ETV Bharat / entertainment

భారీ ధరకు 'ఎమర్జెన్సీ' OTT రైట్స్​ - సేఫ్​ జోన్​లో కంగనా రనౌత్! - EMERGENCY OTT RELEASE

భారీ ధరకు ఎమర్జెన్సీ స్ట్రీమింగ్ రైట్స్​ను కొనుగోలు చేసిన నెట్​ఫ్లిక్స్​ - సేఫ్​ జోన్​లో నిర్మాత కంగనా రనౌత్!

Kangana Ranaut Emergency OTT Release
Kangana Ranaut Emergency OTT Release (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : March 17, 2025 at 9:55 AM IST

1 Min Read

Kangana Ranaut Emergency OTT Release : బాలీవుడ్​ ఫైర్ బ్రాండ్​ కంగనా రనౌత్‌ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'ఎమర్జెన్సీ'. భారీ అంచనాల నడుమ జనవరి జనవరి 17న థియేటర్లలో రిలీజ్​ అయింది. అంతకుముందు సెన్సార్​ సమస్యల వల్ల చాలా సార్లు పోస్ట్​పోన్ అవుతూ వచ్చింది. అయితే బాక్సాఫీస్‌ వద్ద ఎమర్జెన్సీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మిక్స్​డ్​ టాక్​ తెచ్చుకుని సరిపెట్టుకుంది. కాగా ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ నెట్​ఫ్లిక్​ వేదికగా ఇది అందుబాటులోకి రానుంది. ఆశించిన స్థాయిలో ఆడలేకపోయిన ఈ సినిమాను రైట్స్​ను నెట్​ఫ్లెక్స్​ భారీ ధరకు దక్కించుకుంది. రూ.80 కోట్లు వెచ్చించి స్ట్రీమింగ్​ హక్కులను దక్కించుకుంది. దీంతో కంగనా టీమ్​ సేఫ్​ జోన్​లో పడినట్లు అయింది.

ఇక సినిమా విషయానికి వస్తే- మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితాన్ని ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు మేకర్స్. అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) అనౌన్స్​ చేసిన సందర్భాన్ని ఆధారంగా చేసుకొని దీన్ని సిద్ధం చేశారు. కంగన డైరెక్టర్​గానే కాకుండా ఈ చిత్ర నిర్మాతగానూ వ్యవహరించారు.

ఈ మూవీలో జయప్రకాశ్​ నారాయణ్‌ పాత్రలో బాలీవుడ్​ స్టార్ నటుడు అనుపమ్‌ ఖేర్‌ నటించగా, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ రోల్​లో యంగ్ హీరో హీరో శ్రేయస్ తల్పడే కనిపించారు. వారితో పాటు భూమికా చావ్లా, మిలింద్ సొమన్, మహిమా చౌదరి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో మెరిశారు. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. రూ.60 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.21 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించినట్లు అంచనా.

Kangana Ranaut Emergency OTT Release : బాలీవుడ్​ ఫైర్ బ్రాండ్​ కంగనా రనౌత్‌ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'ఎమర్జెన్సీ'. భారీ అంచనాల నడుమ జనవరి జనవరి 17న థియేటర్లలో రిలీజ్​ అయింది. అంతకుముందు సెన్సార్​ సమస్యల వల్ల చాలా సార్లు పోస్ట్​పోన్ అవుతూ వచ్చింది. అయితే బాక్సాఫీస్‌ వద్ద ఎమర్జెన్సీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మిక్స్​డ్​ టాక్​ తెచ్చుకుని సరిపెట్టుకుంది. కాగా ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ నెట్​ఫ్లిక్​ వేదికగా ఇది అందుబాటులోకి రానుంది. ఆశించిన స్థాయిలో ఆడలేకపోయిన ఈ సినిమాను రైట్స్​ను నెట్​ఫ్లెక్స్​ భారీ ధరకు దక్కించుకుంది. రూ.80 కోట్లు వెచ్చించి స్ట్రీమింగ్​ హక్కులను దక్కించుకుంది. దీంతో కంగనా టీమ్​ సేఫ్​ జోన్​లో పడినట్లు అయింది.

ఇక సినిమా విషయానికి వస్తే- మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితాన్ని ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు మేకర్స్. అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) అనౌన్స్​ చేసిన సందర్భాన్ని ఆధారంగా చేసుకొని దీన్ని సిద్ధం చేశారు. కంగన డైరెక్టర్​గానే కాకుండా ఈ చిత్ర నిర్మాతగానూ వ్యవహరించారు.

ఈ మూవీలో జయప్రకాశ్​ నారాయణ్‌ పాత్రలో బాలీవుడ్​ స్టార్ నటుడు అనుపమ్‌ ఖేర్‌ నటించగా, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ రోల్​లో యంగ్ హీరో హీరో శ్రేయస్ తల్పడే కనిపించారు. వారితో పాటు భూమికా చావ్లా, మిలింద్ సొమన్, మహిమా చౌదరి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో మెరిశారు. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. రూ.60 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.21 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించినట్లు అంచనా.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.