ETV Bharat / health

శరీరంలో తగినంత నీరు లేకపోతే ఏమవుతుందో తెలుసా? రోజుకు ఎంత వాటర్ తాగాలి? - DRINKING WATER IS GOOD FOR HEALTH

రోజుకు ఎంత పరిమాణంలో నీరు అవసరం అన్న అంశంపై నిపుణులు సూచనలు

Drinking_Water
Drinking_Water (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : April 18, 2025 at 3:27 PM IST

4 Min Read

Drinking Enough Water is Good for Health : ఎండలు మండిపోతున్నాయి. భానుడి సెగలకు విరుగుడు మంచి నీరే! ఇతర శీతల పానీయాల కన్నా స్వచ్ఛమైన నీరే వేసవి తాపం నుంచి రక్షణ కల్పిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మానవుడి శరీర బరువులో 75 శాతం వరకు నీరు ఉంటుందని, శరీరం సరిగా పని చేయాలంటే ప్రతి కణానికి అవయవానికి సరిపడా నీరు అందాలంటున్నారు.

శరీరంలోని వ్యర్థాలను మూత్రం, చెమట, మల విసర్జన ద్వారా తొలగించడానికి నీరు సహాయపడుతుంది. శరీర ఉష్ణోగ్రతలను సాధారణ స్థాయిలో ఉంచడానికి నీరు దోహదపడుతుంది. కీళ్లకు కుషన్ లాంటి ప్రభావాన్ని అందించడంతో పాటు సున్నితమైన కణజాలాలను రక్షిస్తుంది. నోటిలో సరిపడా లాలాజలం ఉత్పత్తి కావడానికి నీటి అవసరం చాలా ఉంది. ఒబేసిటీని తగ్గించుకోవడానికీ, రక్తంలో ఆక్సిజన్ స్థాయి మెరుగుపరచుకోవడానికి నీరు ఉపయోగపడుతుందని NIH పరిశోధనలో తేలింది.

వాటర్
వాటర్ (Getty images)

గుర్తుంచుకోండి : నీరు, ఆహారం, ఇతర పానీయాలు ద్వారా శరీరానికి ద్రవాలు అందాలి. శరీరానికి అవసరమైన నీటిలో 20 శాతం ఆహారం ద్వారానే అందుతుంది. కీర, పుచ్చకాయ వంటి వాటిలో గణనీయంగా నీరు ఉంటుంది. కాఫీ, టీలు రోజుకు 300 మి.గ్రా కన్నా ఎక్కువగా తీసుకుంటే స్వల్పస్థాయి డైయూరిటిక్ ప్రభావం తలెత్తుతుందని నిపుణులు అంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్, శీతల పానీయాలు వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదని, వాటిలో కెఫిన్, చక్కెర ఎక్కువగా ఉంటుందని తెలిపారు. వీటితో పాటు మద్యం కూడా డైయూరిటిక్ ప్రభావాన్ని కలిగిస్తుందని, ఫలితంగా శరీరం ఎక్కువగా నీటిని కోల్పోతుందని చెబుతున్నారు. అందుకే సాధ్యమైనంత వరకు సాధారణ నీటిని తాగడానికే ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

వాటర్ గ్లాస్
వాటర్ గ్లాస్ (Getty images)

సమతౌల్యతకు యంత్రాంగం ఉంది : శరీరంలోని యాంటీ డై యూరెటిక్ హార్మోన్(ADH), రెనిన్-యాంజియెటెన్సిన్ - ఆల్డోస్టెరాన్ వ్యవస్థ (RAAS) కలిసి పనిచేస్తూ శరీరంలో నీటి సమతౌల్యతను కాపాడుతుంటాయని చెబుతున్నారు. ఇవి శరీరంలో నీరు శాతం తగ్గినప్పుడు ఒంట్లోని ద్రవాలను సంరక్షించుకుంటాయి. చెమటను తగ్గించడం, మూత్రాన్ని చిక్కగా చేయడం ద్వారా ఈ ఇబ్బందిని అధిగమిస్తాయని తెలిపారు. అందువల్ల నీరు తక్కువగా తాగినవారు కూడా కొంత సేపు సాధారణంగానే పనిచేయగలుగుతారని నిపుణులు వివరించారు.

