ETV Bharat / business

అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే 31శాతం లాభం! - BUYING GOLD ON AKSHAYA TRITIYA

ఏప్రిల్ 30న అక్షయ తృతీయ- బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే!

Buying Gold On Akshaya Tritiya
Buying Gold On Akshaya Tritiya (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : April 18, 2025 at 11:29 AM IST

3 Min Read

Buying Gold On Akshaya Tritiya : హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు చాలా విశిష్టత ఉంది. వైశాఖ మాసం శుక్లపక్షంలోని మూడో రోజును అక్షయ తృతీయ చేసుకుంటారు. పురాణ గాథల ప్రకారం ఈ పండగ ఎంతో విశిష్టమైనది. ఆ పవిత్ర దినాన ఏ పని చేసినా విజయం దక్కుతుందని, అదృష్టమని చాలా మంది నమ్ముతారు. ఇందుకోసం తప్పకుండా కొంతైనా బంగారం, వెండి కొనాలని భావిస్తారు. అయితే బంగారం కొనుగోలు ఇప్పుడు దీర్ఘకాలిక పెట్టుబడిగా మారిపోయింది. ఎందుకంటే గత కొంతకాలంగా బంగారం ధర భారీగా పెరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 30న అక్షయ తృతీయ పండగ వస్తోంది. ఈ క్రమంలో బంగారం కొనడం మంచిదేనా? రేట్లు ఎలా ఉన్నాయి? తదితర విషయాలు తెలుసుకుందాం.

11 నెలల్లో 31 శాతం పెరుగుదల
గతేడాది మే 10న అక్షయ తృతీయ పండగ వచ్చింది. అప్పుడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ.73,240గా ఉంది. ప్రస్తుతం 10 గ్రాములు పసిడి ధర రూ.96,000 దాటింది. అంటే కేవలం 11 నెలల్లో బంగారం దాదాపు 31 శాతం రాబడిని ఇచ్చింది. ఇతర పెట్టుబడుల వల్ల వచ్చిన లాభాలతో పోలిస్తే చాలా ఎక్కువ. దీంతో బంగారంపై దీర్ఘకాల పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. గతేడాది 31శాతం లాభం వచ్చిన నేపథ్యంలో రాబోయే ఏడాది కూడా బంగారం ప్రియులు అదేస్థాయిలో ఇదే ఆసక్తిని కనబర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా పెరిగిన బంగారం ధర
బంగారం ధరల పెరుగుదల భారత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కన్పిస్తోంది. డాలర్‌ బలహీనపడడం, వడ్డీ రేటు తగ్గింపుల అంచనా, ఆర్థిక అనిశ్చితి, కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడం, ద్రవ్యోల్బణం, ఆర్ధిక మాంద్యం భయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వల్ల పసిడి ధర ఆకాశన్నంటుతోంది. "2025లో అమెరికా డాలర్ బలహీనపడింది. ప్రపంచవ్యాప్తంగా యూఎస్ డాలర్ లో బంగారం ధర నిర్ణయిస్తారు. అయితే అమెరికా డాలర్ బలహీనపడడం వల్ల పసిడి ధరలు పెరుగుతున్నాయి. ట్రంప్ సుంకాల ప్రభావం, పరిపాలన వ్యవహారాలు కూడా బంగారం పెరుగుదల ఓ కారణం. " అని ఓ నివేదిక తెలిపింది.

బంగారం ధరలు మరింత పెరుగుతాయా?
ప్రముఖ ఇన్వెస్ట్‌ మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థ గోల్డ్‌మన్‌ శాచ్స్ ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధర 3,700 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. దీర్ఘకాలికంగా మరింత పెరగొచ్చని తెలిపింది. యూబీసీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా 3500 డాలర్లకు పసిడి ధర చేరుకుంటుందని అంచనా వేశాయి.

ఈ విషయాలు తెలుసుకోండి?
అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని భావిస్తే ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. బంగారంపై మీరు ఇన్వెస్ట్ చేస్తే పెట్టుబడి పోర్ట్‌ ఫోలియోను వైవిధ్యపరుస్తుంది. రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, కేంద్ర బ్యాంకు విధానాలు వల్ల బంగారం ధర పెరుగుతోంది. దీంతో పసిడిలో ఇన్వెస్ట్ చేయడం మేలని పలువురు వ్యాపార పండితులు చెబుతున్నారు.

మీరు బంగారంలో ఏ రూపాల్లో పెట్టుబడి పెట్టాలి?

  • భౌతిక బంగారం (ఆభరణాలు, నాణేలు, బార్లు వంటివి)
  • గోల్డ్ ఈటీఎఫ్
  • డిజిటల్ గోల్డ్

ఈ మూడు రూపాల్లో బంగారంలో పెట్టుబడులు పెట్టొచ్చు. గోల్డ్ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దానికి ఛార్జీలు పడవు. పన్ను ప్రయోజనాలను కూడా అందుతాయి.

ఈ అక్షయ తృతీయకు బంగారం కొనాలా వద్దా?
మీరు బంగారాన్ని కేవలం ఆభరణాలుగా కాకుండా బలమైన పెట్టుబడి ఎంపికగా భావిస్తే ఈ అక్షయ తృతీయకు దానిని కొనడం తెలివైన నిర్ణయం కావచ్చు. గత 11 నెలల పనితీరు, ప్రస్తుత ఆర్థిక సూచికలు, రాబోయే కాలంలో వచ్చే అనిశ్చితులు అన్నీ బంగారం కొనుగోలుకు అనుకూలంగా ఉన్నాయి. మీరు అన్నింటిని బేరీజు వేసుకోని పసిడిని కొనుగోలు చేయడం ఉత్తమం.

