ETV Bharat / entertainment

మా ప్రభుత్వం వచ్చి ఏడాదైనా సినీ పెద్దలు CMను కలిశారా? : పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ - PAWAN KALYAN ON FILM INDUSTRY

తెలుగు సినీ ఇండస్ట్రీపై పవన్ అసంతృప్తి

PAWAN KALYAN ON FILM INDUSTRY
PAWAN KALYAN ON FILM INDUSTRY (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2025 at 5:26 PM IST

5 Min Read

Pawan Kalyan on Telugu Film Industry : రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకూడదని చూస్తుంటే, తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. NDA ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబుని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా కలవకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా, చిత్ర రంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదని అంతా కలసి రావాలని తాను సూచించినా సానుకూలంగా స్పందించకపోవడం సరికాదన్నారు. తెలుగు సినిమా రంగంలోని అగ్ర నటులను, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా ఛీత్కరించుకొని ఇక్కట్లకు గురిచేసిందో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్ లాంటి సంఘాలు మరచిపోయినట్లున్నాయనే భావన కనిపిస్తోందన్నారు.

రూ. కోట్ల రూపాయల పెట్టుబడులతో రూపొందే చిత్రాలకు అన్ని విధాలా ప్రోత్సాహం ఇవ్వడంతో, సృజనాత్మకత ముడిపడిన ఈ వ్యాపారంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు స్పష్టంగా చెప్పాయన్నారు. గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేదని, కక్ష సాధింపులకు దిగేదని తమకు నచ్చనివారి సినిమాల విడుదల సమయంలో తహసీల్దార్లను థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులుపెట్టిందో నిర్మాతలు మరచిపోతే ఎలా అని ప్రశ్నించారు.

ఎన్నికలకు ముందు చంద్రబాబు, తాను చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడలేదని, అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన చిత్రం విడుదలైనప్పుడు సైతం ఏపీ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించిందని చెప్పారు. వ్యవస్థ బాగుండాలి, దానిపై ఆధారపడ్డవారు ఇబ్బందిపడకూడదనేదే కూటమి ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. తెలుగు సినిమా రంగం వారు తమ సినిమా విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి అర్జీలు ఇచ్చి, టిక్కెట్‌ ధర పెంచమని కోరడం ఎందుకు? అందరూ కలసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించాలని పవన్‌కల్యాణ్‌ సూచించారు.

దిల్‌ రాజు, అల్లు అరవింద్‌, డి.సురేశ్‌బాబు, వై.సుప్రియ, చినబాబు, సి.అశ్వనీదత్‌, నవీన్‌ ఎర్నేని తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమగా అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. అయినా ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్‌ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకి అర్జీలు ఇస్తూ వచ్చారని సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ, పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న తమకు తెలుగు సినిమాకి చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్‌ గిఫ్ట్‌ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని నిర్ణయించుకున్నట్లు పవన్‌ తెలిపారు. రిటర్న్ గిఫ్ట్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదని, సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తామని వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని ప్రకటించిందని అదే విధంగా సినిమా రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని తాను ఆలోచన చేశారన్నారు. దీనిపై ముఖ్యమంత్రితోనూ చర్చించనున్నానని అనంతరం పూర్తిస్థాయిలో ఫిల్మ్‌ డెవలప్మెంట్‌ పాలసీని ప్రకటిస్తారని ఉపముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.

ఉప ముఖ్యమంత్రి పవన్‌ పర్యవేక్షణలో సంబంధిత శాఖలతో సినిమా రంగం అభివృద్ధిపై ఇప్పటి కొన్ని చర్చలు చేశారని ఇందులో ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు ఒక గ్రూపుగా ఏర్పడి చేస్తున్న వ్యవహారాలతోపాటు ప్రేక్షకులు వెచ్చిస్తున్న మొత్తాలు, అందుకు అనుగుణంగా అతను పొందుతున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి తదితర అంశాలను ఇప్పటికే చర్చించారని పవన్‌ కార్యాలయం ప్రకటించింది.

