NTR On Pawan Kalyan Son : పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో అగ్ని ప్రమాదానికి గురవ్వడం పట్ల నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అతడు మంటల్లో చిక్కుకున్నట్ల తెలిసి బాధపడ్డట్లు తెలిపారు. మార్క్ త్వరగా కోలుకోవాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు.
'సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ చిక్కుకున్నాడని తెలిసి బాధపడ్డాను. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్' అని ఎన్టీఆర్ రాసుకొచ్చారు. అలాగే పవన్ కుటుంబసభ్యులంతా కూడా ధైర్యంగా ఉండాలని ఎన్టీఆర్ కోరారు.
Saddened to hear about Mark Shankar being caught in a fire mishap in Singapore. Wishing him a speedy recovery. Stay strong ,little warrior ! Strength and prayers to Shri @PawanKalyan garu and family.
— Jr NTR (@tarak9999) April 9, 2025
ఇదీ జరిగింది
పవన్ కుమారుడు మార్క్ సింగపూర్లో చదువుకునే స్కూల్లో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అతడితో పాటు పలువురు చిన్నారులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్, చిరంజీవి దంపతులు సింగపూర్ వెళ్లారు. మార్క్ కోలుకుంటున్నాడని ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడం వల్ల తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని వైద్యులు పవన్కు తెలిపారు