ETV Bharat / international

ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంలో 50వేల మంది మృతి- అతిపెద్ద ఆస్పత్రిపై భీకర దాడులు! - ISRAEL GAZA WAR

యుద్ధంలో ఇప్పటివరకు 50వేల మందికి పాలస్తీనియన్లు మృతి -హమాస్‌ కీలక నేత సలాహ్‌ అల్‌ బర్దావీల్‌, ఆయన భార్య మృతి

israel hamas war death toll
israel hamas war death toll (AP News)
author img

By ETV Bharat Telugu Team

Published : March 24, 2025 at 6:56 AM IST

2 Min Read

Israel Hamas War Death Toll: దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌ నగరంలో ఉన్న అతిపెద్ద ఆస్పత్రిపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, పదుల సంఖ్యలో రోగులు గాయపడ్డారు. ఈ మేరకు గాజా ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్ దాడి కారణంగా ఆస్పత్రిలోని సర్జికల్ భవనంలో మంటలు చెలరేగాయని తెలిపింది. అటు నాజర్ ఆస్పత్రిపై దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం కూడా ధ్రువీకరించింది. ఆస్పత్రిలో హమాస్ మిలిటెంట్లు కార్యకలాపాలు సాగిస్తున్నారని, అందుకే దాడి చేశామని వెల్లడించింది. గత 24 గంటల్లో గాజా పట్టీలో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో 26 పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధంలో ఇప్పటివరకు 50వేల మందికి పాలస్తీనియన్లు మృతిచెందారని గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇంకా 1.13 లక్షల మంది గాయపడినట్లు వివరించింది.

ఆదివారం ఖాన్‌ యూనిస్‌ నగరంపై ఇజ్రాయెల్‌ నిర్వహించిన దాడిలో హమాస్‌ కీలక నేత సలాహ్‌ అల్‌ బర్దావీల్‌(66) మృతి చెందారు. ఆయనతో పాటు భార్య కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఖాన్‌ యూనిస్‌ శరణార్థి శిబిరంలో జన్మించిన బర్దావీల్‌, హమాస్‌ సీనియర్‌ నేత యాహ్యా సిన్వర్‌కు సన్నిహితుడు. హమాస్‌ రాజకీయ విభాగానికి నాయకుడు. ఇజ్రాయెల్‌ దాడుల్లో సిన్వర్, ముస్తాహాలు చనిపోయినప్పటి నుంచి బర్దావీలే హమాస్‌లో కీలకనేతగా ఉంటున్నారు.

మరోవైపు గాజా నుంచి పాలస్తీనియన్లను తరలించేందుకు కొత్త డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. దీనికి ఆ దేశ మంత్రిమండలి సైతం శనివారం ఆమోదం తెలిపింది. గాజా నుంచి పాలస్తీనియన్లు జోర్డాన్, ఈజిప్టు తదితర దేశాలకు శాశ్వతంగా తరలివెళ్లాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ఇందుకోసం ఒక డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

అయితే, ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య జరిగిన తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందం ఇటీవల ముగియగా గత మంగళవారం గాజాపై ఐడీఎఫ్ దళాలు భారీ దాడులు చేశాయి. ఇందులో 400 మందికి పైగా మృతిచెందగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన బందీల విడుదలకు హమాస్‌ తిరస్కరించడంతోనే దాడులకు ఆదేశించానని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు వివరించారు. ఈ దాడులను తీవ్రంగా ఖండించిన హమాస్‌, అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్​ను హెచ్చరించింది. ఈ క్రమంలోనే గురువారం ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 85 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్ బందీలను విడిచిపెట్టకపోతే గాజాలోని భూభాగాలను ఒక్కొక్కటిగా ఆక్రమిస్తామని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కాట్జ్‌ హెచ్చరించారు.

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- హమాస్ కీలక రాజకీయ నేత హతం

గాజాలో మరింత భూభాగం ఆక్రమించండి: ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి ఆదేశాలు

Israel Hamas War Death Toll: దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌ నగరంలో ఉన్న అతిపెద్ద ఆస్పత్రిపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, పదుల సంఖ్యలో రోగులు గాయపడ్డారు. ఈ మేరకు గాజా ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్ దాడి కారణంగా ఆస్పత్రిలోని సర్జికల్ భవనంలో మంటలు చెలరేగాయని తెలిపింది. అటు నాజర్ ఆస్పత్రిపై దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం కూడా ధ్రువీకరించింది. ఆస్పత్రిలో హమాస్ మిలిటెంట్లు కార్యకలాపాలు సాగిస్తున్నారని, అందుకే దాడి చేశామని వెల్లడించింది. గత 24 గంటల్లో గాజా పట్టీలో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో 26 పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధంలో ఇప్పటివరకు 50వేల మందికి పాలస్తీనియన్లు మృతిచెందారని గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇంకా 1.13 లక్షల మంది గాయపడినట్లు వివరించింది.

ఆదివారం ఖాన్‌ యూనిస్‌ నగరంపై ఇజ్రాయెల్‌ నిర్వహించిన దాడిలో హమాస్‌ కీలక నేత సలాహ్‌ అల్‌ బర్దావీల్‌(66) మృతి చెందారు. ఆయనతో పాటు భార్య కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఖాన్‌ యూనిస్‌ శరణార్థి శిబిరంలో జన్మించిన బర్దావీల్‌, హమాస్‌ సీనియర్‌ నేత యాహ్యా సిన్వర్‌కు సన్నిహితుడు. హమాస్‌ రాజకీయ విభాగానికి నాయకుడు. ఇజ్రాయెల్‌ దాడుల్లో సిన్వర్, ముస్తాహాలు చనిపోయినప్పటి నుంచి బర్దావీలే హమాస్‌లో కీలకనేతగా ఉంటున్నారు.

మరోవైపు గాజా నుంచి పాలస్తీనియన్లను తరలించేందుకు కొత్త డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. దీనికి ఆ దేశ మంత్రిమండలి సైతం శనివారం ఆమోదం తెలిపింది. గాజా నుంచి పాలస్తీనియన్లు జోర్డాన్, ఈజిప్టు తదితర దేశాలకు శాశ్వతంగా తరలివెళ్లాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ఇందుకోసం ఒక డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

అయితే, ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య జరిగిన తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందం ఇటీవల ముగియగా గత మంగళవారం గాజాపై ఐడీఎఫ్ దళాలు భారీ దాడులు చేశాయి. ఇందులో 400 మందికి పైగా మృతిచెందగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన బందీల విడుదలకు హమాస్‌ తిరస్కరించడంతోనే దాడులకు ఆదేశించానని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు వివరించారు. ఈ దాడులను తీవ్రంగా ఖండించిన హమాస్‌, అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్​ను హెచ్చరించింది. ఈ క్రమంలోనే గురువారం ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 85 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్ బందీలను విడిచిపెట్టకపోతే గాజాలోని భూభాగాలను ఒక్కొక్కటిగా ఆక్రమిస్తామని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కాట్జ్‌ హెచ్చరించారు.

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- హమాస్ కీలక రాజకీయ నేత హతం

గాజాలో మరింత భూభాగం ఆక్రమించండి: ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.