Anchor Rashmi Gautam Surgery Update : బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్కు ఇటీవల శస్త్ర చికిత్స జరిగింది. అయితే తనకు ఏం జరిగింది? ప్రస్తుత తన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు వెల్లడించారు. ఇలాంటి సమయంలో తనకు సపోర్ట్గా నిలిచిన వైద్యులు, కుటుంబసభ్యులకు ఆమె ధన్యవాదాలు చెప్పారు.
"ఇలాంటి క్లిష్ట సమయంలో నాకు ఎంతో అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు. దాదాపు ఐదు రోజుల్లోనే నా శరీరంలో హెమోగ్లోబిన్ తొమ్మిది శాతానికి పడిపోయింది. జనవరి నుంచి నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అకాల రక్తస్రావం, తీవ్రమైన భుజం నొప్పితో చాలా ఇబ్బంది పడ్డాను. వైద్యులను సంప్రదిస్తే దేనికి ముందు ట్రీట్మెంట్ తీసుకోవాలో కూడా తెలియలేదు. మార్చి 29 నాటికి పూర్తిగా నీరసించిపోయాను. వర్క్ పరమైన కమిట్మెంట్స్ అన్ని పూర్తి చేసుకుని ఆస్పత్రిలో చేరాను. ఏప్రిల్ 18న శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. మరో మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోనున్నాను" అని ఆమె రాసుకొచ్చారు. సర్జరీకి ముందు దిగిన ఫొటోలను నెటిజన్లతో షేర్ చేసుకున్నారు.