ETV Bharat / offbeat

సెలవులకు ముందే తిరుమల వెళ్లేవారికి - IRCTC సూపర్ ప్యాకేజీ - శ్రీకాళహస్తి కూడా! - IRCTC TIRUPATI TOUR PACKAGE

- ప్రశాంతంగా శ్రీనివాసుడి దర్శనం - "కంఫర్ట్​"గా ట్రైన్​ జర్నీ

Hyderabad to Tirumala
Hyderabad to Tirumala (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 18, 2025 at 12:46 PM IST

Updated : March 18, 2025 at 2:11 PM IST

2 Min Read

Hyderabad to Tirumala : స్కూళ్లకు సెలవులు వస్తే తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఏ స్థాయిలో పోటెత్తుతారో అందరికీ తెలిసిందే. అందుకే, ఈ లోగానే తిరుపతి వెళ్లి వచ్చేందుకు కొందరు భక్తులు ప్రణాళిక వేస్తుంటారు. అలాంటి వారికోసం IRCTC సూపర్ ప్యాకేజీ ఆఫర్ చేస్తోంది.

ఈ టూర్ మొత్తం 3 రాత్రులు, 4 పగళ్లుగా సాగుతుంది. ఈ టూర్​లో భాగంగా తిరుమల శ్రీవారి దర్శనం, తిరుచానూరు అమ్మవారి దర్శనం, ఇంకా శ్రీకాళహస్తి దర్శనం కూడా ఉంటుంది. టూర్​కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

మొదటి రోజు :

హైదరాబాద్​ లింగంపల్లి రైల్వేస్టేషన్ నుంచి నారాయణాద్రి ఎక్స్​ ప్రెస్ బయలు దేరుతుంది. సాయంత్రం 5.30 గంటలకు ట్రైన్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6.10 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చేరుతుంది. అక్కడ ప్రయాణికులను ఎక్కించుకొని రాత్రి 7.38 గంటలకు నల్గొండకు చేరుకుంటుంది. రాత్రి మొత్తం ప్రయాణం కొనసాగుతుంది.

రెండవ రోజు :

ఉదయం 5.55 గంటలకు రైలు తిరుపతి చేరుకుంటుంది. అక్కడ IRCTC సిబ్బంది ప్రయాణికులను పికప్​ చేసుకొని హోటల్​కు తీసుకెళ్తారు. ఫ్రెష్ అప్ తర్వాత టిఫెన్ పూర్తి చేసుకున్న తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ దర్శనానికి తీసుకెళ్తారు. దర్శనం పూర్తయిన తర్వాత అక్కడ్నుంచి శ్రీకాళహస్తి ఆలయానికి బయల్దేరుతారు. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి హోటల్​కు బయల్దేరుతారు. ఆ రాత్రి అక్కడే బస చేస్తారు.

మూడవ రోజు :

తెల్లవారు జామున 2.30 గంటలకు తిరుమల శ్రీవారి దర్శనానికి హోటల్ నుండి బయల్దేరుతారు. ఉచిత దర్శనం క్యూ వద్ద దించుతారు. దర్శనం పూర్తయ్యే వరకు సుమారు మధ్యాహ్నం అవుతుంది. ఆ తర్వాత తిరిగి హోటల్​కు తీసుకెళ్తారు. ఆ తర్వాత సాయంత్రం తిరుగు ప్రయాణం మొదలవుతుంది. భక్తులను తిరుపతి రైల్వే స్టేషన్​లో దించుతారు. సాయంత్రం 6.20 గంటలకు రైలు బయల్దేరుతుంది. రాత్రంతా ప్రయాణం సాగుతుంది.

నాలుగవ రోజు :

తెల్లవారు జామున 3.04 గంటలకు రైలు నల్గొండకు చేరుకుంటుంది. ఉదయం 5.35 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. 6.45 గంటలకు లింగంపల్లి రైల్వేస్టేషన్​కు చేరుకుంటుంది. అంతటితో మీ టూర్ ముగుస్తుంది.

