ETV Bharat / offbeat

చింతపండు లేకుండా ఘుమఘుమలాడే "చేపల పులుసు'' - ఈ పద్ధతిలో చేస్తే టేస్ట్​ వేరే లెవెల్! - FISH PULUSU WITHOUT TAMARIND

-అద్దిరిపోయే రుచితో చేపలు పులుసు -ఒక్కసారి ఇలా చేస్తే మళ్లీ మళ్లీ చేసుకుంటారు

Fish Pulusu without Tamarind
Fish Pulusu without Tamarind (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 31, 2025 at 2:47 PM IST

Updated : April 1, 2025 at 10:29 AM IST

3 Min Read

Fish Pulusu without Tamarind: చేపలు పులుసు. ఈ పేరు చెబితే చాలు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ఎందుకంటే కారం, ఉప్పు, మసాలాలు పట్టించి చింతపండు రసంలో ఉడికించడం వల్ల రుచి అద్దిరిపోతుంది. అందుకే చాలా మంది తరచుగా ఈ పులుసును పెట్టుకుని తింటుంటారు. అయితే చేపల పులుసు పెట్టాలంటే కచ్చితంగా చింతపండు అనేది ఉండాలి. కానీ చింతపండుతో చేసే కూర కారణంగా చాలా మందిని గ్యాస్​ట్రబుల్​ సమస్య వేధిస్తుంటుంది. దీంతో తినాలని ఉన్నా తినలేని పరిస్థితి. అయితే అలాంటి వారు ఓసారి చింతపండు లేకుండా చేపల పులుసు పెట్టుకోండి. టేస్ట్​ మరో లెవల్​. ఏంటి నమ్మడం లేదా? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

Fish
Fish (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

మారినేట్​ కోసం:

  • చేప ముక్కలు - 1 కేజీ
  • ఉప్పు - అర టీ స్పూన్​
  • పసుపు - పావు టీ స్పూన్​
  • కారం - 1 టీ స్పూన్​
  • నిమ్మరసం - అర చెక్క
Onions
Onions (Getty Images)

కూర కోసం:

  • నూనె - 3 టేబుల్​ స్పూన్లు
  • పచ్చిమిర్చి - 4
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • ఉల్లిపాయ పేస్ట్​ - అర కప్పు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - 2 టేబుల్​ స్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - పావు టీ స్పూన్​
  • కారం- 2 టీ స్పూన్లు
  • ధనియాల పొడి - 1 టీ స్పూన్​
  • జీలకర్ర పొడి - ముప్పావు టీ స్పూన్​
  • నీరు - 3 కప్పులు
  • మామిడి కాయ - 1
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
Mango
Mango (Getty Images)

తయారీ విధానం:

  • ముందుగా చేప ముక్కలను ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి శుభ్రంగా క్లీన్​ చేసుకోవాలి.
  • ఇలా క్లీన్​ చేసుకున్న ముక్కల్లో ఉప్పు, పసుపు, కారం, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి.
  • మామిడికాయను శుభ్రంగా కడిగి పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్​ చేసుకోవాలి.
  • ఈ ముక్కలను టెంకతో సహా కుక్కర్​లో వేసి సరిపడా అంటే ముక్కలు మునిగేవరకు నీళ్లు పోసి మూత పెట్టి 2 విజిల్స్​ వచ్చే వరకు కుక్​ చేసుకోవాలి.
  • ఆవిరి పోయిన తర్వాత మూత తీసి టెంకను పిండి మిగిలిన ముక్కలను గుజ్జుగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్​ చేసుకుని మిక్సీ జార్​లో వేసి మెత్తని పేస్ట్​ చేసుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి మందపాటి గిన్నె పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్​ హీట్​ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చెయ్యాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్​, అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి పచ్చి వాసన పోయే వరకు మగ్గించాలి.
  • అల్లం పేస్ట్​ మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి మసాలాలను ఫ్రై చేయాలి. అయితే ఇక్కడ ఉప్పు, కారం అనేది చూసి వేసుకోవాలి. ఎందుకంటే ముక్కలను మారినేట్​ చేసినప్పుడు అందులోకి ఉప్పు, కారం కలిపాము. కాబట్టి రుచికి తగినట్లుగా వేసుకోవాలి.
  • మసాలాలు మగ్గి నూనె పైకి తేలిన తర్వాత నీళ్లు పోసుకుని కలిపి మరిగించుకోవాలి.
  • వాటర్​ మరుగుతున్నప్పుడు చేప ముక్కలు వేసి నిధానంగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్​లో ఉడికించుకోవాలి.
  • అనంతరం మూత తీసి ముందే చేసుకున్న మామిడికాయ గుజ్జు, కొంచెం కొత్తమీర వేసి కలిపి మూత పెట్టి సిమ్​లో సుమారు 10 నుంచి 15 నిమిషాలు కుక్​ చేసుకోవాలి.
  • చేప ముక్కలు ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్​ ఆఫ్​ చేసుకుంటే సరి ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ. నచ్చితే మీరూ ఓసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి.
Fish Pulusu
Fish Pulusu (Getty Images)

టిప్స్​:

  • మామిడికాయను పుల్లగా ఉన్నది తీసుకుంటే పులుసు రుచి బాగుంటుంది.
  • మీరు ఈ పులుసును మరింత రుచికరంగా చేయడానికి కొద్దిగా కొబ్బరి పాలు జోడించవచ్చు.
  • చేప ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదు, లేకపోతే అవి విరిగిపోతాయి.