థియేటర్లను సంబంధిత యజమానులు నడపటం లేదని, లీజుదారుల చేతిలోనే అత్యధికం ఉన్నాయని అధికారులు తెలిపారని, అయితే లీజుదారుల నుంచి పన్ను సక్రమంగా వస్తుందా లేదా? వివిధ చిత్రాలకు ధరలు పెంచినప్పుడు ఆ మేరకు పన్ను ఆదాయం పెరిగిందా లేదా అని కూడా పన్నుల విభాగం పరిశీలన చేయాలని దిశానిర్దేశం చేశారని డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో థియేటర్ల నుంచి వచ్చే ఆదాయంపైనా చర్చించారని టికెట్ అమ్మకానికి, వచ్చే పన్నుకీ అంతరం ఏ మేరకు ఉందో చూడాలని నిర్ణయించారని తెలిపింది.

అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్లలో పారిశుద్ధ్య పరిస్థితులను కూడా స్థానిక సంస్థల ద్వారా పర్యవేక్షించనున్నారని ప్రేక్షకుల నుంచి ప్రభుత్వానికి తరచూ వస్తున్న ఫిర్యాదుల్లో సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలు అత్యధికంగా ఉండటం, మంచి నీళ్ల సదుపాయం కూడా సక్రమంగా లేకపోవడంపైనా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నారని వెల్లడించింది. ఈ మేరకు తూనికలు కొలతల అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్స్‌తో తనిఖీలు చేయించడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందుతాయని పేర్కొంది.

ఈ అంశాలపై ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌తోపాటు హోం, వాణిజ్య పన్నులు, రెవెన్యూ శాఖల మంత్రులతో త్వరలో చర్చిస్తారని వివరించింది. రాష్ట్రంలో మల్టీప్లెక్స్‌ స్థాయి సినిమా హాల్స్ ఎన్ని ఉన్నాయో తెలియచేయాలని ఇప్పటికే సినిమాటోగ్రఫీ శాఖ అధికారులను నివేదిక అడిగింది. కొన్ని పట్టణాల్లో సింగిల్ థియేటర్లను కూడా రెండుమూడు స్క్రీన్స్ గా విభజించి మల్టీప్లెక్స్ విధానంలో నడుపుతున్నారు. వాటిలో టికెట్ ధరలు, సింగిల్ థియేటర్ టికెట్ ధరలకు ఏమైనా వ్యత్యాసం ఉందా? కౌంటర్​లో ఏ ధరకు అమ్ముతున్నారో ఆరా తీస్తున్నారు.

విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, రాజమహేంద్రవరం, గుంటూరు, కాకినాడ, తిరుపతి తదితర నగరాల్లో ఉన్న మల్టీప్లెక్స్ ల నిర్వహణ వాటిలోని టికెట్ ధరలు, ఆహార పదార్థాల ధరలపై కూడా దృష్టి సారిస్తారు.

కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సినిమా రూపకల్పన నుంచి వాణిజ్యం వరకూ 24 విభాగాల్లో నైపుణ్యాలు పెంపుదల అధునాతన సాంకేతికత వినియోగంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని పవన్ కల్యాణ్ యోచిస్తున్నారు. పరిశ్రమ హోదా కల్పించడంతోనే సరిపుచ్చకుండా యువతలోను, ఇప్పటికే చిత్ర రంగంలో ఉన్నవారికీ ఎప్పటికప్పుడు నైపుణ్యాల అభివృద్ధి కోసం- అవసరమైన శిబిరాలు, సెమినార్లు, సింపోజియమ్స్ లాంటివి ఆంధ్రప్రదేశ్​లో విరివిగా నిర్వహిస్తారు.

సినిమా రంగంలో స్టూడియో నుంచి సినిమా హాల్ వరకూ ఉండే విభాగాలలో గుత్తాధిపత్యం కంటే ఎక్కువ మందికి అవకాశాలు కల్పిస్తేనే- పెట్టుబడులు పెరిగి పరిశ్రమగా వృద్ధి చెందుతుంది. ఈ దిశగానే పవన్ కల్యాణ్ ఆలోచన చేశారు. కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి బాటలు వేస్తున్నారు.

