Varun Tej Lavanya Tripathi Kids: మెగా ఫ్యామిలీ, అభిమానులు త్వరలో ఓ గుడ్న్యూస్ వినే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు సమాచారం. 2023లో వివాహం చేసుకున్న ఈ జంట తమ జీవితాల్లోకి మొదటి బిడ్డను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇలా క్లూ ఇచ్చారా?
వివాహం తర్వాత లావణ్య యాక్టింగ్ కెరీర్కి కాస్త బ్రేక్ ఇచ్చారు. వెంటనే ఎలాంటి సినిమాకు సైన్ చేయలేదు. పూర్తిగా వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టారు. అయితే ఇటీవల ఆమె తన కొత్త ప్రాజెక్ట్ సతీ లీలావతిని ప్రకటించారు. థనల్ అనే తమిళ మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ సమయంలో ఆమె ఒక వెబ్ సిరీస్లో కూడా పనిచేశారు. ఈ క్రమంలోనే ఆమె ప్రెగ్నెంట్ అయ్యారని, అందుకే ప్రస్తుత ప్రాజెక్టులను ముగించి, కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారని తెలుస్తోంది. కానీ, ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రేమ- పెళ్లి
వరుణ్- లావణ్య మొదటిసారి 2017లో వచ్చిన సినిమా 'మిస్టర్' సినిమా సెట్స్లో కలుసుకున్నారు. ఆ తర్వాత ఈ జంట 2018లో 'అంతరిక్షం' సినిమా సమయంలో మరింత దగ్గరయ్యారు. అలా స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే చాలా కాలం వారి రిలేషన్ని గోప్యంగానే ఉంచారు. రెండేళ్ల క్రితం మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యే వరకు కూడా వీరి ప్రేమాయణం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ కపుల్స్లో ఈ జంట కూడా ఒకటి.
మరోవైపు వరుణ్ తేజ్ తన నెక్స్ట్ మూవీ 'కొరియన్ కనకరాజు' అనే హారర్- కామెడీ కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నారు. అయితే ఇటీవల బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తున్న వరుణ్ గట్టి కమ్బ్యాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.
ఇటీవల టాలీవుడ్ మరో స్టార్ కపుల్ అక్కినేని నాగ చైతన్య- శోభిత కూడా తల్లిదండ్రులు కాబోతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఆ ఊహాగానాలలో ఎటువంటి నిజం లేదని తేలింది.
లావణ్య త్రిపాఠితో లవ్ - వరుణ్ తేజ్పై కోపం పెంచుకున్న చిరు!