ఘుమఘుమలాడే తెలంగాణ స్టైల్​ "కొర్రమీను చేపల పులుసు" - అద్దిరిపోయే రుచితో ప్లేట్లు నాకాల్సిందే!

తాజా చేపల పేరుతో మిమ్మల్ని మోసం చేస్తారు - కొనేటప్పుడు ఇలా గుర్తుపట్టండి!

Fish Pulusu without Tamarind: చేపలు పులుసు. ఈ పేరు చెబితే చాలు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ఎందుకంటే కారం, ఉప్పు, మసాలాలు పట్టించి చింతపండు రసంలో ఉడికించడం వల్ల రుచి అద్దిరిపోతుంది. అందుకే చాలా మంది తరచుగా ఈ పులుసును పెట్టుకుని తింటుంటారు. అయితే చేపల పులుసు పెట్టాలంటే కచ్చితంగా చింతపండు అనేది ఉండాలి. కానీ చింతపండుతో చేసే కూర కారణంగా చాలా మందిని గ్యాస్​ట్రబుల్​ సమస్య వేధిస్తుంటుంది. దీంతో తినాలని ఉన్నా తినలేని పరిస్థితి. అయితే అలాంటి వారు ఓసారి చింతపండు లేకుండా చేపల పులుసు పెట్టుకోండి. టేస్ట్​ మరో లెవల్​. ఏంటి నమ్మడం లేదా? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

Fish
Fish (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

మారినేట్​ కోసం:

  • చేప ముక్కలు - 1 కేజీ
  • ఉప్పు - అర టీ స్పూన్​
  • పసుపు - పావు టీ స్పూన్​
  • కారం - 1 టీ స్పూన్​
  • నిమ్మరసం - అర చెక్క
Onions
Onions (Getty Images)

కూర కోసం:

  • నూనె - 3 టేబుల్​ స్పూన్లు
  • పచ్చిమిర్చి - 4
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • ఉల్లిపాయ పేస్ట్​ - అర కప్పు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - 2 టేబుల్​ స్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - పావు టీ స్పూన్​
  • కారం- 2 టీ స్పూన్లు
  • ధనియాల పొడి - 1 టీ స్పూన్​
  • జీలకర్ర పొడి - ముప్పావు టీ స్పూన్​
  • నీరు - 3 కప్పులు
  • మామిడి కాయ - 1
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
Mango
Mango (Getty Images)

తయారీ విధానం:

  • ముందుగా చేప ముక్కలను ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి శుభ్రంగా క్లీన్​ చేసుకోవాలి.
  • ఇలా క్లీన్​ చేసుకున్న ముక్కల్లో ఉప్పు, పసుపు, కారం, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి.
  • మామిడికాయను శుభ్రంగా కడిగి పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్​ చేసుకోవాలి.
  • ఈ ముక్కలను టెంకతో సహా కుక్కర్​లో వేసి సరిపడా అంటే ముక్కలు మునిగేవరకు నీళ్లు పోసి మూత పెట్టి 2 విజిల్స్​ వచ్చే వరకు కుక్​ చేసుకోవాలి.
  • ఆవిరి పోయిన తర్వాత మూత తీసి టెంకను పిండి మిగిలిన ముక్కలను గుజ్జుగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్​ చేసుకుని మిక్సీ జార్​లో వేసి మెత్తని పేస్ట్​ చేసుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి మందపాటి గిన్నె పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్​ హీట్​ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చెయ్యాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్​, అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి పచ్చి వాసన పోయే వరకు మగ్గించాలి.
  • అల్లం పేస్ట్​ మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి మసాలాలను ఫ్రై చేయాలి. అయితే ఇక్కడ ఉప్పు, కారం అనేది చూసి వేసుకోవాలి. ఎందుకంటే ముక్కలను మారినేట్​ చేసినప్పుడు అందులోకి ఉప్పు, కారం కలిపాము. కాబట్టి రుచికి తగినట్లుగా వేసుకోవాలి.
  • మసాలాలు మగ్గి నూనె పైకి తేలిన తర్వాత నీళ్లు పోసుకుని కలిపి మరిగించుకోవాలి.
  • వాటర్​ మరుగుతున్నప్పుడు చేప ముక్కలు వేసి నిధానంగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్​లో ఉడికించుకోవాలి.
  • అనంతరం మూత తీసి ముందే చేసుకున్న మామిడికాయ గుజ్జు, కొంచెం కొత్తమీర వేసి కలిపి మూత పెట్టి సిమ్​లో సుమారు 10 నుంచి 15 నిమిషాలు కుక్​ చేసుకోవాలి.
  • చేప ముక్కలు ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్​ ఆఫ్​ చేసుకుంటే సరి ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ. నచ్చితే మీరూ ఓసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి.
Fish Pulusu
Fish Pulusu (Getty Images)

టిప్స్​:

  • మామిడికాయను పుల్లగా ఉన్నది తీసుకుంటే పులుసు రుచి బాగుంటుంది.
  • మీరు ఈ పులుసును మరింత రుచికరంగా చేయడానికి కొద్దిగా కొబ్బరి పాలు జోడించవచ్చు.
  • చేప ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదు, లేకపోతే అవి విరిగిపోతాయి.

ఘుమఘుమలాడే తెలంగాణ స్టైల్​ "కొర్రమీను చేపల పులుసు" - అద్దిరిపోయే రుచితో ప్లేట్లు నాకాల్సిందే!

తాజా చేపల పేరుతో మిమ్మల్ని మోసం చేస్తారు - కొనేటప్పుడు ఇలా గుర్తుపట్టండి!

Last Updated : April 1, 2025 at 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.