బంగారం కొంటున్నారా? బిల్లు తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించకపోతే అంతే!

Gold Buying Tips : బంగారు ఆభరణాలు కొనాలా?.. ఈ విషయాలు తెలుసుకోండి!

Buying Gold On Akshaya Tritiya : హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు చాలా విశిష్టత ఉంది. వైశాఖ మాసం శుక్లపక్షంలోని మూడో రోజును అక్షయ తృతీయ చేసుకుంటారు. పురాణ గాథల ప్రకారం ఈ పండగ ఎంతో విశిష్టమైనది. ఆ పవిత్ర దినాన ఏ పని చేసినా విజయం దక్కుతుందని, అదృష్టమని చాలా మంది నమ్ముతారు. ఇందుకోసం తప్పకుండా కొంతైనా బంగారం, వెండి కొనాలని భావిస్తారు. అయితే బంగారం కొనుగోలు ఇప్పుడు దీర్ఘకాలిక పెట్టుబడిగా మారిపోయింది. ఎందుకంటే గత కొంతకాలంగా బంగారం ధర భారీగా పెరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 30న అక్షయ తృతీయ పండగ వస్తోంది. ఈ క్రమంలో బంగారం కొనడం మంచిదేనా? రేట్లు ఎలా ఉన్నాయి? తదితర విషయాలు తెలుసుకుందాం.

11 నెలల్లో 31 శాతం పెరుగుదల
గతేడాది మే 10న అక్షయ తృతీయ పండగ వచ్చింది. అప్పుడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ.73,240గా ఉంది. ప్రస్తుతం 10 గ్రాములు పసిడి ధర రూ.96,000 దాటింది. అంటే కేవలం 11 నెలల్లో బంగారం దాదాపు 31 శాతం రాబడిని ఇచ్చింది. ఇతర పెట్టుబడుల వల్ల వచ్చిన లాభాలతో పోలిస్తే చాలా ఎక్కువ. దీంతో బంగారంపై దీర్ఘకాల పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. గతేడాది 31శాతం లాభం వచ్చిన నేపథ్యంలో రాబోయే ఏడాది కూడా బంగారం ప్రియులు అదేస్థాయిలో ఇదే ఆసక్తిని కనబర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా పెరిగిన బంగారం ధర
బంగారం ధరల పెరుగుదల భారత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కన్పిస్తోంది. డాలర్‌ బలహీనపడడం, వడ్డీ రేటు తగ్గింపుల అంచనా, ఆర్థిక అనిశ్చితి, కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడం, ద్రవ్యోల్బణం, ఆర్ధిక మాంద్యం భయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వల్ల పసిడి ధర ఆకాశన్నంటుతోంది. "2025లో అమెరికా డాలర్ బలహీనపడింది. ప్రపంచవ్యాప్తంగా యూఎస్ డాలర్ లో బంగారం ధర నిర్ణయిస్తారు. అయితే అమెరికా డాలర్ బలహీనపడడం వల్ల పసిడి ధరలు పెరుగుతున్నాయి. ట్రంప్ సుంకాల ప్రభావం, పరిపాలన వ్యవహారాలు కూడా బంగారం పెరుగుదల ఓ కారణం. " అని ఓ నివేదిక తెలిపింది.

బంగారం ధరలు మరింత పెరుగుతాయా?
ప్రముఖ ఇన్వెస్ట్‌ మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థ గోల్డ్‌మన్‌ శాచ్స్ ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధర 3,700 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. దీర్ఘకాలికంగా మరింత పెరగొచ్చని తెలిపింది. యూబీసీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా 3500 డాలర్లకు పసిడి ధర చేరుకుంటుందని అంచనా వేశాయి.

ఈ విషయాలు తెలుసుకోండి?
అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని భావిస్తే ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. బంగారంపై మీరు ఇన్వెస్ట్ చేస్తే పెట్టుబడి పోర్ట్‌ ఫోలియోను వైవిధ్యపరుస్తుంది. రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, కేంద్ర బ్యాంకు విధానాలు వల్ల బంగారం ధర పెరుగుతోంది. దీంతో పసిడిలో ఇన్వెస్ట్ చేయడం మేలని పలువురు వ్యాపార పండితులు చెబుతున్నారు.

మీరు బంగారంలో ఏ రూపాల్లో పెట్టుబడి పెట్టాలి?

  • భౌతిక బంగారం (ఆభరణాలు, నాణేలు, బార్లు వంటివి)
  • గోల్డ్ ఈటీఎఫ్
  • డిజిటల్ గోల్డ్

ఈ మూడు రూపాల్లో బంగారంలో పెట్టుబడులు పెట్టొచ్చు. గోల్డ్ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దానికి ఛార్జీలు పడవు. పన్ను ప్రయోజనాలను కూడా అందుతాయి.

ఈ అక్షయ తృతీయకు బంగారం కొనాలా వద్దా?
మీరు బంగారాన్ని కేవలం ఆభరణాలుగా కాకుండా బలమైన పెట్టుబడి ఎంపికగా భావిస్తే ఈ అక్షయ తృతీయకు దానిని కొనడం తెలివైన నిర్ణయం కావచ్చు. గత 11 నెలల పనితీరు, ప్రస్తుత ఆర్థిక సూచికలు, రాబోయే కాలంలో వచ్చే అనిశ్చితులు అన్నీ బంగారం కొనుగోలుకు అనుకూలంగా ఉన్నాయి. మీరు అన్నింటిని బేరీజు వేసుకోని పసిడిని కొనుగోలు చేయడం ఉత్తమం.

బంగారం కొంటున్నారా? బిల్లు తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించకపోతే అంతే!

Gold Buying Tips : బంగారు ఆభరణాలు కొనాలా?.. ఈ విషయాలు తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.