Rajasaab Release Date : పాన్ఇండియా స్టార్ ప్రభాస్- మారుతి కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'రాజాసాబ్'. కామెడీ హార్రర్ జానర్లో ఇది తెరక్కుతోంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల ఇది వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ను మేకర్స్ ఇప్పటివరకు ప్రకటించలేదు. కానీ, 2025 నవంబర్లో ఈ సినిమా రిలీజ్ కానుందని ప్రచారం సాగుతోంది. దీనిపై డైరెక్టర్ మారుతి స్పందించారు.
దర్శకుడు మారుతి తాజాగా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, శ్రీకాళహస్తి క్షేత్రాలకు వెళ్లారు. ఈ ఆధ్యాత్మిక ట్రిప్నకు సంబంధించిన ఫోటోలు ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ప్రభాస్ అభిమాని ఒకరు 'రాజాసాబ్' రిలీజ్ గురించి క్లారిటీ ఇవ్వాలని కోరారు. 'మీరు ప్రాజెక్ట్ ఔట్పుట్తో పూర్తిగా సంతృప్తి చెందినప్పుడే సినిమా రిలీజ్ చేయండి. కానీ, ఈ సినిమా నవంబర్లో వస్తుందా? లేదా వచ్చే ఏడాది రిలీజ్ కానుందా? అనేది మీడియా ద్వారా అప్డేట్ ఇవ్వండి. అభిమానులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు' అని కామెంట్ సెక్షన్లో రాసుకొచ్చారు.
దీనికి మారుతి స్పందించారు. దీనిపై పక్కా సమాచారం ఇవ్వాల్సింది మేకర్సేనని చెప్పారు.'సీజీ ఔట్పుట్ త్వరలోనే వస్తుంది. అది వేరిఫై అయ్యాక మేకర్స్ దీనిపై అప్డేట్ ఇస్తారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఎందరో కష్టపడి పనిచేస్తున్నారు. ఇది ఒక్కడి వల్ల సాధ్యం అయ్యేది కాదు. నాణ్యమైన ఔట్పుట్ ఇవ్వాలంటే కాస్త సమయం పడుతుంది. అందుకే కాస్త ఓపిగ్గా ఉండండి. మా టీమ్ అంతా మీ అంచనాలను అందుకోవడానికే కష్టపడి పని చేస్తున్నాం' అని మారుతి రిప్లై ఇచ్చారు.
Take Your Time and release #Rajasaab whenever You’re satisfied with the product
— Ravi @ Prabhas Army (@RaviPrabhas333) April 8, 2025
Just give official info through media that it’ll come in November or next year or whenever. Fans will not bother You
అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి గతేడాది వీడియో గ్లింప్స్ తప్పితే ఎలాంటి అప్డేట్ రాలేదు. అప్పట్నుంచి డార్లింగ్ ఫ్యాన్స్ అప్డేట్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా నవంబర్కు షిఫ్ట్ అయ్యిందని ప్రచారం సాగింది. దీనిపైనే అభిమాని అడగ్గా, మారుతి క్లారిటీ ఇచ్చారు.
కాగా, ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. కార్తీక్ పళని ఛాయాగ్రహణం బాధ్యతలు చూస్తుండగా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
ఆ హీరోయిన్తో కలిసి యూరప్కు 'రాజాసాబ్' ప్రభాస్!
'హ్యారీపోటర్'లా ప్రభాస్ సినిమా - ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత