నోరూరించే "ఎండు చేపలు - చింతచిగురు" - ఒక్కసారైనా తినాల్సిందే!
- ఈ పద్ధతిలో చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది! - రుచితోపాటు ఆరోగ్యం బోనస్!

Published : October 12, 2025 at 12:44 PM IST
Dry Fish and Tamarind Leaves Curry : నాన్ వెజ్లో చేపలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇందులోనూ ఎండు చేపలను అమితంగా ఇష్టపడేవారు కూడా ప్రత్యేకంగా ఉంటారు! అయితే స్మెల్ వస్తాయనే కారణంతో చాలా మంది వీటిని దూరం పెడతారు. కానీ, ఇందులో చింత చిగురు వేసి సరిగా కుక్ చేస్తే ఈ రెసిపీ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంకా హెల్దీ కూడా! మరి, ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలి? కావాల్సిన పదార్థాలేంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
ఎండు చేపలు - ఒక కప్పు
చింత చిగురు - ఒక కప్పు
ఆనియన్స్ - ఒక కప్పు
శనగపప్పు - ఒక స్పూన్
జీలకర్ర - అర స్పూన్
పచ్చీమిర్చి - నాలుగు
మసాలా - అర స్పూన్
తయారీ విధానం :
- ఎండు చేపలను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తోకలు, ఈకలు తుంచేసుకొని పెట్టుకోవాలి
- ఆ తర్వాత స్టౌ మీద పాన్ పెట్టుకొని, చేపలను అందులో వేసి లో-ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. స్పూన్తో అటూ ఇటూ తిప్పుతూ ఉండాలి
- కాసేపటి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా కలిసేలా తిప్పుకోవాలి. వేగిన తర్వాత వాటిని తీసి పక్కనపెట్టుకోవాలి
- ఇప్పుడు స్టౌ మీద కుకింగ్ పాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత అందులో స్పూన్ ఆయిల్ వేసుకోవాలి
- అందులో స్పూన్ పచ్చి శనగపప్పు, అర స్పూన్ జీలకర్ర, ఐదారు పచ్చి మిర్చీలను తుంచి వేసుకోవాలి
- కాసేపు తర్వాత సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలను కూడా యాడ్ చేయాలి. ఇవి రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డోన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు గరిటతో తిప్పుకుంటూ ఉండాలి
- ఇప్పుడు ఫ్రైచేసి పక్కన పెట్టుకున్న ఎండు చేపలను ఇందులో వేయాలి. ఉల్లిగడ్డలు, ఎండు చేపలు కలిసిపోయేలా చక్కగా మిక్స్ చేసుకోవాలి
- సుమారు 3 నిమిషాల సేపు ఇలా కలుపుకున్న తర్వాత స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు స్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్టు కూడా వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి మూడు నిమిషాల సేపు ఉడకనివ్వాలి.
- ఆ తర్వాత మూత తీసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు స్పూన్ కారం వేసుకోవాలి. రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసి, అదంతా మిశ్రమానికి పట్టేలా మిక్స్ చేసుకొని, మూత పెట్టి మరో మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి
- ఇప్పుడు మూత తీసి ఓసారి మొత్తం కలుపుకొని, అందులో కప్పు చింత చిగురు వేసుకోవాలి. ఈ చిగురు మొత్తం మిశ్రమంలో కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరో మూడు నిమిషాలు ఉడకనివ్వాలి
- మూత తీసి మళ్లీ మిక్స్ ఒకసారి అడుగంటకుండా మిక్స్ చేసుకొని మూత పెట్టేయాలి. కాసేపు ఉడికిన తర్వాత మూత తీసి కలుపుకొని అర స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
- అంతే.. అద్దిరిపోయే చింతచిగురు, ఎండు చేపల కర్రీ సిద్ధమైపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చింత చిగురులో విటమిన్ సీ ఉంటుంది. ఎండు చేపల్లో ఐరన్, కాల్షియం ఉంటుంది.
- సో, రుచితోపాటు ఆరోగ్యం బోనస్ అన్నమాట. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.

