Kalyan Ram On Devara 2: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతేడాది 'దేవర' సినిమాతో మంచి విజయం అందుకున్నారు. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో ఆడియెన్స్ స్వీక్వెల్ గురించి ఎదురు చూస్తున్నారు. అయితే దీని సీక్వెల్ గురించి మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాలేదు. రీసెంట్గా ఎన్టీఆర్ ఓ ఈవెంట్లో 'దేవర 2' ఉంటుందని అన్నారు. కానీ ఎప్పుడో క్లారిటీ ఇవ్వలేదు.
మరోవైపు ఎన్టీఆర్ లైనప్ కూడా ఫుల్ బిజీగా ఉంది. ఆయన చేతిలో ప్రస్తుతం 'వార్ 2', 'NTRNeel', 'దేవర 2' ఉన్నాయి. అంతేకాకుండా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్తోనూ ఓ సినిమాకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్తో తెరకెక్కనుంది. అయితే ఇందులో అన్నింటికంటే ముందు 'వార్ 2' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత ఏ సినిమా విడుదల అవుతుందో? ప్రేక్షకుల్లో కన్ఫ్యూజన్ నెలకొంది.
అయితే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తర్వాత, ఎన్టీఆర్- నెల్సన్ సినిమా ప్రారంభం అవుతుందని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో 'దేవర 2' ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ లైనప్పై నటుడు కల్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు. నెల్సన్ సినిమా కంటే ముందే 'దేవర 2' వస్తుందని కల్యాణ్ రాణ్ అన్నారు. ప్రశాంత్ మూవీ పూర్తవ్వగానే 'దేవర 2' సెట్ మీదకు వెళ్తుందని స్పష్టం చేశారు.
ఈ లెక్కన 2026లోనే దేవర 2 సెట్స్ మీదకు వెళ్తుందన్న మాట. ఈ సినిమా సీక్వెల్కు సంబంధించి కూడా కొన్ని సీన్స్ ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఏడాదే ఇది కంప్లీట్ అయ్యి, 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాతే నెల్సన్ మూవీ పట్టాలెక్కనుందన్న మాట!
కాగా, 'వార్ 2' దాదాపు పూర్తవ్వడంతో, మరో వారంలోనే ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్లో తారక్ అడుగుపెట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్లో తారక్ పాల్గొననున్నారు. 2026 జనవరిలో సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు.
'అన్నా, నీ కోసమే తెలుగు నేర్చుకున్నా'- తారక్తో జపాన్ ఫ్యాన్ క్రేజీ మూమెంట్