Indus Water Treaty : జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్న విషయం తెలిసిందే. దీంతో పాక్తో ఇప్పటికే చేసుకున్న సింధూ జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. నదిలో ఒక్క చుక్క నీరుగా పాక్కు వెళ్లనివ్వమని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలిపారు.
సింధూ నది తమదే!
దీంతో పాకిస్థాన్ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత్పై అక్కసు వెళ్లగక్కుతూ నోరు పారేసుకుంటున్నారు. ఒకవేళ సింధూ నదిలో నీరు పారకపోతే, రక్తం పారుతుందంటూ ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి, పీపుల్స్ పార్టీ చీఫ్ భిలావల్ భుట్టో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధూ నది తమదేనని అన్నారు. ఆ నాగరికతకు నిజమైన సంరక్షకులం తామేనని సమర్థించుకున్నారు.
అంతకుమందు సింధూ నదిలో ప్రతి చుక్కా తమదేనని, భారత్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపణలు చేశారు. రక్షణ మంత్రి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో భారత్పై విషం చిమ్ముతూ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సింధూ నది గురించి మాట్లాడిన వీడియో బయటికొచ్చింది. నీళ్లు ఆపేస్తే నదుల్లో మళ్లీ రక్తం పారుతుందంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
కంటి మీద కునుకు లేకుండా!
కాగా, 1960ల్లో భారత్, పాకిస్థాన్ మధ్య సింధూ నదీ జలాల ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి అది అమల్లో ఉంది. కానీ ఇటీవల పహిల్గాంలో జరిగిన ఉగ్రదాడి దృష్ట్యా దీని అమలును భారత్ నిలిపివేసింది. ఇది దాయాదికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎందుకంటే ఆ ఒప్పందం నిలిపివేత పాకిస్థాన్ ఎడారిగా మారే అవకాశం ఉంది. ఆ దేశంలోని నీటి సరఫరా మొత్తం సింధూ జలాలపైనే ఆధారం.
అక్కడ వ్యవసాయానికి వాడే నీటిలో 80 శాతం సింధూ జలాల ఒప్పందం కింద లభించేదే. పాకిస్థాన్ జీడీపీలో 25శాతం సింధూ నుంచే లభిస్తుందంటే భారత్ నిర్ణయంతో ఎలాంటి ప్రభావం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఏ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాన్నైనా రద్దు చేసుకునే హక్కు మన దేశానికి ఉంది. అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించిన వియన్నా ఒప్పందంపై భారత్ ఇంకా సంతకం చేయలేదు. కాబట్టి పాక్ ఏ కోర్టుకు వెళ్లినా, అంతర్జాతీయ సంస్థకు వెళ్లినా వారు ఎటువంటి తీర్పు ఇచ్చినా న్యూదిల్లీకి ఏం సంబంధం లేదు, వర్తించదు కూడా!
పాక్ బరితెగింపు - నిరసన తెలుపుతున్న భారతీయుల 'గొంతు కోస్తా'మంటూ సంజ్ఞ!
'ఉగ్రవాదంతో తీవ్ర ముప్పు'- పహల్గాం దాడిని ఖండించిన ఐరాస భద్రతా మండలి