Flipkart Cash Burn : ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ ఫ్లిప్కార్ట్ తన నెలవారీ ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది. ఇప్పటికే సంస్థ నెలవారీ నగదు వినియోగం (క్యాష్ బర్న్) 40 మిలియన్ డాలర్లకు చేరుకున్న నేపథ్యంలో, కచ్చితంగా ఖర్చు తగ్గించుకోవాలని ఫ్లిప్కార్ట్ బోర్డ్- సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తిని కోరింది.
పబ్లిక్ లిస్టింగ్ కోసం!
వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్కార్ట్ ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్లో పబ్లిక్ లిస్టింగ్కు సిద్ధమవుతోంది. ఇందుకోసం దాని హోల్డింగ్ ఎంటిటీని సింగపూర్ నుంచి భారత్కు మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే గత వారం జరిగిన సమావేశంలో ఫ్లిప్కార్ట్ బోర్డ్, నెలవారీ నగదు వినియోగం సగానికి తగ్గించాలని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) కల్యాణ్ కృష్ణమూర్తిని కోరింది.
నెలకు 40 మిలియన్ డాలర్లు ఖర్చు!
ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ ప్రతి నెలా దాదాపు 40 మిలియన్ డాలర్లు (సుమారు రూ.340 కోట్ల) మేర ఖర్చు చేస్తోంది. అయితే ఈ ఖర్చును (క్యాష్ బర్న్) 20 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.170 కోట్ల)కు తగ్గించాలని ఫ్లిప్కార్ట్ బోర్డ్, సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తిని కోరింది అని తెలుస్తోంది.
'క్యాష్ బర్న్' అంటే ఏమిటి?
కంపెనీలు, స్టార్టప్లు, కొత్త తరం సంస్థలు- తమ వ్యాపార కార్యకలాపాల కోసం తమ దగ్గరున్న మూల ధనం నుంచి కొత్త డబ్బును సమకూరుస్తాయి. అయితే కంపెనీలు ఇలా నిధులు సమకూర్చడానికి, తమ మూలధనాన్ని ఖర్చు చేసే రేటును 'క్యాష్ బర్న్' అని అంటారు. ఇది కంపెనీలు లాభదాయకంగా ఉన్నాయా, లేదా అని నిర్ణయించే ఒక కొలమానం (మెట్రిక్). దీని ప్రకారం క్యాష్ బర్న్ తక్కువగా ఉంటే ఆ కంపెనీ ఆర్థిక స్థితి చాలా మెరుగ్గా ఉన్నట్లు అర్థం.
వాస్తవానికి ఫ్లిప్కార్ట్ కొత్త వ్యాపార యూనిట్లు పెట్టడం ద్వారా, అలాగే క్విక్-కామర్స్ విభాగం ఫ్లిప్కార్ట్ మినిట్స్తో మరింత దూకుడుగా ముందుకు వెళ్లాల్సిన సమయంతో, క్యాష్ బర్న్ను సంవత్సరానికి దాదాపు 250 మిలియన్ డాలర్లకు తగ్గించే పనిని సీఈఓ కృష్ణమూర్తికి అప్పగించడం విశేషం.
గోల్డ్ ATMలు వస్తున్నాయ్- ఇప్పుడు చైనాలో వినియోగం- భారత్లోకి ఎప్పుడంటే!
ఛార్లీ ముంగర్ టిప్స్ పాటిస్తే స్టాక్ మార్కెట్లో లాభాలు గ్యారెంటీ!