శరీరం చెప్పేస్తుంది : ఒక రోజుకు ఎంత పరిమాణంలో నీరు అవసరమన్నది వ్యక్తులను బట్టి మారుతుందని నిపుణులు అంటున్నారు. శారీరక శ్రమ, వాతావరణ పరిస్థితులు ఎంత నీరు తాగాలనేది నిర్ణయిస్తారని చెబుతున్నారు. ఏసీలో కూర్చొని పని చేస్తున్న వ్యక్తి కంటే ఎండలో పొలంలో శ్రమిస్తున్న రైతుకు ఎక్కువ నీళ్లు అవసరం అవుతాయి. తేమ, వేడితో కూడిన వాతావరణం, ఎత్తయిన ప్రదేశాల్లో నివసించే వారు, క్రీడాకారులు, ఇతరుల కంటే ఎక్కువగా నీరు అవసరం అవుతుంది. దాహం రూపంలో శరీరం అందించే సహజ సిద్ధ సంకేతాలను ఆలకించి, ఆ మేరకు నడుచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వాటర్
వాటర్ (Getty images)

ఎంతైతే మేలు : నిత్యం ఎంత పరిమాణంలో నీటిని తీసుకోవాలన్న అంశంపై శాస్త్రీయ ఆధారాల్లో సృష్టత లేదు. కానీ, వయోజనులు 2 నుంచి 3 లీటర్ల నీటిని తాగాలి. మహిళలు 2.7 లీటర్లు, పురుఘలు 3.7 లీటర్ల నీటిని తాగాలని అమెరికా నేషనల్ అకాడమీస్ ఆఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్, మెడిసిన్ నిర్దేశించింది. సాధారణ ఆరోగ్య పరిస్థితి ఉన్న వ్యక్తులు రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలని చెబుతున్నారు.

తాగకుంటే ఏమవుతుంది? : శ్వాస, చెమట, మూత్రం, మలవిసర్జన ద్వారా నీటిని శరీరం కోల్పోతుంది. ఎక్కువసేపు తీవ్ర ఉష్ణతాకిడికి గురైనా చెమట రూపంలో శరీరం అనేది నీటిని నష్టపోతుంది. అందుకే ఎప్పుటికప్పుడు నీటిని తాగడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. శరీరం తన సాధారణ విధులను సరిగా నిర్వహించలేని స్థాయికి నీటి పరిమాణం పడిపోతే డీహైడ్రేషన్​కు దారి తీస్తుంది. తక్కువ స్థాయి డీహైడ్రేషన్ కూడా మనల్ని శక్తిహీనం చేస్తుందని, ఫలితంగా విషయగ్రహణ సామర్థ్యం దెబ్బతింటుందని అంటున్నారు. ఏకాగ్రత, స్వల్పకాల జ్ఞాపకశక్తి, అప్రమత్తతపై ప్రభావం పడుతుంది. వీటికి తోడు కళ్లు తిరగడం, వడదెబ్బ, తలనొప్పి, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. శరీరంలో సరిపడా నీరు లేకపోతే మలబద్ధకంతో పాటు చర్మం, మూత్రపిండాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు.

ఎప్పుడు తాగాలి? : దాహం వేసినప్పుడు, భోజనానికి ముందు, తర్వాత సరిపడా నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల ఆహారం బాగా జీర్ణమవుతుందని అంటున్నారు. వ్యాయామానికి ముందు, తర్వాత నీరు తాగడం మార్చిపోకూడదని చెబుతున్నారు. జ్వరం, వాంతులు లేదా డయేరియాతో బాధపడుతుంటే శరీరం నుంచి ఎక్కువ ద్రవాలు బయటకు పోతాయని, అలాంటి సందర్భాలోనే నీరు ఎక్కువగా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. కిడ్నీలో రాళ్లు, మూత్రాశయ ఇన్​ఫెక్షన్లు ఉన్నవారు డాక్టర్లు సూచనల మేరకు నీరు తీసుకోవాలని NIH పరిశోధకులు అంటున్నారు.

గర్భిణులు, పాలిచ్చే తల్లులు కూడా సరిపడా నీరు తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే, కొంత మంది అదే పనిగా నీళ్లు తాగుతుంటారు. దీని వల్ల కొన్ని సార్లు రక్తంలో సోడియం గాఢత తగ్గి హైపోనట్రేమియా స్థితి వస్తుంది. ఫలితంగా అలసట, తిమ్మిరి, వాంతులు, వికారం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ నీరు తాగి పదే పదే మూత్రానికి వెళితే ఎలక్ట్రోలైట్​ల స్థాయిలు పడిపోయి కండరాల తిమ్మిరి సమస్య వస్తుందని అంటున్నారు. శరీరంలోని పొటాషియం స్థాయిలు తగ్గి ఛాతీలో నొప్పి, కాళ్లలో మంట లాంటి సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు. సరిపడా నీరు తాగే వారికి చాలా తక్కువగానే దాహం వేస్తుందని, మూత్రం ఎలాంటి రంగును కలిగి ఉండదని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీరు రోజూ ఈ వస్తువులు వాడుతున్నారా? ఇంట్లో కాలుష్యం పెరిగి అనారోగ్యం వచ్చే ఛాన్స్!

