Explosion In Iran : దక్షిణ ఇరాన్లోని ఓడరేవులో భారీ పేలుడు సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. సుమారుగా 750 మంది గాయపడ్డారు. బందర్ అబ్బాస్ నగరానికి వెలుపల ఉన్న రాజై ఓడరేవులో ఈ పేలుడు శనివారం సంభవించింది.
కంటైనర్లలో పేలుడు
రాజై పోర్టులో ఉన్న అనేక కంటైనర్లలో పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డవారిని వైద్యం కోసం తరలించినట్లు పేర్కొన్నారు. పోర్టులో పేలుడు సంభవించిన తర్వాత దట్టమైన నల్లటి పొగ కమ్ముకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ పేలుడుకు గల కారణాలను అధికారులు వెల్లడించలేదు.
UPDATE:
— FlashFeed (@FlashFeed365) April 26, 2025
Shahid Rajaee Port near Bandar Abbas, southwest Iran, has been the scene of a large explosion and fire in 2019, during which at least one rescue worker was killed.
In 2020, all shipping traffic at port was halted for several hours after the port’s computers went offline. pic.twitter.com/QNif4C7lYe
కంటైనర్ల పేలడం వల్లే!
ఈ ఘటనపై స్థానిక విపత్తు నిర్వహణ అధికారి మెహర్దాద్ హసన్జాదే స్పందించారు. ఈ ఘటన రాజై పోర్టులో నిల్వ ఉన్న కొన్ని కంటైనర్లు పేలడంతో ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం తాము గాయపడ్డవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తున్నామని తెలిపారు.
భయానకమైన పేలుడు
పేలుడు శబ్దానికి ఘటనాస్థలం నుంచి కొన్ని కి.మీ దూరంలో భవనాల అద్దాలు ధ్వంసమైనట్లు వీడియోలో కన్పిస్తోంది. పేలుడు ధాటికి ఓ భవనం కూలిపోయినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. అలాగే పోర్టు వద్ద ఉన్నవారి కేకలు వినిపిస్తున్నాయి. అధికారులు త్వరితగతిన సహాయక చర్యలను చేపడుతున్నారు.
వీడియోలు వైరల్
రాజై పోర్టులో పేలుడు తీవ్రత భయానకంగా ఉంది. పేలుడు సంభవించిన వెంటనే మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నికీలలు కంటైనర్ యార్డ్ మొత్తం వ్యాపించాయి. పేలుడు శబ్దం కొన్ని కిలోమీటర్ల దూరం పాటు వినిపించింది. దట్టమైన పొగ పోర్ట్ మొత్తం అలుముకుంది. పలు భవనాల కిటికీలు, పోర్ట్ కు దూరంగా పార్క్ చేసి ఉంచిన వాహనాల అద్దాలు కూడా పగిలిపోయాయి.
ఏటా భారీ మొత్తంలో ఎగుమతులు, దిగుమతులు
ఇదిలా ఉండగా రాజై ఓడరేవులో ప్రధానంగా కంటెయినర్ల కార్యకలాపాలు జరుగుతుంటాయి. ఏటా 80 మిలియన్ టన్నుల (72.5 మిలియన్ మెట్రిక్ టన్నులు) సరకు ఎగుమతి, దిగుమతి అవుతుంది. స్థానికంగా చమురు ట్యాంకులు, పెట్రో కెమికల్ సౌకర్యాలు ఉన్నాయి.
రాజధానికి వెయ్యి కి.మీ దూరంలో పోర్ట్
రాజై ఓడరేవు ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు ఆగ్నేయంగా 1,050 కిలోమీటర్లు (652 మైళ్ళు) దూరంలో ఉంది. దీని ద్వారా మొత్తం 20శాతం చమురు వ్యాపారం జరుగుతుంది. ఒమన్ లో ఇరాన్ తో అణ్వాయుధ అంశంపై అమెరికా చర్చలు చేపడుతున్న నేపథ్యంలో ఈ పేలుడు జరగడం గమనార్హం. కాగా, ఇటీవల కాలంలో ఇరాన్ లో పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ ఆంక్షల ఎదుర్కొంటున్న చమురు ఎగుమతి చేసే పోర్టుల్లో పోర్టుల్లో ప్రమాదాలు ఎక్కువైపోయాయి.
పహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తును సిద్ధమే: పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు- ముర్ము, ట్రంప్ సహా 2 లక్షల మంది హాజరు