Kangana Ranaut Emergency OTT Release : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'ఎమర్జెన్సీ'. భారీ అంచనాల నడుమ జనవరి జనవరి 17న థియేటర్లలో రిలీజ్ అయింది. అంతకుముందు సెన్సార్ సమస్యల వల్ల చాలా సార్లు పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఎమర్జెన్సీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకుని సరిపెట్టుకుంది. కాగా ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్ వేదికగా ఇది అందుబాటులోకి రానుంది. ఆశించిన స్థాయిలో ఆడలేకపోయిన ఈ సినిమాను రైట్స్ను నెట్ఫ్లెక్స్ భారీ ధరకు దక్కించుకుంది. రూ.80 కోట్లు వెచ్చించి స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. దీంతో కంగనా టీమ్ సేఫ్ జోన్లో పడినట్లు అయింది.
ఇక సినిమా విషయానికి వస్తే- మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితాన్ని ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు మేకర్స్. అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) అనౌన్స్ చేసిన సందర్భాన్ని ఆధారంగా చేసుకొని దీన్ని సిద్ధం చేశారు. కంగన డైరెక్టర్గానే కాకుండా ఈ చిత్ర నిర్మాతగానూ వ్యవహరించారు.
ఈ మూవీలో జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు అనుపమ్ ఖేర్ నటించగా, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ రోల్లో యంగ్ హీరో హీరో శ్రేయస్ తల్పడే కనిపించారు. వారితో పాటు భూమికా చావ్లా, మిలింద్ సొమన్, మహిమా చౌదరి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో మెరిశారు. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. రూ.60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.21 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించినట్లు అంచనా.