ఎండలతో చర్మం నల్లగా మారిపోతుందా? ఇలా చేస్తే సూపర్ స్కిన్ మీ సొంతం!

Drinking Enough Water is Good for Health : ఎండలు మండిపోతున్నాయి. భానుడి సెగలకు విరుగుడు మంచి నీరే! ఇతర శీతల పానీయాల కన్నా స్వచ్ఛమైన నీరే వేసవి తాపం నుంచి రక్షణ కల్పిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మానవుడి శరీర బరువులో 75 శాతం వరకు నీరు ఉంటుందని, శరీరం సరిగా పని చేయాలంటే ప్రతి కణానికి అవయవానికి సరిపడా నీరు అందాలంటున్నారు.

శరీరంలోని వ్యర్థాలను మూత్రం, చెమట, మల విసర్జన ద్వారా తొలగించడానికి నీరు సహాయపడుతుంది. శరీర ఉష్ణోగ్రతలను సాధారణ స్థాయిలో ఉంచడానికి నీరు దోహదపడుతుంది. కీళ్లకు కుషన్ లాంటి ప్రభావాన్ని అందించడంతో పాటు సున్నితమైన కణజాలాలను రక్షిస్తుంది. నోటిలో సరిపడా లాలాజలం ఉత్పత్తి కావడానికి నీటి అవసరం చాలా ఉంది. ఒబేసిటీని తగ్గించుకోవడానికీ, రక్తంలో ఆక్సిజన్ స్థాయి మెరుగుపరచుకోవడానికి నీరు ఉపయోగపడుతుందని NIH పరిశోధనలో తేలింది.

వాటర్
వాటర్ (Getty images)

గుర్తుంచుకోండి : నీరు, ఆహారం, ఇతర పానీయాలు ద్వారా శరీరానికి ద్రవాలు అందాలి. శరీరానికి అవసరమైన నీటిలో 20 శాతం ఆహారం ద్వారానే అందుతుంది. కీర, పుచ్చకాయ వంటి వాటిలో గణనీయంగా నీరు ఉంటుంది. కాఫీ, టీలు రోజుకు 300 మి.గ్రా కన్నా ఎక్కువగా తీసుకుంటే స్వల్పస్థాయి డైయూరిటిక్ ప్రభావం తలెత్తుతుందని నిపుణులు అంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్, శీతల పానీయాలు వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదని, వాటిలో కెఫిన్, చక్కెర ఎక్కువగా ఉంటుందని తెలిపారు. వీటితో పాటు మద్యం కూడా డైయూరిటిక్ ప్రభావాన్ని కలిగిస్తుందని, ఫలితంగా శరీరం ఎక్కువగా నీటిని కోల్పోతుందని చెబుతున్నారు. అందుకే సాధ్యమైనంత వరకు సాధారణ నీటిని తాగడానికే ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

వాటర్ గ్లాస్
వాటర్ గ్లాస్ (Getty images)

సమతౌల్యతకు యంత్రాంగం ఉంది : శరీరంలోని యాంటీ డై యూరెటిక్ హార్మోన్(ADH), రెనిన్-యాంజియెటెన్సిన్ - ఆల్డోస్టెరాన్ వ్యవస్థ (RAAS) కలిసి పనిచేస్తూ శరీరంలో నీటి సమతౌల్యతను కాపాడుతుంటాయని చెబుతున్నారు. ఇవి శరీరంలో నీరు శాతం తగ్గినప్పుడు ఒంట్లోని ద్రవాలను సంరక్షించుకుంటాయి. చెమటను తగ్గించడం, మూత్రాన్ని చిక్కగా చేయడం ద్వారా ఈ ఇబ్బందిని అధిగమిస్తాయని తెలిపారు. అందువల్ల నీరు తక్కువగా తాగినవారు కూడా కొంత సేపు సాధారణంగానే పనిచేయగలుగుతారని నిపుణులు వివరించారు.

శరీరం చెప్పేస్తుంది : ఒక రోజుకు ఎంత పరిమాణంలో నీరు అవసరమన్నది వ్యక్తులను బట్టి మారుతుందని నిపుణులు అంటున్నారు. శారీరక శ్రమ, వాతావరణ పరిస్థితులు ఎంత నీరు తాగాలనేది నిర్ణయిస్తారని చెబుతున్నారు. ఏసీలో కూర్చొని పని చేస్తున్న వ్యక్తి కంటే ఎండలో పొలంలో శ్రమిస్తున్న రైతుకు ఎక్కువ నీళ్లు అవసరం అవుతాయి. తేమ, వేడితో కూడిన వాతావరణం, ఎత్తయిన ప్రదేశాల్లో నివసించే వారు, క్రీడాకారులు, ఇతరుల కంటే ఎక్కువగా నీరు అవసరం అవుతుంది. దాహం రూపంలో శరీరం అందించే సహజ సిద్ధ సంకేతాలను ఆలకించి, ఆ మేరకు నడుచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వాటర్
వాటర్ (Getty images)

