ETV Bharat / international

ఫొటో ఆఫ్​ ది ఇయర్ 2025​- యుద్ధ బీభత్సాన్ని చూపే పాలస్తీనా బాలుని చిత్రం! - WORLD PRESS PHOTO OF THE YEAR 2025

ఫొటో ఆఫ్‌ ది ఇయర్‌గా పాలస్తీనా బాలుడి చిత్రం- యుద్ధాల వల్ల జరిగే నష్టాన్ని కళ్లకు చూపే నిశ్శబ్ధ చిత్రం!

World Press Photo Of The Year 2025
Portrait of Palestinian boy (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : April 18, 2025 at 7:15 AM IST

1 Min Read

World Press Photo Of The Year 2025 : గాజాపై ఇజ్రాయెల్‌ చేసిన దాడిలో రెండు చేతులూ కోల్పోయిన పాలస్తీనా బాలుడు మహమ్మద్‌ అజ్జౌర్‌ (9) చిత్రం 'వరల్డ్‌ ప్రెస్‌ ఫొటో ఆఫ్‌ ది ఇయర్‌ 2025'గా ఎంపిక అయ్యింది. ఖతర్‌ కేంద్రంగా పనిచేస్తున్న పాలస్తీనియాకు చెందిన మహిళా ఫొటోగ్రాఫర్​ సమర్‌ అబు ఎలౌఫ్‌ 'ది న్యూయార్క్‌ టైమ్స్‌' కోసం ఈ ఫొటో తీశారు.

"మహమ్మద్‌ అజ్జౌర్​ తల్లితో నేను మాట్లాడాను. తన రెండూ చేతులు ఇక లేవని తెలియగానే, అమ్మా! ఇకపై నేను నిన్నెలా హత్తుకోనూ?" అంటూ ఆ బాలుడు తల్లిని ప్రశ్నించాడు" అని అబూ ఎలౌఫ్‌ చెప్పిన మాటలను వరల్డ్‌ ప్రెస్‌ ఫొటో ఆర్గనైజేషన్​ ఈ సందర్భంగా ఊటంకించింది.

68వ వేడుకగా జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక ఫొటో జర్నలిజం పోటీల్లో 141 దేశాలకు చెందిన 3,778 మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. వారు ఏకంగా 59,320 ఎంట్రీలను సమర్పించారు.

"ఇది ఒక బాలుడి కథను, ఆవేదనను బిగ్గరగా చెప్పే ఓ నిశ్శబ్ద ఫొటో. తరతరాలపై ప్రభావం చూపే ఓ పాశవిక, సుదీర్ఘ యుద్ధం గురించి కూడా ఇది చెబుతుంది" అని వరల్డ్‌ ప్రెస్‌ ఫొటో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్​ జౌమానా ఎల్‌జీన్‌ ఖౌరీ అన్నారు.

World Press Photo Of The Year 2025 : గాజాపై ఇజ్రాయెల్‌ చేసిన దాడిలో రెండు చేతులూ కోల్పోయిన పాలస్తీనా బాలుడు మహమ్మద్‌ అజ్జౌర్‌ (9) చిత్రం 'వరల్డ్‌ ప్రెస్‌ ఫొటో ఆఫ్‌ ది ఇయర్‌ 2025'గా ఎంపిక అయ్యింది. ఖతర్‌ కేంద్రంగా పనిచేస్తున్న పాలస్తీనియాకు చెందిన మహిళా ఫొటోగ్రాఫర్​ సమర్‌ అబు ఎలౌఫ్‌ 'ది న్యూయార్క్‌ టైమ్స్‌' కోసం ఈ ఫొటో తీశారు.

"మహమ్మద్‌ అజ్జౌర్​ తల్లితో నేను మాట్లాడాను. తన రెండూ చేతులు ఇక లేవని తెలియగానే, అమ్మా! ఇకపై నేను నిన్నెలా హత్తుకోనూ?" అంటూ ఆ బాలుడు తల్లిని ప్రశ్నించాడు" అని అబూ ఎలౌఫ్‌ చెప్పిన మాటలను వరల్డ్‌ ప్రెస్‌ ఫొటో ఆర్గనైజేషన్​ ఈ సందర్భంగా ఊటంకించింది.

68వ వేడుకగా జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక ఫొటో జర్నలిజం పోటీల్లో 141 దేశాలకు చెందిన 3,778 మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. వారు ఏకంగా 59,320 ఎంట్రీలను సమర్పించారు.

"ఇది ఒక బాలుడి కథను, ఆవేదనను బిగ్గరగా చెప్పే ఓ నిశ్శబ్ద ఫొటో. తరతరాలపై ప్రభావం చూపే ఓ పాశవిక, సుదీర్ఘ యుద్ధం గురించి కూడా ఇది చెబుతుంది" అని వరల్డ్‌ ప్రెస్‌ ఫొటో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్​ జౌమానా ఎల్‌జీన్‌ ఖౌరీ అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.