టికెట్ ధరల వివరాలు ఇవీ :

  • ఈ ప్రయాణం 3ఏసీ, స్లీపర్ విభాగాల్లో సాగుతుంది.
  • 3ఏసీ విభాగంలో ప్రయాణించాలంటే సింగిల్ షేరింగ్​ టికెట్ ధర రూ.13,950.
  • డబుల్ షేరింగ్​కు రూ.10,860. ట్రిపుల్ షేరింగ్​కు రూ.9,080గా నిర్ణయించారు.
  • పిల్లలకు విత్ బెడ్ రూ.6,620. బెడ్​ లేకుండా రూ.5,560 అవుతుంది.
  • స్లీపర్​లో ప్రయాణించాలంటే సింగిల్ షేరింగ్​ టికెట్ ధర రూ.12,080.
  • డబుల్ షేరింగ్​కు రూ.8,990. ట్రిపుల్ షేరింగ్​కు రూ.7,210గా నిర్ణయించారు.
  • పిల్లలకు విత్ బెడ్ రూ.4,750. బెడ్​ లేకుండా రూ.3,690 అవుతుంది.

ప్యాకేజీలో కవరయ్యేవి ఇవీ :

  • IRCTC తరపున ఒక బ్రేక్ ఫాస్ట్ మాత్రమే అందిస్తారు. ఆ తర్వాత ఏమైనా తినాలంటే ప్రయాణికులే ఖర్చు చేసుకోవాలి.
  • రైలు దిగిన దగ్గర్నుంచి, మళ్లీ రెలు ఎక్కించే వరకు ప్రయాణం ఐఆర్​సీటీసీ చూసుకుంటుంది.
  • దర్శన టికెట్లు, గైడ్ వంటివి భక్తులే చూసుకోవాల్సి ఉంటుంది.
  • ట్రావెల్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంటుంది.
  • ఈ టూర్ ప్రస్తుతానికి ప్రతిరోజూ అందుబాటులో ఉంది.
  • మరిన్ని వివరాల కోసం, ఇంకా టికెట్లు బుక్ చేసుకోవడానికి ఈ లింక్​పై క్లిక్ చేయండి

Hyderabad to Tirumala : స్కూళ్లకు సెలవులు వస్తే తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఏ స్థాయిలో పోటెత్తుతారో అందరికీ తెలిసిందే. అందుకే, ఈ లోగానే తిరుపతి వెళ్లి వచ్చేందుకు కొందరు భక్తులు ప్రణాళిక వేస్తుంటారు. అలాంటి వారికోసం IRCTC సూపర్ ప్యాకేజీ ఆఫర్ చేస్తోంది.

ఈ టూర్ మొత్తం 3 రాత్రులు, 4 పగళ్లుగా సాగుతుంది. ఈ టూర్​లో భాగంగా తిరుమల శ్రీవారి దర్శనం, తిరుచానూరు అమ్మవారి దర్శనం, ఇంకా శ్రీకాళహస్తి దర్శనం కూడా ఉంటుంది. టూర్​కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

మొదటి రోజు :

హైదరాబాద్​ లింగంపల్లి రైల్వేస్టేషన్ నుంచి నారాయణాద్రి ఎక్స్​ ప్రెస్ బయలు దేరుతుంది. సాయంత్రం 5.30 గంటలకు ట్రైన్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6.10 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చేరుతుంది. అక్కడ ప్రయాణికులను ఎక్కించుకొని రాత్రి 7.38 గంటలకు నల్గొండకు చేరుకుంటుంది. రాత్రి మొత్తం ప్రయాణం కొనసాగుతుంది.