ఎంతైతే మేలు : నిత్యం ఎంత పరిమాణంలో నీటిని తీసుకోవాలన్న అంశంపై శాస్త్రీయ ఆధారాల్లో సృష్టత లేదు. కానీ, వయోజనులు 2 నుంచి 3 లీటర్ల నీటిని తాగాలి. మహిళలు 2.7 లీటర్లు, పురుఘలు 3.7 లీటర్ల నీటిని తాగాలని అమెరికా నేషనల్ అకాడమీస్ ఆఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్, మెడిసిన్ నిర్దేశించింది. సాధారణ ఆరోగ్య పరిస్థితి ఉన్న వ్యక్తులు రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలని చెబుతున్నారు.

తాగకుంటే ఏమవుతుంది? : శ్వాస, చెమట, మూత్రం, మలవిసర్జన ద్వారా నీటిని శరీరం కోల్పోతుంది. ఎక్కువసేపు తీవ్ర ఉష్ణతాకిడికి గురైనా చెమట రూపంలో శరీరం అనేది నీటిని నష్టపోతుంది. అందుకే ఎప్పుటికప్పుడు నీటిని తాగడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. శరీరం తన సాధారణ విధులను సరిగా నిర్వహించలేని స్థాయికి నీటి పరిమాణం పడిపోతే డీహైడ్రేషన్​కు దారి తీస్తుంది. తక్కువ స్థాయి డీహైడ్రేషన్ కూడా మనల్ని శక్తిహీనం చేస్తుందని, ఫలితంగా విషయగ్రహణ సామర్థ్యం దెబ్బతింటుందని అంటున్నారు. ఏకాగ్రత, స్వల్పకాల జ్ఞాపకశక్తి, అప్రమత్తతపై ప్రభావం పడుతుంది. వీటికి తోడు కళ్లు తిరగడం, వడదెబ్బ, తలనొప్పి, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. శరీరంలో సరిపడా నీరు లేకపోతే మలబద్ధకంతో పాటు చర్మం, మూత్రపిండాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు.

ఎప్పుడు తాగాలి? : దాహం వేసినప్పుడు, భోజనానికి ముందు, తర్వాత సరిపడా నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల ఆహారం బాగా జీర్ణమవుతుందని అంటున్నారు. వ్యాయామానికి ముందు, తర్వాత నీరు తాగడం మార్చిపోకూడదని చెబుతున్నారు. జ్వరం, వాంతులు లేదా డయేరియాతో బాధపడుతుంటే శరీరం నుంచి ఎక్కువ ద్రవాలు బయటకు పోతాయని, అలాంటి సందర్భాలోనే నీరు ఎక్కువగా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. కిడ్నీలో రాళ్లు, మూత్రాశయ ఇన్​ఫెక్షన్లు ఉన్నవారు డాక్టర్లు సూచనల మేరకు నీరు తీసుకోవాలని NIH పరిశోధకులు అంటున్నారు.

గర్భిణులు, పాలిచ్చే తల్లులు కూడా సరిపడా నీరు తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే, కొంత మంది అదే పనిగా నీళ్లు తాగుతుంటారు. దీని వల్ల కొన్ని సార్లు రక్తంలో సోడియం గాఢత తగ్గి హైపోనట్రేమియా స్థితి వస్తుంది. ఫలితంగా అలసట, తిమ్మిరి, వాంతులు, వికారం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ నీరు తాగి పదే పదే మూత్రానికి వెళితే ఎలక్ట్రోలైట్​ల స్థాయిలు పడిపోయి కండరాల తిమ్మిరి సమస్య వస్తుందని అంటున్నారు. శరీరంలోని పొటాషియం స్థాయిలు తగ్గి ఛాతీలో నొప్పి, కాళ్లలో మంట లాంటి సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు. సరిపడా నీరు తాగే వారికి చాలా తక్కువగానే దాహం వేస్తుందని, మూత్రం ఎలాంటి రంగును కలిగి ఉండదని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీరు రోజూ ఈ వస్తువులు వాడుతున్నారా? ఇంట్లో కాలుష్యం పెరిగి అనారోగ్యం వచ్చే ఛాన్స్!

ఎండలతో చర్మం నల్లగా మారిపోతుందా? ఇలా చేస్తే సూపర్ స్కిన్ మీ సొంతం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.