ETV Bharat / offbeat

హైదరాబాద్​ నుంచి IRCTC సూపర్ టూర్ - ఒకే ట్రిప్‌లో కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ చూడొచ్చు! - AYODHYA KASHI PUNYA KSHETRA YATRA

ఐఆర్​సీటీసీ సూపర్ ప్యాకేజీ - తక్కువ ధరలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలను వీక్షించే అవకాశం!

IRCTC PUNYA KSHETRA YATRA
Ayodhya Kashi Punya Kshetra Yatra Tour (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 17, 2025 at 4:42 PM IST

3 Min Read

IRCTC Ayodhya Kashi Punya Kshetra Yatra Tour : ఇండియన్​ రైల్వే క్యాటరింగ్ అండ్​​ టూరిజం కార్పొరేషన్​ భారత్‌లో పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు సహా ఇతర దర్శనీయ స్థలాల్లో పర్యటించేందుకు ప్రత్యేకమైన టూర్‌ ప్యాకేజీలను అందిస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా ఉత్తర ప్రదేశ్​లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే వారికోసం తక్కువ ధరలో అద్భుతమైన ప్యాకేజీని తీసుకొచ్చింది. మరి, ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు? ధర ఎంత? ప్రయాణం ఎప్పుడు అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

"అయోధ్య కాశీ పుణ్యక్షేత్ర యాత్ర విత్ జ్యోతిర్లింగ (Ayodhya Kashi Punya Kshetra Yatra with Jyotirlinga)" పేరిట ఈ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది ఐఆర్​సీటీసీ. సికింద్రాబాద్​ నుంచి రైలు ప్రయాణం ద్వారా ​ఈ టూర్​ను​ ఆపరేట్​ చేస్తున్నారు. ఈ ప్యాకేజీలో భాగంగా గయ, కాశీ, అయోధ్య వంటి ప్రముఖ క్షేత్రాలను చూడొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ స్టేషన్ల గుండా ఈ రైలు ప్రయాణం సాగుతుంది. 8 రాత్రులు, 9 పగళ్లు కొనసాగే ఈ యాత్రా విశేషాలు ఇప్పుడు చూద్దాం.

పర్యటన కొనసాగనుందిలా

  • మెదటి రోజున మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ నుంచి పుణ్యక్షేత్ర యాత్ర ప్రారంభమవుతుంది.
  • కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయాడ, ఏలూరు గుండా రైలు ప్రయాణిస్తుంది. ఈ ప్రాంతాల్లో ఉండే వారు అక్కడే రైలు ఎక్కొచ్చు.
  • రెండో రోజు రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, పలాస మీదుగా ప్రయాణించి మూడో రోజు ఉదయం 9 గంటలకు గయా రైల్వే స్టేషన్​కు చేరుకుంటారు.
  • అక్కడి నుంచి ముందుగానే బుక్‌ చేసిన హోటల్‌లో బస ఏర్పాటు ఉంటుంది. లంచ్​ తర్వాత విష్ణుపాద ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ రాత్రి అక్కడే డిన్నర్, బస ఉంటుంది.
  • నాలుగో రోజు మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్ అనంతరం హోటల్​ నుంచి చెక్ అవుట్ అయి గయ రైల్వే స్టేషన్ వెళ్తారు. అనంతరం అక్కడి నుంచి బనారస్​కి బయలుదేరుతారు. అక్కడికి చేరుకున్నాక సారనాథ్​లో డిన్నర్, బస ఏర్పాటు ఉంటుంది.
  • ఐదో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత ఆరోజంతా సైట్​ సీయింగ్​ ఉంటుంది. అందులో భాగంగా కాశీ విశ్వనాథ్​ పుణ్యక్షేత్రం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవీ ఆలయాల దర్శనం ఉంటుంది. సాయంత్రం గంగా హారతిని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఆ రోజు రాత్రి సారనాథ్​లోనే డిన్నర్, బస ఉంటుంది.
  • ఆరో రోజు మార్నింగ్ 7 గంటలకు హోటల్ చెక్ అవుట్ అయి శ్రీరాముని జన్మస్థానమైన అయోధ్యకు బయలుదేరుతారు. మధ్యాహ్నం శ్రీరాముడు, హనుమంతుని ఆలయాలు దర్శించుకుంటారు. అనంతరం సాయంత్రం ప్రయాగ్‌రాజ్​కి పయనమవుతారు.
  • ఏడో రోజు ఉదయం 5 ప్రయాగ్‌రాజ్‌ చేరుకుంటారు. అక్కడ త్రివేణి సంగమాన్ని సందర్శిస్తారు. అనంతరం సికింద్రాబాద్​కు తిరుగు ప్రయాణం​ స్టార్ట్​ అవుతుంది.
  • ఎనిమిది రోజు సాయంత్రం, తొమ్మిదో రోజు పైన పేర్కొన్న స్టేషన్ల మీదుగా ప్రయాణించి సికింద్రాబాద్​ చేరుకోవటంతో యాత్ర కంప్లీట్ అవుతుంది.

