Gold Rate Today May 22nd 2025 : దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.98,500 ఉండగా, గురువారం నాటికి రూ.540 పెరిగి రూ.99,040కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.1,00,013ఉండగా, గురువారం నాటికి రూ.1,385 పెరిగి రూ.1,01,398కు చేరుకుంది.
- Gold Price In Hyderabad May 22nd 2025 : హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.99,040గా ఉంది. కిలో వెండి ధర రూ.1,01,398గా ఉంది.
- Gold Price In Vijayawada May 22nd 2025 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.99,040గా ఉంది. కిలో వెండి ధర రూ.1,01,398గా ఉంది.
- Gold Price In Visakhapatnam May 22nd 2025 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.99,040గా ఉంది. కిలో వెండి ధర రూ.1,01,398గా ఉంది.
- Gold Price In Proddatur May 22nd 2025 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.99,040గా ఉంది. కిలో వెండి ధర రూ.1,01,398గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price May 22nd 2025 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు పెరిగాయి. బుధవారం ఔన్స్ గోల్డ్ ధర 3,308 డాలర్లు ఉండగా, గురువారం నాటికి 30 డాలర్లు పెరిగి 3,338కు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 33.58 డాలర్లుగా ఉంది.
స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Today May 22nd 2025 : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎర్లీ ట్రేడింగ్లో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 678 పాయింట్ల నష్టంతో 80,918 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 207 పాయింట్ల నష్టంతో 24,605 వద్ద ట్రేడవుతోంది.
- లాభాల్లో ఉన్న షేర్లు : అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ
- నష్టాల్లో ఉన్న షేర్లు : టెక్ మహీంద్రా, పవర్గ్రిడ్ కార్పొరేషన్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, హెచ్యూఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎంఅండ్ఎం, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, మారుతీ సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రీస్
రూపాయి విలువ
Rupee Value Today May 22nd 2025 : గురువారం రూపాయి విలువ 2 పైసలు తగ్గింది. ప్రస్తుతం అమెరికన్ డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.85.61గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices May 22nd 2025 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
మెరిసేదంతా బంగారం కాదండీ! - ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు ఈ టిప్స్ పాటిస్తే బెస్ట్!
బంగారాన్ని ఎన్ని రూపాల్లో కొనొచ్చో తెలుసా? ఈ ట్యాక్స్ల గురించి అవగాహన ఉందా?