ETV Bharat / business

గుడ్ న్యూస్​- ఇకపై నేరుగా ఏటీఎం, యూపీఐ నుంచి పీఎఫ్ విత్​డ్రా!

ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్​- త్వరలో ఏటీఎం, యూపీఐ ద్వారా నేరుగా డబ్బులు విత్​డ్రా చేసుకునే ఛాన్స్​!

PF Withdraw Through ATMs And UPI
PF Withdraw Through ATMs And UPI (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : June 24, 2025 at 8:25 PM IST

2 Min Read
Choose ETV Bharat

PF Withdraw Through ATMs And UPI : ఈపీఎఫ్​ఓ చందాదారులకు గుడ్ న్యూస్​. ఉద్యోగులు తమ ప్రావిడెంట్​ ఫండ్​ (పీఎఫ్​)ను త్వరలో నేరుగా ఏటీఎం, యూపీఐల ద్వారా విత్​డ్రా చేసుకునే అవకాశం రానుంది. అయితే ఇందుకోసం ఉద్యోగులు తమ బ్యాంక్ ఖాతాలను ఈపీఎఫ్​తో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.

కార్మిక మంత్రిత్వశాఖ ఈ ప్రాజెక్ట్​పై పనిచేస్తోందని ఓ ఉన్నత స్థాయి అధికారి తెలిపారు. దీని ద్వారా ఇకపై ఉద్యోగుల పీఎఫ్​ ఖాతాలో కొంత భాగాన్ని స్తంభింపజేసి, మిగిలిన డబ్బును యూపీఐ, ఏటీఎం డెబిట్​ కార్డులు మొదలైన వివిధ పద్ధతులు ఉపయోగించి విత్​డ్రా చేసుకునేందుకు వీలు కల్పిస్తారని ఆయన అన్నారు. అయితే ఈ వ్యవస్థను అమలు చేయడంలో కొన్ని సవాళ్లు ఉన్నాయని, అందులో భాగంగా ప్రస్తుతం సాఫ్ట్​వేర్ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ​ఆయన చెప్పారు.

ప్రస్తుతం ఎంప్లాయీస్​ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్​ (ఈపీఎఫ్​ఓ) చందాదారులు తమ పీఎఫ్ డబ్బును విత్​డ్రా చేసుకోవాలంటే, ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. దీని వల్ల పీఎఫ్​ డబ్బులు పొందడానికి చాలా సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

రూ.1లక్ష నుంచి రూ.5లక్షలకు పెంపు
ఆటో-సెటిల్​మెంట్ మోడ్ కింద, దరఖాస్తు ఫారమ్​ దాఖలు చేసిన 3 రోజుల్లో పీఎఫ్​ విత్​డ్రా క్లెయిమ్​ను ఎలక్ట్రానిక్​గా పరిష్కరిస్తారు. కనుక మాన్యువల్ పనులు చేయాల్సిన పని తప్పుతుంది.​ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఆటో-సెటిల్​మెంట్ మోడ్​ పరిమితిని మంగళవారం రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు. దీని వల్ల ఈపీఎఫ్​ఓ చందదారులకు చాలా ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా విద్య, వివాహం, గృహ అవసరాలకు, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కేవలం 3 రోజుల్లోగా తమ పీఎఫ్​ డబ్బులు పొందగలుగుతారు.

కొవిడ్ సమయంలో
ప్రస్తుతం ఈపీఎఫ్​ఓలో 7 కోట్లకు పైగా చందాదారులు ఉన్నారు. అయితే కొవిడ్ సమయంలో వీరిలో చాలా మంది ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. దీనితో వీరికి ఆర్థిక సాయం అందించడానికి ఈపీఎఫ్​ఓ ముందస్తు క్లెయిమ్​ల కోసం ఆటో-సెటిల్​మెంట్​ను ప్రవేశపెట్టింది. అయితే ఇది పొందాలంటే పీఎఫ్ ఖాతాదారులు ప్రత్యేకంగా క్లెయిమ్​లు దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఏటా ఈపీఎఫ్ఓ​ 5 కోట్లకు పైగా క్లెయిమ్​లను పరిష్కరిస్తోంది. దీనికి చాలా సమయం పడుతోంది. అందుకే ఈ భారాన్ని తగ్గించడానికి ఈపీఎఫ్​ఓ కొత్త వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది.

'ఈపీఎఫ్​ఓకు ఎటువంటి బ్యాంకింగ్ లైసెన్స్​లు లేవు. కనుక చందాదారులు తమ ఈపీఎఫ్ ఖాతాల నుంచి నేరుగా డబ్బులు విత్​డ్రా చేసుకోలేరు' అని సదరు ఉన్నత అధికారి తెలిపారు. అయితే బ్యాంకులతో సమానంగా ఈపీఎఫ్​ఓ సేవలను మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

40ఏళ్లకే రిటైర్మెంట్​కు ప్లాన్​ చేస్తున్నారా? 33 ఏళ్లకే రూ.2 కోట్లు సంపాదించిన టెకీ స్టోరీ చదవాల్సిందే!

రూ.12 లక్షలు పెడితే రూ.40 లక్షలు రిటర్న్​​- భారీ లాభాలిచ్చే టాప్- 5 మిడ్‌క్యాప్ ఫండ్స్ ఇవిగో