IRCTC Wayanad Tour: పచ్చని కొండలు, ప్రకృతి అందాలకు నిలయమైన కేరళను విజిట్ చేసేందుకు చాలా మంది ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి గ్రాడ్స్ ఓన్ కంట్రీని సందర్శించాలని ఆరాటపడుతుంటారు. ఇప్పుడు ఎలాగూ పిల్లలకు సమ్మర్ హలీడేస్ మొదలవుతున్నాయి కాబట్టి, హ్యాపీగా ఎంజాయ్ చేయవచుచ. అయితే అక్కడికి ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తున్నారా? మీ కోసం ఐఆర్సీటీసీ టూరిజం అద్దిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. కేరళ వయనాడ్లోని పలు ప్రదేశాలను విజిట్ చేసేందుకు టూర్ ప్రకటించింది. ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు సాగుతుంది? ధర ఎంత? ఏఏ ప్రదేశాలు కవర్ చేయొచ్చు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కేరళ అందాలు చూసేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ "వండర్స్ ఆఫ్ వయనాడ్" ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి మంగళవారం కాచిగూడ నుంచి ఈ రైలు బయలుదేరుతుంది. ఈ టూర్ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది.
- మొదటి రోజు కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 6.05 గంటలకు రైలు(ట్రైన్ నెం 12789) బయలుదేరుతుంది. రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.
- రెండో రోజు ఉదయం రైలు కన్నూర్కు చేరుకుంటుంది. అక్కడి నుంచి హోటల్కి వెళ్లి ఫ్రెషప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేశాక సెయింట్ ఏంజెలో కోట, అరక్కాల్ మ్యూజియం విజిట్ చేసి వయనాడ్ వెళ్తారు. ఆ దారిలో ఉన్న పలు పర్యటక ప్రాంతాల్ని చూడొచ్చు. ఆ తర్వాత కాల్పెట్ట చేరుకొని ఆ నైట్ అక్కడే బస చేయాలి.

- మూడో రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత కురువాద్వీప్, తిరునెళ్లి ఆలయం, బాణాసుర సాగర్ డ్యామ్ విజిట్ చేస్తారు. ఆ రాత్రికి కాల్పెట్టలోనే బస ఉంటుంది.
- నాలుగో రోజు ఉదయం టిఫెన్ అనంతరం అంబలవయాల్ హెరిటేజ్ మ్యూజియం, సూచిపరా ఫాల్స్, ఎడక్కల్ కేవ్స్, సరస్సు విజిట్ చేస్తారు. ఆ రాత్రికి కాల్పెట్టలోనే బస చేయాలి.
- ఐదో రోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ చెక్ అవుట్ చేసి మధ్యాహ్నానికి కొయ్కోడ్ చేరుకుంటారు. అక్కడ కప్పాడ్ బీచ్లో ఎంజాయ్ చేస్తారు. సాయంత్రం SM స్ట్రీట్లో షాపింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొయ్కోడ్ రైల్వేస్టేషన్లో రాత్రి 11.35కి రైలు ఎక్కాలి.
- ఆరో రోజు రాత్రి 11.40కి కాచిగూడ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

ధర వివరాలు చూస్తే:
- కంఫర్ట్: సింగిల్ షేరింగ్ రూ.37,640, డబుల్ షేరింగ్ రూ.21,220, ట్రిపుల్ షేరింగ్ రూ.17,740గా ఉన్నాయి. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.10,670, విత్ అవుట్ బెడ్ అయితే రూ.9,210గా నిర్ణయించారు.
- స్టాండర్డ్: సింగిల్ షేరింగ్ రూ.34,840, ట్విన్ షేరింగ్ రూ.18,430, ట్రిపుల్ షేరింగ్ రూ.14,950గా నిర్ణయంచారు. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.7,880, విత్ అవుట్ బెడ్ అయితే రూ.6,420గా నిర్ణయించారు.

ప్యాకేజీలో ఉండేవి ఇవే:
- ట్రైన్ టికెట్లు(కంఫర్ట్ అండ్ స్టాండర్డ్)
- లోకల్ ప్లేస్లు చూడటానికి ప్యాకేజీని బట్టి ఏసీ వాహనం
- హోటల్లో స్టేతో పాటు 3 బ్రేక్ఫాస్ట్లు
- ట్రావెల్ ఇన్సూరెన్స్
- ప్రస్తుతం ఈ టూర్ ఏప్రిల్ 29, మే 6, 13, 20, 27, జూన్ 3, 10, 17, 24వ తేదీల్లో అందుబాటులో ఉంది.
- ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్ కోసం ఈ లింక్పై క్లిక్ చేయండి.
భూలోక స్వర్గానికి ఎంట్రీ టికెట్లు! - తక్కువ ధరకే IRCTC కశ్మీర్ సూపర్ ప్యాకేజీ!
కేవలం రూ.2 వేలకే IRCTC అరకు ప్యాకేజీ - ఒక్కరోజులోనే ఈ ప్రదేశాలన్నీ చూడొచ్చు!