How to Make Carrot Sadubana Payasam : క్యారెట్ ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. దీనిలో శరీరానికి కావాల్సిన విటమిన్లు, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ క్రమంలోనే కొంతమంది క్యారెట్ని నేరుగా తినడం, లేదంటే జ్యూస్ చేసుకొని తాగడం చేస్తుంటారు. మరికొందరు సాంబార్, రసం వంటి వాటిల్లో యూజ్ చేస్తుంటారు. కానీ, కొందరు పెద్దలతో పాటు పిల్లలూ క్యారెట్ని తినడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపరు.
అలాంటి వారికి ఓసారి ఇలా "క్యారెట్ సగ్గుబియ్యం పాయసం" చేసి పెట్టండి. క్యారెట్ అంటే ఇష్టపడని వారే కప్పుల మీద కప్పులు తాగేస్తారు. ఇక పిల్లలైతే మరింత ఇష్టంగా లాగిస్తారు. ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. స్వీట్ ప్రియులైతే దీని టేస్ట్కి ఫిదా అయిపోతారు. పైగా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. మరి, ఈ సూపర్ టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

తీసుకోవాల్సిన పదార్థాలు :
- క్యారెట్ - పావు కిలో
- సగ్గుబియ్యం - అర కప్పు
- బెల్లం తురుము - 1 కప్పు
- నెయ్యి - 2 టేబుల్స్పూన్లు
- బాదం - 2 టేబుల్స్పూన్లు
- జీడిపప్పు పలుకులు - 2 టేబుల్స్పూన్లు
- చిరోంజి గింజలు - 1 టీస్పూన్
- పాలు - ఒక లీటర్
- యాలకుల పొడి - అరటీస్పూన్
పాలు, షుగర్ లేకుండా "రవ్వ లడ్డూ" తయార్ - ఇదే ఈ రెసిపీ సీక్రెట్! - అమ్మా ఇంకో లడ్డూ అంటారు!

తయారీ విధానమిలా :
- ఈ రెసిపీ కోసం ముందుగా ఒక గిన్నెలోకి సగ్గుబియ్యాన్ని తీసుకొని రెండు మూడుసార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత అందులో తగినన్ని నీరు పోసి కనీసం గంట నుంచి గంటన్నర పాటు నానబెట్టుకోవాలి.
- సగ్గుబియ్యం నానేలోపు మిగతా ఇంగ్రీడియంట్స్ని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. క్యారెట్స్ తీసుకొని శుభ్రంగా కడిగి, పీలర్ సహాయంతో పై పొట్టును తొలగించుకోవాలి.
- ఆ తర్వాత చెక్కు తీసుకున్న క్యారెట్స్ అన్నింటినీ గ్రేటర్తో సన్నగా తురుముకోవాలి. ఆపై క్యారెట్ తురుముని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే, బెల్లం తురుముని సిద్ధం చేసుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని బెల్లం తురుము వేసుకోవలి. ఆ తర్వాత అందులో అరకప్పు వాటర్ యాడ్ చేసుకొని బెల్లం పూర్తిగా కరిగే వరకు మరిగించుకోవాలి. అంతేకానీ, ఈ పాయసం బెల్లాన్ని పాకం పట్టాల్సిన పనిలేదు.
- బెల్లం పూర్తిగా మరిగిన తర్వాత ఒకట్రెండు నిమిషాల పాటు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా పాయసంలోకి తీసుకున్నాక మళ్లీ మరిగించాల్సిన అవసరం ఉండదు.

- అనంతరం పాయసం చేసుకోవడానికి కాస్త మందంగా ఉండే కడాయి లేదా పాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి.
- ఆ తర్వాత అందులో నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. అది కరిగి కాస్త వేడయ్యాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు పలుకులు వేసుకొని వేయించుకోవాలి.
- అవి కాస్త ఫ్రై అయ్యాక అందులో చిరోంజి గింజలు వేసుకొని మరికాసేపు వేయించుకొని పక్కకు తీసుకోవాలి.
- ఇప్పుడు అదే నెయ్యిలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ తురుముని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మరీ, ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పనిలేదు. అందులోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఆపై దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచాలి.
- అనంతరం స్టవ్ మీద మరో పాన్ పెట్టుకొని పాలు పోసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి.
- ఆ తర్వాత అందులో గంటపాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకొని ఒకసారి బాగా కలపాలి.

- ఆపై పాలు మళ్లీ ఉడకడం స్టార్ట్ అయ్యాక అందులో ముందుగా వేయించుకున్న క్యారెట్ తురుముని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
- అనంతరం క్యారెట్ తురుము, సగ్గుబియ్యం కాస్త మెత్తబడేంత వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇందుకోసం సుమారుగా 10 నిమిషాల సమయం పట్టొచ్చు.
- అవి కొద్దిగా ఉడికి, పాయసం కాస్త చిక్కబడ్డాక ఫ్రై చేసుకున్న డ్రైఫ్రూట్స్, యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
- తర్వాత గిన్నెపై మూతపెట్టి కాసేపు పాయసాన్ని పక్కనుంచాలి.
- పాయసం కొంచెం గోరువెచ్చగా అయ్యాక అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ని వడకట్టి పోసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, నోరూరించే కమ్మని "క్యారెట్ సగ్గుబియ్యం పాయసం" రెడీ!

టిప్స్ :
- ఈ స్వీట్ రెసిపీ కోసం బెల్లాన్ని పాకం పట్టాల్సిన పని లేదు. జస్ట్ బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మరిగించుకొని తీసుకుంటే చాలు.
- ఇలా చేయడం ద్వారా పాయసంలోకి తీసుకున్నాక మళ్లీ మరిగించాల్సిన అవసరం ఉండదు.
- ఇక్కడ చిరోంజి గింజలు పాయసానికి సరికొత్త టేస్ట్ని తీసుకోస్తాయి.
నెయ్యి లేకుండా మూడే మూడు పదార్థాలతో కమ్మని "మైసూర్ పాక్" - కేవలం అరగంటలో రెడీ!
పెసరపప్పుతో కమ్మనైన "ధారాక్షి స్వీట్" - పైన కరకర, లోపల జ్యూసీగా!