ETV Bharat / international

పవన్​ కుమారుడిని కాపాడిన కార్మికులకు 'లైఫ్​ సేవర్'​ అవార్డ్​ - PAWAN KALYAN SON INJURED

అగ్నిప్రమాదం నుంచి పవన్‌ కుమారుడు మార్క్‌ శంకర్‌ను కాపాడిన వలస కార్మికులు- లైఫ్‌ సేవర్‌ అవార్డును ప్రదానం చేసిన సింగపూర్‌ ప్రభుత్వం

Indians Get Singapore Lifesaver Award
Indians Get Singapore Lifesaver Award (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : April 16, 2025 at 10:16 AM IST

2 Min Read

Indians Get Singapore Lifesaver Award : సింగపూర్​లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం నుంచి పవన్ కల్యాణ్​ చిన్న కుమారుడితో పాటు పలువురుని కాపాడిన కార్మికులకు అక్కడి ప్రభుత్వం అవార్డుతో సత్కరించింది. నలుగురు భారతీయ కార్మికులతో సహా 18మందికి 'లైఫ్​ సేవర్'​ అవార్డును ప్రదానం చేసింది. వారి ప్రాణాలను పణంగా పెట్టి పిల్లలను రక్షించినందుకు ఈ అవార్డును ఇచ్చినట్లు సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది.

సింగపూర్‌ సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ సమీపంలోని రివర్‌ వ్యాలీ రోడ్‌లో గల ఓ మూడంతస్తుల భవంతిలో ఏప్రిల్‌ 8 ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది పిల్లలు సహా 20 మంది గాయపడ్డారు. ప్రమాదం సమయంలోనే ఈ వలస కార్మికులు ఘటనాస్థలికి సమీపంలోనే పని చేస్తున్నరు. భవనం నుంచి పిల్లల అరుపులు వినపడటం, మూడో అంతస్తు నుంచి పొగలు రావడం గమనించి వెంటనే రంగంలోకి దిగారు. సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ సంఘటన స్థలానికి చేరుకోవడానికి ముందే ఆ 18 మంది వ్యక్తులు దాదాపు 10మందిని రక్షించి చికిత్సను అందించారు.

ఈ అగ్నిప్రమాదంపై కార్మికులు మాట్లాడుతూ, వెళ్లి చూసేసరికి గదిలో పిల్లలు భయంతో వణుకుతూ, అరుస్తూ కనిపించారని చెప్పారు. ' మూడో అంతస్తు నుంచి కొందరు పిల్లలు దూకేయాలని చూశారు. మేం వాళ్లతో మాట్లాడి దూకకుండా చూశాం. తర్వాత వారిని కిందకు తీసుకొచ్చాం. మూడో అంతస్తుకు వరకు వెళ్లడానికి ప్రయత్నించామని, కానీ వెళ్లలేకపోయాం. తర్వాత ఎలాగోలా పిల్లలు ఉన్న గదికి వెళ్లాం. ఇక ఈ ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమెను కాపాడలేకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాం' అని కార్మికులు విచారం వ్యక్తంచేశారు.

ఇక ఈ ప్రమాదంలో మార్క్​ శంకర్ ​కాళ్లకు కాలిన గాయాలతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ చూరింది. ఈ విషయం తెలుసుకున్న పవన్‌ కల్యాణ్‌, చిరంజీవి దంపతులు సింగపూర్‌ వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం మార్క్ ఆరోగ్య పరిస్థితిపై పవన్​ కల్యాణ్​కు ఫోన్​ చేసి ఆరా తీశారు. అలాగే మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని పలువురు పోస్టులు పెట్టారు. ప్రస్తుతం గాయపడిన మార్క్‌ శంకర్‌ కోలుకుంటున్నాడు.

Indians Get Singapore Lifesaver Award : సింగపూర్​లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం నుంచి పవన్ కల్యాణ్​ చిన్న కుమారుడితో పాటు పలువురుని కాపాడిన కార్మికులకు అక్కడి ప్రభుత్వం అవార్డుతో సత్కరించింది. నలుగురు భారతీయ కార్మికులతో సహా 18మందికి 'లైఫ్​ సేవర్'​ అవార్డును ప్రదానం చేసింది. వారి ప్రాణాలను పణంగా పెట్టి పిల్లలను రక్షించినందుకు ఈ అవార్డును ఇచ్చినట్లు సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది.

సింగపూర్‌ సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ సమీపంలోని రివర్‌ వ్యాలీ రోడ్‌లో గల ఓ మూడంతస్తుల భవంతిలో ఏప్రిల్‌ 8 ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది పిల్లలు సహా 20 మంది గాయపడ్డారు. ప్రమాదం సమయంలోనే ఈ వలస కార్మికులు ఘటనాస్థలికి సమీపంలోనే పని చేస్తున్నరు. భవనం నుంచి పిల్లల అరుపులు వినపడటం, మూడో అంతస్తు నుంచి పొగలు రావడం గమనించి వెంటనే రంగంలోకి దిగారు. సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ సంఘటన స్థలానికి చేరుకోవడానికి ముందే ఆ 18 మంది వ్యక్తులు దాదాపు 10మందిని రక్షించి చికిత్సను అందించారు.

ఈ అగ్నిప్రమాదంపై కార్మికులు మాట్లాడుతూ, వెళ్లి చూసేసరికి గదిలో పిల్లలు భయంతో వణుకుతూ, అరుస్తూ కనిపించారని చెప్పారు. ' మూడో అంతస్తు నుంచి కొందరు పిల్లలు దూకేయాలని చూశారు. మేం వాళ్లతో మాట్లాడి దూకకుండా చూశాం. తర్వాత వారిని కిందకు తీసుకొచ్చాం. మూడో అంతస్తుకు వరకు వెళ్లడానికి ప్రయత్నించామని, కానీ వెళ్లలేకపోయాం. తర్వాత ఎలాగోలా పిల్లలు ఉన్న గదికి వెళ్లాం. ఇక ఈ ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమెను కాపాడలేకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాం' అని కార్మికులు విచారం వ్యక్తంచేశారు.

ఇక ఈ ప్రమాదంలో మార్క్​ శంకర్ ​కాళ్లకు కాలిన గాయాలతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ చూరింది. ఈ విషయం తెలుసుకున్న పవన్‌ కల్యాణ్‌, చిరంజీవి దంపతులు సింగపూర్‌ వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం మార్క్ ఆరోగ్య పరిస్థితిపై పవన్​ కల్యాణ్​కు ఫోన్​ చేసి ఆరా తీశారు. అలాగే మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని పలువురు పోస్టులు పెట్టారు. ప్రస్తుతం గాయపడిన మార్క్‌ శంకర్‌ కోలుకుంటున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.