'వీరమల్లు పాటకు పౌరుషం వస్తుంది- ఇప్పటికే 50సార్లు విన్నా'- పవన్ కల్యాణ్

పవన్​ కల్యాణ్​ 'OG' ఫస్ట్​ సాంగ్​ రిలీజ్​కు ముహూర్తం ఫిక్స్​ - 'ఫైర్​ స్టార్మ్'​ వచ్చేది అప్పుడే!

Pawan Kalyan on Telugu Film Industry : రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకూడదని చూస్తుంటే, తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. NDA ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబుని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా కలవకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా, చిత్ర రంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదని అంతా కలసి రావాలని తాను సూచించినా సానుకూలంగా స్పందించకపోవడం సరికాదన్నారు. తెలుగు సినిమా రంగంలోని అగ్ర నటులను, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా ఛీత్కరించుకొని ఇక్కట్లకు గురిచేసిందో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్ లాంటి సంఘాలు మరచిపోయినట్లున్నాయనే భావన కనిపిస్తోందన్నారు.

రూ. కోట్ల రూపాయల పెట్టుబడులతో రూపొందే చిత్రాలకు అన్ని విధాలా ప్రోత్సాహం ఇవ్వడంతో, సృజనాత్మకత ముడిపడిన ఈ వ్యాపారంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు స్పష్టంగా చెప్పాయన్నారు. గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేదని, కక్ష సాధింపులకు దిగేదని తమకు నచ్చనివారి సినిమాల విడుదల సమయంలో తహసీల్దార్లను థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులుపెట్టిందో నిర్మాతలు మరచిపోతే ఎలా అని ప్రశ్నించారు.

ఎన్నికలకు ముందు చంద్రబాబు, తాను చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడలేదని, అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన చిత్రం విడుదలైనప్పుడు సైతం ఏపీ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించిందని చెప్పారు. వ్యవస్థ బాగుండాలి, దానిపై ఆధారపడ్డవారు ఇబ్బందిపడకూడదనేదే కూటమి ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. తెలుగు సినిమా రంగం వారు తమ సినిమా విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి అర్జీలు ఇచ్చి, టిక్కెట్‌ ధర పెంచమని కోరడం ఎందుకు? అందరూ కలసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించాలని పవన్‌కల్యాణ్‌ సూచించారు.

దిల్‌ రాజు, అల్లు అరవింద్‌, డి.సురేశ్‌బాబు, వై.సుప్రియ, చినబాబు, సి.అశ్వనీదత్‌, నవీన్‌ ఎర్నేని తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమగా అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. అయినా ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్‌ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకి అర్జీలు ఇస్తూ వచ్చారని సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ, పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న తమకు తెలుగు సినిమాకి చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్‌ గిఫ్ట్‌ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని నిర్ణయించుకున్నట్లు పవన్‌ తెలిపారు. రిటర్న్ గిఫ్ట్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదని, సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తామని వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని ప్రకటించిందని అదే విధంగా సినిమా రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని తాను ఆలోచన చేశారన్నారు. దీనిపై ముఖ్యమంత్రితోనూ చర్చించనున్నానని అనంతరం పూర్తిస్థాయిలో ఫిల్మ్‌ డెవలప్మెంట్‌ పాలసీని ప్రకటిస్తారని ఉపముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.

ఉప ముఖ్యమంత్రి పవన్‌ పర్యవేక్షణలో సంబంధిత శాఖలతో సినిమా రంగం అభివృద్ధిపై ఇప్పటి కొన్ని చర్చలు చేశారని ఇందులో ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు ఒక గ్రూపుగా ఏర్పడి చేస్తున్న వ్యవహారాలతోపాటు ప్రేక్షకులు వెచ్చిస్తున్న మొత్తాలు, అందుకు అనుగుణంగా అతను పొందుతున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి తదితర అంశాలను ఇప్పటికే చర్చించారని పవన్‌ కార్యాలయం ప్రకటించింది.

