Hotel Style Perugu Vada : ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది శరీరానికి చలువ చేసే ఆహారాలను తీసుకుంటారు. ముఖ్యంగా పెరుగు, మజ్జిగ వంటివి క్రమం తప్పకుండా తీసుకుంటుంటారు. అయితే ఎప్పుడూ పెరుగును ఒకే రకంగా కాకుండా కాస్త రుచికరంగా ఉండేలా పెరుగు వడలు చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు కూడా ఇది పర్ఫెక్ట్. టేస్ట్ అయితే సేమ్లో హోటల్లో చేసినట్లే వస్తుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం నోరూరించే కమ్మని దహీ వడను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- మినపప్పు - 1 కప్పు
- వంటసోడా - చిటికెడు
- నూనె - వేయించడానికి తగినంత
పెరుగు తయారీ కోసం :
- పెరుగు - 4 కప్పులు
- ఉప్పు - రుచికి సరిపడా
- నూనె - ఒకటిన్నర టేబుల్స్పూన్
- తాలింపు గింజలు - 2 టేబుల్స్పూన్లు
- ఎండుమిర్చి - 4
- కరివేపాకు - కొద్దిగా
- అల్లం తురుము - 1 టీస్పూన్
- సన్నని పచ్చిమిర్చి తరుగు - 1 టేబుల్స్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- క్యారెట్ తురుము - 2 టేబుల్స్పూన్లు
- టమాటా ముక్కలు - 2 టేబుల్స్పూన్లు
తయారీ విధానం :
- మినప్పప్పును శుభ్రంగా కడిగి కనీసం 2 నుంచి 3 గంటలపాటు నానబెట్టుకోవాలి.
- పప్పు నానిన తర్వాత మరోసారి కడిగి వడకట్టాలి. ఇలా వడకట్టిన పప్పు, ఉప్పును మిక్సీజార్లోకి వేసుకుంటూ మెత్తగా, గట్టిగా రుబ్బుకోవాలి. ఇక్కడ వాటర్ యూజ్ చేయవద్దనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
- ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో వంటసోడా వేసుకొని 5 నిమిషాల పాటు ఆగకుండా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకుంటే పిండి అనేది ఫ్లఫ్పీగా తయారవ్వడమే కాకుండా వడలు బాగా పొంగి గుల్లగా వస్తాయి.

- పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత గిన్నెపై మూతపెట్టి ఒక గంటపాటు ఫ్రిజ్లో ఉంచుకోవాలి.
- ఆలోపు మీరు రెసిపీలోకి కావాల్సిన పెరుగును ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని అందులో తాజా పెరుగు వేసుకోవాలి.
- ఆపై మీరు పెరుగు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలనుకుంటున్నారో దానికి తగ్గట్లుగా వాటర్, ఉప్పు వేసి విస్కర్ సహాయంతో బాగా బీట్ చేసుకోవాలి.
- ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక పోపు గింజలు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, అల్లం తురుము వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక దింపేముందు ఇంగువ వేసి కలుపుకోవాలి.

- అనంతరం ఈ తాలింపుని ముందుగా బీట్ చేసుకొని పెట్టుకున్న పెరుగులో వేసి కలుపుకోవాలి. ఆపై అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర తరుగు, సన్నని టమాటా ముక్కలు వేసుకొని మిక్స్ చేసుకుంటే చాలు. రెసిపీలోకి కావాల్సిన పెరుగు రెడీ.
- మరో బౌల్లోకి రెండు చెంచాల పెరుగు, కొద్దిగా ఉప్పు, కొన్ని నీళ్లు పోసుకుని పల్చగా కలపి పక్కన ఉంచాలి.
- ఫ్రిజ్లో పెట్టుకున్న పిండిని బయటికి తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. అనంతరం స్టౌపై కడాయి పెట్టి డీప్ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి.
- నూనె వేడయ్యాక స్టౌను మీడియం ఫ్లేమ్లో ఉంచి చేతిని వాటర్లో డిప్ చేసి కొద్దికొద్దిగా పిండిని తీసుకుంటూ వడల మాదిరిగా చేసుకొని కాగుతున్న నూనెలో వేసుకోవాలి. తర్వాత వాటిని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.

- వడలు క్రిస్పీగా వేగాక వాటిని గరిటెతో తీసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే పల్చగా చేసుకున్న మజ్జిగలో వేసుకొని ఓ 10 నిమిషాలు ఉంచాలి.
- ఆ తర్వాత మజ్జిగ పీల్చుకున్న ఆ వడలను తీసుకొని చేతితో కొంచం ప్రెస్ చేసుకొని ముందుగా తాలింపు వేసి రెడీ చేసుకున్న పెరుగులో వేసుకోవాలి. ఇదే ప్రాసెస్ పిండి మొత్తం అయ్యే వరకు కంటిన్యూ చేయాలి.
- ఇలా అన్నీ వడలనూ పెరుగులో వేసుకున్నాక మూతపెట్టి కనీసం 2 గంటలపాట కదపకుండా నానబెట్టుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలు. అంతే ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ "దహీ వడ" రెడీ!

చిట్కాలు:
- ఈ పెరుగు వడల కోసం తీసుకునే పెరుగు అనేది రుచికరంగా ఉండాలి. పెరుగు పుల్లగా ఉంటే వడలు అంత రుచికరంగా ఉండవు.
- అప్పటికప్పుడు పప్పు రుబ్బుకోవడం కష్టమనుకుంటే ముందు రోజు రాత్రే పిండిని గ్రైండ్ చేసుకొని రిఫ్రిజిరేటర్లో ఉంచి నెక్ట్ డే వాడుకోవచ్చు.
- క్యారెట్, టమాటా ముక్కలు మాత్రమే కాకుండా సన్నగా తరిగి కీరా ముక్కలు కూడా వేసుకోవచ్చు.

చుక్క నెయ్యి, నూనె లేకుండా - కుక్కర్లోనే ఈజీగా "చమ్ చమ్ స్వీట్"! - జ్యూసీగా నోరూరిస్తుంది!
పిల్లలకు విపరీతంగా నచ్చే "మసాలా పూరీలు" - ఇలా చేస్తే పొంగడంతో పాటు నూనె పీల్చవు!