రెండవ రోజు :

ఉదయం 5.55 గంటలకు రైలు తిరుపతి చేరుకుంటుంది. అక్కడ IRCTC సిబ్బంది ప్రయాణికులను పికప్​ చేసుకొని హోటల్​కు తీసుకెళ్తారు. ఫ్రెష్ అప్ తర్వాత టిఫెన్ పూర్తి చేసుకున్న తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ దర్శనానికి తీసుకెళ్తారు. దర్శనం పూర్తయిన తర్వాత అక్కడ్నుంచి శ్రీకాళహస్తి ఆలయానికి బయల్దేరుతారు. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి హోటల్​కు బయల్దేరుతారు. ఆ రాత్రి అక్కడే బస చేస్తారు.

మూడవ రోజు :

తెల్లవారు జామున 2.30 గంటలకు తిరుమల శ్రీవారి దర్శనానికి హోటల్ నుండి బయల్దేరుతారు. ఉచిత దర్శనం క్యూ వద్ద దించుతారు. దర్శనం పూర్తయ్యే వరకు సుమారు మధ్యాహ్నం అవుతుంది. ఆ తర్వాత తిరిగి హోటల్​కు తీసుకెళ్తారు. ఆ తర్వాత సాయంత్రం తిరుగు ప్రయాణం మొదలవుతుంది. భక్తులను తిరుపతి రైల్వే స్టేషన్​లో దించుతారు. సాయంత్రం 6.20 గంటలకు రైలు బయల్దేరుతుంది. రాత్రంతా ప్రయాణం సాగుతుంది.

నాలుగవ రోజు :

తెల్లవారు జామున 3.04 గంటలకు రైలు నల్గొండకు చేరుకుంటుంది. ఉదయం 5.35 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. 6.45 గంటలకు లింగంపల్లి రైల్వేస్టేషన్​కు చేరుకుంటుంది. అంతటితో మీ టూర్ ముగుస్తుంది.

టికెట్ ధరల వివరాలు ఇవీ :

  • ఈ ప్రయాణం 3ఏసీ, స్లీపర్ విభాగాల్లో సాగుతుంది.
  • 3ఏసీ విభాగంలో ప్రయాణించాలంటే సింగిల్ షేరింగ్​ టికెట్ ధర రూ.13,950.
  • డబుల్ షేరింగ్​కు రూ.10,860. ట్రిపుల్ షేరింగ్​కు రూ.9,080గా నిర్ణయించారు.
  • పిల్లలకు విత్ బెడ్ రూ.6,620. బెడ్​ లేకుండా రూ.5,560 అవుతుంది.
  • స్లీపర్​లో ప్రయాణించాలంటే సింగిల్ షేరింగ్​ టికెట్ ధర రూ.12,080.
  • డబుల్ షేరింగ్​కు రూ.8,990. ట్రిపుల్ షేరింగ్​కు రూ.7,210గా నిర్ణయించారు.
  • పిల్లలకు విత్ బెడ్ రూ.4,750. బెడ్​ లేకుండా రూ.3,690 అవుతుంది.

ప్యాకేజీలో కవరయ్యేవి ఇవీ :

  • IRCTC తరపున ఒక బ్రేక్ ఫాస్ట్ మాత్రమే అందిస్తారు. ఆ తర్వాత ఏమైనా తినాలంటే ప్రయాణికులే ఖర్చు చేసుకోవాలి.
  • రైలు దిగిన దగ్గర్నుంచి, మళ్లీ రెలు ఎక్కించే వరకు ప్రయాణం ఐఆర్​సీటీసీ చూసుకుంటుంది.
  • దర్శన టికెట్లు, గైడ్ వంటివి భక్తులే చూసుకోవాల్సి ఉంటుంది.
  • ట్రావెల్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంటుంది.
  • ఈ టూర్ ప్రస్తుతానికి ప్రతిరోజూ అందుబాటులో ఉంది.
  • మరిన్ని వివరాల కోసం, ఇంకా టికెట్లు బుక్ చేసుకోవడానికి ఈ లింక్​పై క్లిక్ చేయండి
Last Updated : March 18, 2025 at 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.