థియేటర్లను సంబంధిత యజమానులు నడపటం లేదని, లీజుదారుల చేతిలోనే అత్యధికం ఉన్నాయని అధికారులు తెలిపారని, అయితే లీజుదారుల నుంచి పన్ను సక్రమంగా వస్తుందా లేదా? వివిధ చిత్రాలకు ధరలు పెంచినప్పుడు ఆ మేరకు పన్ను ఆదాయం పెరిగిందా లేదా అని కూడా పన్నుల విభాగం పరిశీలన చేయాలని దిశానిర్దేశం చేశారని డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో థియేటర్ల నుంచి వచ్చే ఆదాయంపైనా చర్చించారని టికెట్ అమ్మకానికి, వచ్చే పన్నుకీ అంతరం ఏ మేరకు ఉందో చూడాలని నిర్ణయించారని తెలిపింది.

అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్లలో పారిశుద్ధ్య పరిస్థితులను కూడా స్థానిక సంస్థల ద్వారా పర్యవేక్షించనున్నారని ప్రేక్షకుల నుంచి ప్రభుత్వానికి తరచూ వస్తున్న ఫిర్యాదుల్లో సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలు అత్యధికంగా ఉండటం, మంచి నీళ్ల సదుపాయం కూడా సక్రమంగా లేకపోవడంపైనా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నారని వెల్లడించింది. ఈ మేరకు తూనికలు కొలతల అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్స్‌తో తనిఖీలు చేయించడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందుతాయని పేర్కొంది.

ఈ అంశాలపై ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌తోపాటు హోం, వాణిజ్య పన్నులు, రెవెన్యూ శాఖల మంత్రులతో త్వరలో చర్చిస్తారని వివరించింది. రాష్ట్రంలో మల్టీప్లెక్స్‌ స్థాయి సినిమా హాల్స్ ఎన్ని ఉన్నాయో తెలియచేయాలని ఇప్పటికే సినిమాటోగ్రఫీ శాఖ అధికారులను నివేదిక అడిగింది. కొన్ని పట్టణాల్లో సింగిల్ థియేటర్లను కూడా రెండుమూడు స్క్రీన్స్ గా విభజించి మల్టీప్లెక్స్ విధానంలో నడుపుతున్నారు. వాటిలో టికెట్ ధరలు, సింగిల్ థియేటర్ టికెట్ ధరలకు ఏమైనా వ్యత్యాసం ఉందా? కౌంటర్​లో ఏ ధరకు అమ్ముతున్నారో ఆరా తీస్తున్నారు.

విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, రాజమహేంద్రవరం, గుంటూరు, కాకినాడ, తిరుపతి తదితర నగరాల్లో ఉన్న మల్టీప్లెక్స్ ల నిర్వహణ వాటిలోని టికెట్ ధరలు, ఆహార పదార్థాల ధరలపై కూడా దృష్టి సారిస్తారు.

కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సినిమా రూపకల్పన నుంచి వాణిజ్యం వరకూ 24 విభాగాల్లో నైపుణ్యాలు పెంపుదల అధునాతన సాంకేతికత వినియోగంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని పవన్ కల్యాణ్ యోచిస్తున్నారు. పరిశ్రమ హోదా కల్పించడంతోనే సరిపుచ్చకుండా యువతలోను, ఇప్పటికే చిత్ర రంగంలో ఉన్నవారికీ ఎప్పటికప్పుడు నైపుణ్యాల అభివృద్ధి కోసం- అవసరమైన శిబిరాలు, సెమినార్లు, సింపోజియమ్స్ లాంటివి ఆంధ్రప్రదేశ్​లో విరివిగా నిర్వహిస్తారు.

సినిమా రంగంలో స్టూడియో నుంచి సినిమా హాల్ వరకూ ఉండే విభాగాలలో గుత్తాధిపత్యం కంటే ఎక్కువ మందికి అవకాశాలు కల్పిస్తేనే- పెట్టుబడులు పెరిగి పరిశ్రమగా వృద్ధి చెందుతుంది. ఈ దిశగానే పవన్ కల్యాణ్ ఆలోచన చేశారు. కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి బాటలు వేస్తున్నారు.

'వీరమల్లు పాటకు పౌరుషం వస్తుంది- ఇప్పటికే 50సార్లు విన్నా'- పవన్ కల్యాణ్

పవన్​ కల్యాణ్​ 'OG' ఫస్ట్​ సాంగ్​ రిలీజ్​కు ముహూర్తం ఫిక్స్​ - 'ఫైర్​ స్టార్మ్'​ వచ్చేది అప్పుడే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.