ETV Bharat / business

UPI పేమెంట్స్​పై కూడా GST?- ఇదిగో క్లారిటీ - GST ON UPI PAYMENTS

UPI లావాదేవీలపై GST- క్లారిటీ ఇచ్చిన కేంద్రం

GST On UPI Payments
GST On UPI Payments (Source : IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : April 19, 2025 at 7:01 AM IST

2 Min Read

GST On UPI Payments : యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించబోతున్నారంటూ వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. రెండు వేలు పైబడి జరిపే లావాదేవీలపై జీఎస్టీ వేసేందుకు కేంద్రం సిద్ధమవుతోందంటూ వచ్చిన వార్తలు పూర్తి అవాస్తవమని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. 'వ్యక్తులు- వ్యాపారుల యూపీఐ పేమెంట్స్​కు మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు (MDR) రుసుమే లేనప్పుడు, ఈ తరహా లావాదేవీలకు జీఎస్‌టీ కూడా ఉండదు' అని మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చేసింది.

యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ విధిస్తారంటూ సామాజిక మాధ్యమాలు సహా పలు వెబ్‌సైట్‌లలో ప్రచారం జరగ్గా తప్పుడు వార్తలు, ఆధారాలు లేని సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని కేంద్రం కోరింది. యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే అంశం ఏదీ తమ పరిశీలనలో లేదని స్పష్టతనిచ్చింది. యూపీఐ ద్వారా డిజిటల్‌ చెల్లింపులను మరింత ప్రమోట్‌ చేయడం తమ ముఖ్య ఉద్దేశమని వివరించింది. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో రూ.260.56 లక్షల కోట్ల విలువైన UPI లావాదేవీలు జరిగాయి.

పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో యూపీఐ సేవల వాడకం ఎక్కువైంది. చిన్న పల్లెల్లో సైతం డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. చిరు వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద కంపెనీలు సైతం యూపీఐ పేమెంట్స్​ అనుమతిస్తున్నాయి. గత కొన్నేళ్లలో యూపీఐ పేమెంట్స్​లో భారత్ టాప్​లో నిలుస్తోంది. అయితే అదణపు ఛార్జీలు లేకపోవడం, క్యాష్​బ్యాక్ లాంటి ఆఫర్లు ఉండడంతోపాటు ఈజీగా చెల్లింపులు జరిపే సౌలభ్యం ఉడడం వల్ల దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ అయ్యాయి.

ఈ నేపథ్యంలోనే రూ.2 వేలకు పైన డిజిటల్ చెల్లింపులు జరిపే ట్రాన్సాక్షన్​లకు కేంద్ర ప్రభుత్వం 18శాతం జీఎస్టీ వసూల్ చేయనుందనే ప్రచారం జరిగింది. యూపీఐ వాడకం వినియోగం వల్ల దీన్ని కూడా ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకోవాలని సన్నాహాలు చేస్తుందని రూమర్స్ వచ్చాయి. దీంతో ప్రజలు కాస్త గందరగోళానికి గురయ్యారు. ఈ క్రమంలోనే కేంద్రం ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మవద్దని సూచించింది.

యూపీఐ వర్క్ చేయడం లేదా? ఇలా చేస్తే క్షణాల్లో పనిచేస్తుంది!

UPI సర్వీసులు వచ్చేశాయోచ్- కొన్ని గంటల అంతరాయం అనంతరం రిటర్న్!

GST On UPI Payments : యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించబోతున్నారంటూ వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. రెండు వేలు పైబడి జరిపే లావాదేవీలపై జీఎస్టీ వేసేందుకు కేంద్రం సిద్ధమవుతోందంటూ వచ్చిన వార్తలు పూర్తి అవాస్తవమని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. 'వ్యక్తులు- వ్యాపారుల యూపీఐ పేమెంట్స్​కు మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు (MDR) రుసుమే లేనప్పుడు, ఈ తరహా లావాదేవీలకు జీఎస్‌టీ కూడా ఉండదు' అని మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చేసింది.

యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ విధిస్తారంటూ సామాజిక మాధ్యమాలు సహా పలు వెబ్‌సైట్‌లలో ప్రచారం జరగ్గా తప్పుడు వార్తలు, ఆధారాలు లేని సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని కేంద్రం కోరింది. యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే అంశం ఏదీ తమ పరిశీలనలో లేదని స్పష్టతనిచ్చింది. యూపీఐ ద్వారా డిజిటల్‌ చెల్లింపులను మరింత ప్రమోట్‌ చేయడం తమ ముఖ్య ఉద్దేశమని వివరించింది. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో రూ.260.56 లక్షల కోట్ల విలువైన UPI లావాదేవీలు జరిగాయి.

పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో యూపీఐ సేవల వాడకం ఎక్కువైంది. చిన్న పల్లెల్లో సైతం డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. చిరు వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద కంపెనీలు సైతం యూపీఐ పేమెంట్స్​ అనుమతిస్తున్నాయి. గత కొన్నేళ్లలో యూపీఐ పేమెంట్స్​లో భారత్ టాప్​లో నిలుస్తోంది. అయితే అదణపు ఛార్జీలు లేకపోవడం, క్యాష్​బ్యాక్ లాంటి ఆఫర్లు ఉండడంతోపాటు ఈజీగా చెల్లింపులు జరిపే సౌలభ్యం ఉడడం వల్ల దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ అయ్యాయి.

ఈ నేపథ్యంలోనే రూ.2 వేలకు పైన డిజిటల్ చెల్లింపులు జరిపే ట్రాన్సాక్షన్​లకు కేంద్ర ప్రభుత్వం 18శాతం జీఎస్టీ వసూల్ చేయనుందనే ప్రచారం జరిగింది. యూపీఐ వాడకం వినియోగం వల్ల దీన్ని కూడా ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకోవాలని సన్నాహాలు చేస్తుందని రూమర్స్ వచ్చాయి. దీంతో ప్రజలు కాస్త గందరగోళానికి గురయ్యారు. ఈ క్రమంలోనే కేంద్రం ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మవద్దని సూచించింది.

యూపీఐ వర్క్ చేయడం లేదా? ఇలా చేస్తే క్షణాల్లో పనిచేస్తుంది!

UPI సర్వీసులు వచ్చేశాయోచ్- కొన్ని గంటల అంతరాయం అనంతరం రిటర్న్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.