Urvashi Rautela Temple In South : బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా ఓ వింత కోరికతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఉత్తరాఖండ్లో తన పేరు మీద ఆలయం ఉందని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు దక్షిణాదిలోనూ తన కోసం ఓ గుడి కట్టాలని ఆకాంక్షించారు. దీనితో ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమ్మడి చిలిపి కోరికపై నెటిజన్లు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.
ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊర్వశీ రౌతేలా మాట్లాడుతూ, "ఉత్తరాఖండ్లో నా పేరు మీద ఓ గుడి ఉంది. బద్రీనాథ్కు ఎవరైనా వెళితే, పక్కనే ఉన్న నా గుడిని చూడండి. అక్కడి వెళ్లి సందర్శించండి. దిల్లీ యూనివర్సిటీలోనూ నా ఫొటోలకు పూలమాలలు వేసి పూజిస్తారు. నన్ను 'దండమమాయి' అని పిలుస్తారు కూడా. ఈ విషయం తెలిసిన తరువాత నేను చాలా ఆశ్చర్యపోయాను. కానీ ఇది నిజం. దీనిపై చాలా వార్తా కథనాలు కూడా ఉన్నాయి. కావాలంటే మీరంతా వార్తా కథనాలను చదవచ్చు.
భ్రమలో మునిగిపోకు!
'టాలీవుడ్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, పవర్స్టార్ పవన్ కల్యాణ్, నటరత్న బాలకృష్ణలతో కలిసి నటించాను. దక్షిణాదిలో కూడా నాకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అందుకే దక్షిణ భారతదేశంలోనూ నా కోసం ఓ ఆలయాన్ని నిర్మించాలని ఆశిస్తున్నా' అని ఊర్విశీ అన్నారు. మరి మీ గుడికి వచ్చినవారు మీ ఆశీర్వాదం తీసుకుంటారా? అని యాంకర్ అడగ్గా, అది ఆలయమని, అన్ని ఆలయాల్లో ఏమేమి జరుగుతాయో అక్కడ కూడా అవే జరుగుతాయని ఊర్వశి తెలిపారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'ఆమె పూర్తిగా భ్రమలో మునిగిపోయింది' అని సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.
'సింగ్ సాబ్ ది గ్రేట్' సినిమాతో బాలీవుడ్కు పరిచయమైన ఊర్వశి సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చాలా చురుగ్గా ఉంటారు. లేటెస్ట్ ఫ్యాషన్, ట్రెండీ దుస్తుల్లో దిగిన ఫొటోలను షేర్ చేస్తుంటారు. ఇటీవల బాలకృష్ట 'డాకు మహారాజ్'లో అదిరిపోయే నృత్యం చేసి, ప్రేక్షకులను అలరించారు. తెలుగులో వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద తదితర చిత్రాల్లోనూ ఆమె స్పెషల్ సాంగ్స్ చేశారు.
అత్యాచారం సీన్ తర్వాత వాంతులు చేసుకున్నా- దియా మిర్జా షాకింగ్ కామెంట్స్