ప్యాకేజీ ఛార్జీలు :

  • ఈ టూర్​లో భాగంగా ఒకరు ప్రయాణించాలంటే కంఫర్ట్‌లో రూ.31,160; స్టాండర్డ్‌లో రూ.23,600; ఎకానమీ క్లాస్‌లో రూ.14,390 చెల్లించాలి.
  • 5 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకైతే కంఫర్ట్‌లో రూ.29,900; స్టాండర్డ్‌లో రూ.22,550; ఎకానమీ క్లాస్‌లో రూ.13,495 చెల్లించాలి. అయితే, ట్విన్‌ షేరింగ్‌, ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ బట్టి ఛార్జీలు వేరువేరుగా ఉంటాయి.

ప్యాకేజీలో ఉండేవి ఇవే :

  • సెలక్ట్​ చేసుకున్న ప్యాకేజీని బట్టి ట్రైన్​లో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణం ఉంటుంది.
  • ప్యాకేజీని బట్టి ప్రయాణానికి వాహనం సమకూరుస్తారు.
  • ఉదయం కాఫీ, బ్రేక్​ఫాస్ట్​, భోజనం ప్యాకేజీలోనే అందిస్తారు.
  • ప్రయాణికులకు ట్రావెల్​ ఇన్సూరెన్స్​ అందిస్తారు.
  • ప్రస్తుతం ఈ టూర్ ఫిబ్రవరి​ 27వ తేదీన ప్రారంభమవుతుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీని బుక్​ చేసుకునేందుకు ఈ లింక్​పై క్లిక్చేయండి.

ఇవీ చదవండి :

ఒక్కరోజులోనే 'అరకు' అందాలన్నీ చూసేయండి - రూ.2 వేలకే IRCTC సూపర్​ ప్యాకేజీ!

సికింద్రాబాద్​ నుంచి మహా కుంభమేళాకు డైరెక్ట్ ట్రైన్స్ - కాశీని సైతం చూసొచ్చేలా IRCTC ప్యాకేజీ

IRCTC Ayodhya Kashi Punya Kshetra Yatra Tour : ఇండియన్​ రైల్వే క్యాటరింగ్ అండ్​​ టూరిజం కార్పొరేషన్​ భారత్‌లో పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు సహా ఇతర దర్శనీయ స్థలాల్లో పర్యటించేందుకు ప్రత్యేకమైన టూర్‌ ప్యాకేజీలను అందిస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా ఉత్తర ప్రదేశ్​లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే వారికోసం తక్కువ ధరలో అద్భుతమైన ప్యాకేజీని తీసుకొచ్చింది. మరి, ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు? ధర ఎంత? ప్రయాణం ఎప్పుడు అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

"అయోధ్య కాశీ పుణ్యక్షేత్ర యాత్ర విత్ జ్యోతిర్లింగ (Ayodhya Kashi Punya Kshetra Yatra with Jyotirlinga)" పేరిట ఈ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది ఐఆర్​సీటీసీ. సికింద్రాబాద్​ నుంచి రైలు ప్రయాణం ద్వారా ​ఈ టూర్​ను​ ఆపరేట్​ చేస్తున్నారు. ఈ ప్యాకేజీలో భాగంగా గయ, కాశీ, అయోధ్య వంటి ప్రముఖ క్షేత్రాలను చూడొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ స్టేషన్ల గుండా ఈ రైలు ప్రయాణం సాగుతుంది. 8 రాత్రులు, 9 పగళ్లు కొనసాగే ఈ యాత్రా విశేషాలు ఇప్పుడు చూద్దాం.

