Woman Gangraped In Jind : హరియాణా జింద్లో అమానవీయ ఘటన జరిగింది. ఐదేళ్ల చిన్నారిని హత్య చేసి తల్లిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు దుండగులు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
ఇదీ జరిగింది
జింద్ మురికి వాడలో నివసించే బాధిత కుటుంబం, చెత్తను సేకరిస్తూ జీవిస్తుంది. అయితే 15 రోజుల క్రితం బాధితురాలి భర్తకు పక్కనే ఉండే అమిత్ అనే వ్యక్తితో పాటు అతడి స్నేహితులతో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఆమె భర్త తలకు తీవ్ర గాయం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఇరు పక్షాలను పిలిపించిన పోలీసులు మాట్లాడటంతో వివాదం సద్దుమణిగింది. కానీ అప్పటి నుంచి అమిత్తో పాటు అతడి స్నేహితులకు బాధితురాలి కుటుంబంపై కక్ష పెంచుకున్నారు.
ఈ క్రమంలోనే మంగళవారం గుడిసెలో భర్త లేని సమయం చూసి స్నేహితులతో కలిసి అమిత్ వచ్చాడు. ముగ్గురు పిల్లలతో కలిసి గుడిసెలో నిద్రపోతున్న బాధితురాలపై దాడి చేశారు. అనంతరం ఆమెతో పాటు ఐదేళ్ల చిన్నారిని పక్కనే ఉన్న చెత్త కుప్ప వద్దకు ఎత్తుకెళ్లారు. అక్కడ చిన్నారి గొంతు నులిమి హత్య చేసి, అనంతరం బాధితురాలిపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న మహిళను అక్కడే వదిలేసి పారిపోయారు. చిన్నారి మృతదేహం రాత్రంతా ఆ చెత్తకుప్పలనే ఉంది.
బుధవారం ఉదయం బయటకు వచ్చిన మహిళలలు, బాధితురాలని గమనించారు. వెంటనే ఆమెను అక్కడి నుంచి గుడిసెకు తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు మరణించిన చిన్నారిని అంత్యక్రియలు చేశారు కుటుంబ సభ్యులు. ఈ క్రమంలోనే గురువారం స్పృహలోకి వచ్చిన మహిళ జరిగిన విషయాన్ని వెల్లడించింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టమ్ పరీక్షకు తరలించారు. అత్యాచారం, హత్య సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో నిందితుల్లో ముగ్గురు మైనర్లని ఎస్ఐ యశ్వీర్ తెలిపారు. చిన్నారిపైనా అత్యాచారం చేసినట్లు అనుమానిస్తున్నామని, పోస్ట్ మార్టమ్ పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాతే నిర్ధరిస్తామని చెప్పారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని వివరించారు.