Akshaya Tritiya Gold Offers : అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఫోన్పే, పేటీఎంలు అక్షయ తృతీయ సందర్భంగా అదిరిపోయే గోల్డ్ డీల్స్, రివార్డ్స్ అందిస్తున్నాయి. మరెందుకు ఆలస్యం, వాటిపై ఓ లుక్కేద్దాం రండి.
ఏప్రిల్ 30న అక్షయ తృతీయ పర్వదినం. ఈ రోజున బంగారం కొంటే చాలా మంచిదని హిందువుల నమ్మకం. అందుకే ఈ రోజు కచ్చితంగా కొంచెమైనా బంగారం కొంటూ ఉంటారు. ఇప్పుడు చాలామంది డిజిటల్ గోల్డ్ కొనడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఫోన్పే, పేటీఎంలు- డిజిటల్ గోల్డ్ పెట్టుబడులను మరింత ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి.
ఫోన్పే ఆఫర్స్
ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫారమ్ ఫోన్పే 99.99 శాతం స్వచ్ఛమైన డిజిటల్ బంగారం (24 క్యారెట్) కొనుగోలుపై 1% క్యాష్బ్యాక్ (రూ.2000 వరకు) ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఏప్రిల్ 30న చేసే కొనుగోళ్లకు మాత్రమే వర్తిస్తుంది. కానీ సిప్ (SIP) విధానంలో బంగారం కొన్నవారికి ఈ ఆఫర్ వర్తించదు.
క్యారెట్లేన్ (CaratLane) స్టోర్లు లేదా వెబ్సైట్ల నుంచి తమ డిజిటల్ గోల్డ్ను రిడీమ్ చేసుకునే కస్టమర్లకు ఫోన్పే డిస్కౌంట్స్ కూడా అందిస్తుంది. అవి ఎలా ఉంటాయంటే?
- బంగారు నాణెములపై 2 శాతం తగ్గింపు
- స్టడెడ్ ఆభరణాలపై 3 శాతం తగ్గింపు
- స్టడెడ్ ఆభరణాలపై 5 శాతం తగ్గింపు
'ఫోన్పే బంగారాన్ని ఎంఎంటీసీ-పీఏఎంపీ, సేఫ్గోల్డ్, క్యారెట్లేన్ లాంటి విశ్వసనీయ బ్రాండ్ల నుంచి కొనుగోలు చేస్తుంది. ఇలా కొనుగోలు చేసిన స్వచ్ఛమైన బంగారాన్ని సురక్షితంగా నిల్వ ఉంచుతుంది. కనుక డిజిటల్ గోల్డ్ కొనాలని అనుకునేవారు సిప్ విధానంలో పెట్టుబడులు పెట్టవచ్చు. సిప్ అనేది కేవలం రూ.5 నుంచి కూడా ప్రారంభించవచ్చు' అని ఫోన్పే పేర్కొంది.
పేటీఎం 'గోల్డెన్ రష్'
డిజిటల్ గోల్డ్ సేవింగ్స్ను ప్రోత్సహించడానికి పేటీఎం 'గోల్డెన్ రష్' ప్రచారాన్ని ప్రారంభించింది. పేటీఎం గోల్డ్లో కనీసం రూ.500 లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టేవారికి, ట్రాన్సాక్షన్ విలువలో 5 శాతాన్ని రివార్డ్ పాయింట్లుగా అందిస్తారు. అంతేకాదు వాటిని లీడర్బోర్డ్లో ఉంచుతారు.
పేటీఎం బంగారాన్ని ఎంఎంటీసీ-పీఏఎంపీ నుంచి తీసుకుంటుంది. పైగా పూర్తి బీమా కలిగిన వాల్ట్ల్లో ఈ బంగారాన్ని నిల్వ ఉంచుతుంది. కేవలం రూ.9లతో రోజువారీ గోల్డ్ సిప్ చేసుకోవచ్చు. రియల్-టైమ్ ధరతో డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయవచ్చు.
డిజిటల్ బంగారంలో ఎలా పెట్టుబడులు పెట్టాలి?
1. ఫోన్పేలో డిజిటల్ గోల్డ్ కొనే విధానం :
- ముందుగా ఫోన్పే యాప్ ఓపెన్ చేసి, గోల్డ్ సెక్షన్లోకి వెళ్లాలి.
- అక్కడ ఉన్న గోల్డ్ ప్రొవైడర్లలో ఒక దాన్ని ఎంచుకోవాలి. (MMTC-PAMP, SafeGold, CaratLane)
- ఏప్రిల్ 30న వన్-టైమ్ ట్రాన్సాక్షన్తో రూ.2000 లేదా అంత కంటే ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.
- యూపీఐ, క్రెడిట్/డెబిట్ కార్డ్స్, వాలెట్, గిఫ్ట్ కార్డ్ల ద్వారా పేమెంట్ చేయండి. అంతే సింపుల్!
- ఈ డిజిటల్ గోల్డ్ కొనుగోలుపై మీకు 1 శాతం క్యాష్బ్యాక్ (రూ.2000 వరకు) లభిస్తుంది.
2. పేటీఎంలో డిజిటల్ గోల్డ్ కొనే విధానం :
- ముందుగా పేటీఎం యాప్ను ఓపెన్ చేయండి.
- 'పేటీఎం గోల్డ్' లేదా 'డైలీ గోల్డ్ సిప్'లలో ఒకదాన్ని ఎంచుకోండి.
- మీరు కనుక సిప్ విధానాన్ని ఎంచుకుంటే, కనీస పెట్టుబడి రూ.9ను ఎంచుకోవచ్చు.
- తరువాత సిప్ ప్లాన్ (రోజువారీ/వారం/నెలవారీ)ను ఎంచుకోండి.
- యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డెబిడ్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయండి. అంతే సింపుల్!
నోట్ : ఈ ఆర్టికల్లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.
బంగారంపై ఇన్వెస్ట్ చేయాలా? ఈ టాప్-3 ఆప్షన్స్పై ఓ లుక్కేయండి!
బంగారాన్ని ఎన్ని రూపాల్లో కొనొచ్చో తెలుసా? ఈ ట్యాక్స్ల గురించి అవగాహన ఉందా?