Trump On Iran : ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ పేరిట జరిపిన దాడులతో ఇరాన్ తన అణుశుద్ధి కేంద్రాలను ఎప్పటికీ పునర్నిర్మించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ ప్రదేశాలు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయని చెప్పారు. ఇరాన్లోని మూడు అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా అత్యంత శక్తిమంతమైన బాంబర్లు, క్షిపణులతో అమెరిగా విరుచుకుపడంగా, ఇప్పుడు వాటిని ఉద్దేశిస్తూ ట్రంప్ అన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు.
"ఇరాన్ తన అణుశుద్ధి కేంద్రాలను ఎప్పటికీ పునర్నిర్మించదు!" అని ట్రంప్ తన సొంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడిన సమయంలో ఇరాన్ తన అణు శుద్ధి కేంద్రాలను ఎప్పటికీ పునర్నిర్మించుకోలేకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అక్కడి నుంచి అంటూ కచ్చితంగా కాదని చెప్పారు. ఆ ప్రదేశం శిథిలావస్థకు చేరుకుందని అన్నారు B2 పైలట్లు ఎవరైనా ఊహించిన దానికంటే బాగా తమ పనిని చేశారని పేర్కొన్నారు
అంతకుముందు ఇజ్రాయెల్ను ఘర్షణను ముగించాలని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించాలని కోరారు. ఇజ్రాయెల్ జెట్లు గాలిలో ఉన్నప్పుడు తిరుగుతాయని, ఇరాన్కు స్నేహపూర్వక విమాన తరంగం చేస్తాయని చెప్పారు. "ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేయడం లేదు. అన్ని విమానాలు తిరిగి ఇంటికి వెళ్తాయి, అదే సమయంలో ఇరాన్కు స్నేహపూర్వక 'ప్లేన్ తరంగం' చేస్తాయి" అని తెలిపారు.
"ఎవరికీ హాని జరగదు, కాల్పుల విరమణ అమలులో ఉంది! ఈ విషయంపై మీ శ్రద్ధకు ధన్యవాదాలు!"అని ఆయన పోస్ట్ చేశారు. అయితే, ట్రంప్ ఇజ్రాయెల్ను కాల్పుల విరమణను ఉల్లంఘించవద్దని హెచ్చరించారు. "ఆ బాంబులను పడవేయకండి. మీరు అలా చేస్తే అది పెద్ద ఉల్లంఘన. ఇప్పుడే మీ పైలట్లను ఇంటికి తీసుకురండి! యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ జె. ట్రంప్" అని పోస్ట్ చేశారు.
మరోవైపు, "కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత ఇరాన్ మాపై మూడు చోట్ల క్షిపణి దాడులు చేసింది. ప్రతిస్పందనగా అక్కడి రాడార్ వ్యవస్థలపై మేం కూడా దాడులు చేశాం. అయితే, ప్రధాని నెతన్యాహుతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడిన తర్వాత తదుపరి దాడులకు దూరంగా ఉన్నాం. తమ యుద్ధ లక్ష్యాలన్నింటినీ సాధించడం పట్ల ఇజ్రాయెల్పై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా కాల్పుల విరమణ స్థిరంగా కొనసాగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు" అని ఇజ్రాయల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది.