జ్యోతిర్లింగ యాత్ర పార్రంభం కానుంది. ఆ తర్వాత 8 నుంచి కాశీ, ప్రయాగ, అయోధ్య యాత్ర ఉంటుందని అధికారులు వెల్లడించారు.

టూర్ ప్యాకేజీలు పిల్లలు, పెద్దలు, ఏసీ, నాన్ ఏసీ విభాగాల్లో వేర్వేరు ధరల్లో అందుబాటులో ఉంటాయి. రైలు, రోడ్డు మార్గాల్లో సందర్శనీయ ప్రాంతాలకు తీసుకువెళ్తారు. వసతి సౌకర్యంతో పాటు IRCTC భోజన, అల్పాహార వసతి కల్పిస్తుంది.

ఈ నెల 8 నుంచి 19 వరకు సప్త జ్యోతిర్లింగ యాత్ర దర్శన యాత్ర ప్రారంభమవుతుంది. ఉజ్జయిని సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర (SAPTA JYOTIRLINGA DARSHAN YATRA) మొత్తం 12 రోజులు 11 రాత్రులు ఉంటుంది. ఇందులో భాగంగా ఉజ్జయిని లోని మహా కాళేశ్వర్ (ఓం కారేశ్వర్), ద్వారక లోని నాగేశ్వర్, సోమనాథ్​లో సోమనాథేశ్వర్, పుణెలోని భీమ శంకర్, నాసిక్ లోని త్రయంబకేశ్వర్, ఔరంగాబాద్ లోని గృష్ణేశ్వర్ ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇందులో స్లీపర్ SL 460, 3AC 206, 2AC 52 చొప్పున మొత్తం 718ఖాళీలున్నాయి.

ఈ నెల 23 నుంచి మే 2 వరకు కొనసాగే హరిద్వార్, రిషికేష్, ఆనంద్ పూర్, నయనదేవి, అమృత్ సర్, మాతా వైష్ణోదేవి ఆలయాల సందర్శనకు ఒక్కొక్కరికి 18 వేల 510 రూపాయలు టికెట్ గా నిర్ణయించారు.

ఈ నెల 8 నుంచి 17 వరకు కొనసాగే కాశి, గయా, ప్రయాగ్, అయోధ్య యాత్రలో ఆయా క్షేత్రాల సందర్శనకు 16 వేల 800 రూపాయలు టికెట్ రుసుముగా నిర్ణయించారు. ఈ నెల 22 నుంచి 30 వరకు 9 రోజుల పాటు నడిచే అరుణాచలం - ముధురై- రామేశ్వరం యాత్రకు 14 వేల 700 రూపాయలతో పూర్తి చేయవచ్చు.

ఈ నెల 4 నుంచి 12 వరకు 9 రోజుల పాటు జరిగే పంచజ్యోతిర్లింగ యాత్ర కు 14700 రుసుముగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. టికెట్లను IRCTC వెబ్ సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. టికెట్ల బుకింగ్ సహా ఇతర వివరాలకు 92814 95848 నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.

"వేసవిలో చల్లచల్లగా" - కేరళ, ఊటీ, అరకు - IRCTC ఐదు టూర్ ప్యాకేజీలు

గురువారం "షిర్డీ సాయి"ని దర్శించుకోవాలనుకుంటున్నారా? - IRCTC ఈ ప్యాకేజీ మీ కోసమే!

IRCTC Summer package : వేసవిలో పుణ్యక్షేత్రాలను సందర్శించే యాత్రికుల సౌకర్యార్థం IRCTC ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. భారత్ గౌరవ్ ప్రత్యేక రైళ్ల పేరిట విజయవాడ మీదుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి రైల్వే శాఖ నడుపనుంది. యాత్రికులకు అందుబాటు ధరలో టికెట్ చార్జీలు నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు.

తిరుపతిలో శ్రీవారి దర్శనం కావాలా? - IRCTC స్పెషల్ ప్యాకేజీ - గదులు సైతం!

వైష్ణోదేవి ఆలయంతో పాటు అయోధ్య, ద్వారక నగరాలను చూసివచ్చేలా IRCTC ప్యాకేజీలు ఉన్నాయి. ముందుగా ఈ నెల 4న పంచ జ్యోతిర్లింగ యాత్ర పార్రంభం కానుంది. ఆ తర్వాత 8 నుంచి కాశీ, ప్రయాగ, అయోధ్య యాత్ర ఉంటుందని అధికారులు వెల్లడించారు.

టూర్ ప్యాకేజీలు పిల్లలు, పెద్దలు, ఏసీ, నాన్ ఏసీ విభాగాల్లో వేర్వేరు ధరల్లో అందుబాటులో ఉంటాయి. రైలు, రోడ్డు మార్గాల్లో సందర్శనీయ ప్రాంతాలకు తీసుకువెళ్తారు. వసతి సౌకర్యంతో పాటు IRCTC భోజన, అల్పాహార వసతి కల్పిస్తుంది.

ఈ నెల 8 నుంచి 19 వరకు సప్త జ్యోతిర్లింగ యాత్ర దర్శన యాత్ర ప్రారంభమవుతుంది. ఉజ్జయిని సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర (SAPTA JYOTIRLINGA DARSHAN YATRA) మొత్తం 12 రోజులు 11 రాత్రులు ఉంటుంది. ఇందులో భాగంగా ఉజ్జయిని లోని మహా కాళేశ్వర్ (ఓం కారేశ్వర్), ద్వారక లోని నాగేశ్వర్, సోమనాథ్​లో సోమనాథేశ్వర్, పుణెలోని భీమ శంకర్, నాసిక్ లోని త్రయంబకేశ్వర్, ఔరంగాబాద్ లోని గృష్ణేశ్వర్ ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇందులో స్లీపర్ SL 460, 3AC 206, 2AC 52 చొప్పున మొత్తం 718ఖాళీలున్నాయి.

ఈ నెల 23 నుంచి మే 2 వరకు కొనసాగే హరిద్వార్, రిషికేష్, ఆనంద్ పూర్, నయనదేవి, అమృత్ సర్, మాతా వైష్ణోదేవి ఆలయాల సందర్శనకు ఒక్కొక్కరికి 18 వేల 510 రూపాయలు టికెట్ గా నిర్ణయించారు.

ఈ నెల 8 నుంచి 17 వరకు కొనసాగే కాశి, గయా, ప్రయాగ్, అయోధ్య యాత్రలో ఆయా క్షేత్రాల సందర్శనకు 16 వేల 800 రూపాయలు టికెట్ రుసుముగా నిర్ణయించారు. ఈ నెల 22 నుంచి 30 వరకు 9 రోజుల పాటు నడిచే అరుణాచలం - ముధురై- రామేశ్వరం యాత్రకు 14 వేల 700 రూపాయలతో పూర్తి చేయవచ్చు.

ఈ నెల 4 నుంచి 12 వరకు 9 రోజుల పాటు జరిగే పంచజ్యోతిర్లింగ యాత్ర కు 14700 రుసుముగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. టికెట్లను IRCTC వెబ్ సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. టికెట్ల బుకింగ్ సహా ఇతర వివరాలకు 92814 95848 నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.

"వేసవిలో చల్లచల్లగా" - కేరళ, ఊటీ, అరకు - IRCTC ఐదు టూర్ ప్యాకేజీలు

గురువారం "షిర్డీ సాయి"ని దర్శించుకోవాలనుకుంటున్నారా? - IRCTC ఈ ప్యాకేజీ మీ కోసమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.