ETV Bharat / offbeat

శ్రీవారి కళ్యాణోత్సవం, సేవల్లో పాల్గొంటారా? - తేదీలను ప్రకటించిన టీటీడీ! - TTD ONLINE TICKET BOOKING

ఆన్​లైన్ కోటా తేదీలను విడుదల చేసిన టీటీడీ - 'స్పెషల్ ఎంట్రీ దర్శనం' ఎపుడంటే!

ttd_online_ticket_booking
ttd_online_ticket_booking (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 18, 2025 at 10:17 AM IST

2 Min Read

TTD Online Ticket Booking : శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల విడుదల తేదీలను టీటీడీ వెల్లడించింది. జూలై నెల కోటాకు సంబంధించి ఆర్జిత సేవలతో పాటు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల తేదీలను వెల్లడించింది.

"జొన్న చపాతీలు" రోజూ చేసుకోవచ్చు - ఇలా ట్రై చేయండి - పెనంపై పొంగుతాయి!

ttd_online_ticket_booking
ttd_online_ticket_booking (ETV Bharat)

ఆర్జిత సేవా టికెట్లు

  • తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లను టీటీడీ ఈ నెల 19న శనివారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనుంది.
  • సుప్రభాతం, అర్చన, తోమాల, అష్టదళ పాదపద్మారాధన తదితర ఆర్జితసేవల టికెట్లను టీటీడీ వెెబ్​సైట్ లో బుక్ చేసుకోవచ్చు.
  • ఈ నెల 19నుంచి 21 వరకు ఈ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్‌ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది. మొబైల్​కు అలర్ట్ మెసేజ్‌ వచ్చిన భక్తులు ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు డబ్బులు చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయని టీటీడీ వెల్లడించింది.
ttd_online_ticket_booking
ttd_online_ticket_booking (ETV Bharat)

ఊంజల్ సేవ, కల్యాణోత్సవంతో పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఏప్రిల్ 22న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. వర్చువల్‌ సేవలు, దర్శనం స్లాట్ల టికెట్లను సైతం అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి.

ఈ నెల 23న బుధవారం ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం కోటా టికెట్లు ఆన్​లైన్​లో విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్​లైన్​లో విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది.

ttd_online_ticket_booking
ttd_online_ticket_booking (ETV Bharat)

స్పెషల్​ దర్శనం టికెట్లు

2025 జులై కోటా 300 రూపాయల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లను ఈ నెల 24న గురువారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అదే విధంగా మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి, తిరుమలలో గదుల బుకింగ్ చేసుకోవచ్చు. జులైలో తిరుమల వెళ్లాలనుకుంటున్న భక్తులు టోకెన్లు, టికెట్ల కోటా విడుదల తేదీలు గమనించి టీటీడీ వెబ్​సైట్​లో టికెట్లు బుక్ చేసుకోవాలి.

"పాయసం" ఇలా చేస్తే ఎవ్వరైనా 'ఫిదా' అవ్వాల్సిందే - ఈ టేస్ట్ సీక్రెట్ ఎవ్వరికీ చెప్పకండి!

"ఫ్లోర్ క్లీనింగ్ నీళ్లలో ఇవి కలిపి చూడండి! - చీమలు, బొద్దింకలు పారిపోతాయి - ఇల్లంతా సువాసన

TTD Online Ticket Booking : శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల విడుదల తేదీలను టీటీడీ వెల్లడించింది. జూలై నెల కోటాకు సంబంధించి ఆర్జిత సేవలతో పాటు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల తేదీలను వెల్లడించింది.

"జొన్న చపాతీలు" రోజూ చేసుకోవచ్చు - ఇలా ట్రై చేయండి - పెనంపై పొంగుతాయి!

ttd_online_ticket_booking
ttd_online_ticket_booking (ETV Bharat)

ఆర్జిత సేవా టికెట్లు

  • తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లను టీటీడీ ఈ నెల 19న శనివారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనుంది.
  • సుప్రభాతం, అర్చన, తోమాల, అష్టదళ పాదపద్మారాధన తదితర ఆర్జితసేవల టికెట్లను టీటీడీ వెెబ్​సైట్ లో బుక్ చేసుకోవచ్చు.
  • ఈ నెల 19నుంచి 21 వరకు ఈ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్‌ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది. మొబైల్​కు అలర్ట్ మెసేజ్‌ వచ్చిన భక్తులు ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు డబ్బులు చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయని టీటీడీ వెల్లడించింది.
ttd_online_ticket_booking
ttd_online_ticket_booking (ETV Bharat)

ఊంజల్ సేవ, కల్యాణోత్సవంతో పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఏప్రిల్ 22న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. వర్చువల్‌ సేవలు, దర్శనం స్లాట్ల టికెట్లను సైతం అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి.

ఈ నెల 23న బుధవారం ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం కోటా టికెట్లు ఆన్​లైన్​లో విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్​లైన్​లో విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది.

ttd_online_ticket_booking
ttd_online_ticket_booking (ETV Bharat)

స్పెషల్​ దర్శనం టికెట్లు

2025 జులై కోటా 300 రూపాయల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లను ఈ నెల 24న గురువారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అదే విధంగా మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి, తిరుమలలో గదుల బుకింగ్ చేసుకోవచ్చు. జులైలో తిరుమల వెళ్లాలనుకుంటున్న భక్తులు టోకెన్లు, టికెట్ల కోటా విడుదల తేదీలు గమనించి టీటీడీ వెబ్​సైట్​లో టికెట్లు బుక్ చేసుకోవాలి.

"పాయసం" ఇలా చేస్తే ఎవ్వరైనా 'ఫిదా' అవ్వాల్సిందే - ఈ టేస్ట్ సీక్రెట్ ఎవ్వరికీ చెప్పకండి!

"ఫ్లోర్ క్లీనింగ్ నీళ్లలో ఇవి కలిపి చూడండి! - చీమలు, బొద్దింకలు పారిపోతాయి - ఇల్లంతా సువాసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.