పర్యటన కొనసాగనుందిలా

  • మెదటి రోజున మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ నుంచి పుణ్యక్షేత్ర యాత్ర ప్రారంభమవుతుంది.
  • కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయాడ, ఏలూరు గుండా రైలు ప్రయాణిస్తుంది. ఈ ప్రాంతాల్లో ఉండే వారు అక్కడే రైలు ఎక్కొచ్చు.
  • రెండో రోజు రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, పలాస మీదుగా ప్రయాణించి మూడో రోజు ఉదయం 9 గంటలకు గయా రైల్వే స్టేషన్​కు చేరుకుంటారు.
  • అక్కడి నుంచి ముందుగానే బుక్‌ చేసిన హోటల్‌లో బస ఏర్పాటు ఉంటుంది. లంచ్​ తర్వాత విష్ణుపాద ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ రాత్రి అక్కడే డిన్నర్, బస ఉంటుంది.
  • నాలుగో రోజు మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్ అనంతరం హోటల్​ నుంచి చెక్ అవుట్ అయి గయ రైల్వే స్టేషన్ వెళ్తారు. అనంతరం అక్కడి నుంచి బనారస్​కి బయలుదేరుతారు. అక్కడికి చేరుకున్నాక సారనాథ్​లో డిన్నర్, బస ఏర్పాటు ఉంటుంది.
  • ఐదో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత ఆరోజంతా సైట్​ సీయింగ్​ ఉంటుంది. అందులో భాగంగా కాశీ విశ్వనాథ్​ పుణ్యక్షేత్రం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవీ ఆలయాల దర్శనం ఉంటుంది. సాయంత్రం గంగా హారతిని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఆ రోజు రాత్రి సారనాథ్​లోనే డిన్నర్, బస ఉంటుంది.
  • ఆరో రోజు మార్నింగ్ 7 గంటలకు హోటల్ చెక్ అవుట్ అయి శ్రీరాముని జన్మస్థానమైన అయోధ్యకు బయలుదేరుతారు. మధ్యాహ్నం శ్రీరాముడు, హనుమంతుని ఆలయాలు దర్శించుకుంటారు. అనంతరం సాయంత్రం ప్రయాగ్‌రాజ్​కి పయనమవుతారు.
  • ఏడో రోజు ఉదయం 5 ప్రయాగ్‌రాజ్‌ చేరుకుంటారు. అక్కడ త్రివేణి సంగమాన్ని సందర్శిస్తారు. అనంతరం సికింద్రాబాద్​కు తిరుగు ప్రయాణం​ స్టార్ట్​ అవుతుంది.
  • ఎనిమిది రోజు సాయంత్రం, తొమ్మిదో రోజు పైన పేర్కొన్న స్టేషన్ల మీదుగా ప్రయాణించి సికింద్రాబాద్​ చేరుకోవటంతో యాత్ర కంప్లీట్ అవుతుంది.

ప్యాకేజీ ఛార్జీలు :

  • ఈ టూర్​లో భాగంగా ఒకరు ప్రయాణించాలంటే కంఫర్ట్‌లో రూ.31,160; స్టాండర్డ్‌లో రూ.23,600; ఎకానమీ క్లాస్‌లో రూ.14,390 చెల్లించాలి.
  • 5 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకైతే కంఫర్ట్‌లో రూ.29,900; స్టాండర్డ్‌లో రూ.22,550; ఎకానమీ క్లాస్‌లో రూ.13,495 చెల్లించాలి. అయితే, ట్విన్‌ షేరింగ్‌, ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ బట్టి ఛార్జీలు వేరువేరుగా ఉంటాయి.

ప్యాకేజీలో ఉండేవి ఇవే :

  • సెలక్ట్​ చేసుకున్న ప్యాకేజీని బట్టి ట్రైన్​లో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణం ఉంటుంది.
  • ప్యాకేజీని బట్టి ప్రయాణానికి వాహనం సమకూరుస్తారు.
  • ఉదయం కాఫీ, బ్రేక్​ఫాస్ట్​, భోజనం ప్యాకేజీలోనే అందిస్తారు.
  • ప్రయాణికులకు ట్రావెల్​ ఇన్సూరెన్స్​ అందిస్తారు.
  • ప్రస్తుతం ఈ టూర్ ఫిబ్రవరి​ 27వ తేదీన ప్రారంభమవుతుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీని బుక్​ చేసుకునేందుకు ఈ లింక్​పై క్లిక్చేయండి.

ఇవీ చదవండి :

ఒక్కరోజులోనే 'అరకు' అందాలన్నీ చూసేయండి - రూ.2 వేలకే IRCTC సూపర్​ ప్యాకేజీ!

సికింద్రాబాద్​ నుంచి మహా కుంభమేళాకు డైరెక్ట్ ట్రైన్స్ - కాశీని సైతం చూసొచ్చేలా IRCTC ప్యాకేజీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.