ETV Bharat / bharat

పహల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్‌- ఆగిపోయిన రాజస్థాన్ అబ్బాయి, పాక్ అమ్మాయి పెళ్లి! - PAHALGAM TERROR ATTACK EFFECT

ఆగిపోయిన పాక్ అమ్మాయి, భారత్‌ అబ్బాయి పెళ్లి- పహల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్‌

Pahalgam Terror Attack Effect On Marriages
Pahalgam Terror Attack Effect On Marriages (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 26, 2025 at 5:43 PM IST

2 Min Read

Pahalgam Terror Attack Effect On Marriages : భారతదేశం, పాకిస్థాన్‌లు రాజకీయంగా విడిపోయినప్పటికీ, సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజల మధ్య ఇప్పటికీ బంధుత్వాలు, స్నేహ బంధాలు, వివాహ సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఓ భారత్‌ అబ్బాయి, పాక్ అమ్మాయి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. ఉగ్రవాదం భారత్‌-పాక్ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజల జీవితాలపై చూపుతున్న ప్రత్యక్ష ప్రభావాన్ని ఇది కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.

ఇంతకీ ఏం జరిగిందంటే?
పశ్చిమ రాజస్థాన్‌లోని బార్మార్‌కు చెందిన షైతాన్ సింగ్‌ 4 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌లోని అమర్‌కోట్‌కు చెందిన కుటుంబంతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. ఆ పెళ్లి ఈ ఏప్రిల్‌ 30న జరగాల్సి ఉంది. దీనితో ఇరు కుటుంబాలు పెళ్లి పనులు మొదలుపెట్టారు. ఏప్రిల్‌ 24న షైతాన్ సింగ్ పాకిస్థాన్‌కు వెళ్లడానికి అట్టారి-వాఘా సరిహద్దుకు వెళ్లారు. కానీ అక్కడి అధికారులు షైతాన్‌ సింగ్‌ను పాక్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీనితో ఆయన నిరాశగా వెనుతిరిగారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తరువాత భారత్‌-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరగడమే ఇందుకు కారణం.

భారత్‌ నిర్ణయం కరక్టే!
తన పెళ్లి ఆగిపోయినప్పటికీ షైతాన్ సింగ్ భారత ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. 'ఉగ్రవాదులు అమాయకులైన పర్యాటకులను చంపడం చాలా తప్పు. అందువల్ల పాకిస్థాన్‌ పౌరులను దేశం నుంచి వెళ్లిపోమని భారత్‌ ఆదేశించింది. భారత్‌ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదే' అని షైతాన్ సింగ్ అన్నారు.

వీసా కోసం మూడేళ్లు కష్టపడ్డా!
'షైతాన్ సింగ్ పాకిస్థాన్ వీసా కోసం గత 3 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తుంటే, ఈ ఫిబ్రవరిలో వీసా మంజూరు అయ్యింది. ఈ వీసా మే 12 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కానీ పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్‌ పాకిస్థాన్ పౌరుల వీసాలను రద్దు చేసింది. దీనితోపాటు పాక్ పౌరులు కూడా ఇండియా నుంచి వెళ్లిపోవాలని సూచించింది. దీనితో అధికారులు భారత పౌరులను కూడా పాక్‌కు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఇదే నా పెళ్లికి శాపంగా మారింది' అని సైతాన్ షింగ్ విచారం వ్యక్తం చేశారు.

నేను భారత్‌ కోడలిని- నన్ను పాకిస్థాన్ పంపించవద్దు: సీమా హైదర్‌
పాకిస్థాన్‌ పౌరులను దేశం విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో, పాక్‌ జాతీయురాలు సీమా హైదర్‌ చిక్కుల్లో పడ్డారు. తనను భారత్‌ నుంచి వెళ్లగొట్టవద్దని, ఇక్కడే ఉండేందుకు అనుమతించాలని ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు విజ్ఞప్తి చేస్తూ తాజాగా ఓ వీడియో విడుదల చేసింది.

"ఒకప్పుడు నేను పాకిస్థాన్ పౌరురాలిని. కానీ ఇప్పుడు భారత్‌కు చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుని, భారత్‌కు కోడలిని అయ్యాను. ఓ కుమార్తెకు జన్మనిచ్చాను. నేను ఇస్లాంను వదిలేసి హిందూమతం స్వీకరించాను. దయ చేసి నన్ను పాకిస్థాన్‌కు పంపించవద్దు."
- సీమా హైదర్‌

పాక్‌కు చెందిన సీమా హైదర్‌ పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన సచిన్‌ మీనాను ప్రేమించింది. అందుకే 2023లో తన నలుగురు పిల్లలతో సహా పాక్‌ నుంచి పారిపోయి, అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. తరువాత ముస్లిం మతం నుంచి హిందూమతంలోకి మారింది. అయితే ఆమె పాక్ ఏజెంట్ అయ్యుంటుందని పోలీసులు అనుమానించారు. ఈ ఉదంతం ఎన్నో మలుపులు తిరిగింది. ఆమె చివరకు భారత పౌరసత్వం కల్పించాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరింది కూడా.

స్పెషల్ ఆపరేషన్‌- భారత్​లో అక్రమంగా ఉంటున్న 1000మంది బంగ్లా వలసదారులు అరెస్ట్!

కశ్మీరీ పండిట్​లే ఉగ్రవాదుల టార్గెట్?- ఫుల్ అలెర్ట్​లో ఇండియన్ ఆర్మీ

Pahalgam Terror Attack Effect On Marriages : భారతదేశం, పాకిస్థాన్‌లు రాజకీయంగా విడిపోయినప్పటికీ, సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజల మధ్య ఇప్పటికీ బంధుత్వాలు, స్నేహ బంధాలు, వివాహ సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఓ భారత్‌ అబ్బాయి, పాక్ అమ్మాయి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. ఉగ్రవాదం భారత్‌-పాక్ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజల జీవితాలపై చూపుతున్న ప్రత్యక్ష ప్రభావాన్ని ఇది కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.

ఇంతకీ ఏం జరిగిందంటే?
పశ్చిమ రాజస్థాన్‌లోని బార్మార్‌కు చెందిన షైతాన్ సింగ్‌ 4 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌లోని అమర్‌కోట్‌కు చెందిన కుటుంబంతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. ఆ పెళ్లి ఈ ఏప్రిల్‌ 30న జరగాల్సి ఉంది. దీనితో ఇరు కుటుంబాలు పెళ్లి పనులు మొదలుపెట్టారు. ఏప్రిల్‌ 24న షైతాన్ సింగ్ పాకిస్థాన్‌కు వెళ్లడానికి అట్టారి-వాఘా సరిహద్దుకు వెళ్లారు. కానీ అక్కడి అధికారులు షైతాన్‌ సింగ్‌ను పాక్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీనితో ఆయన నిరాశగా వెనుతిరిగారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తరువాత భారత్‌-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరగడమే ఇందుకు కారణం.

భారత్‌ నిర్ణయం కరక్టే!
తన పెళ్లి ఆగిపోయినప్పటికీ షైతాన్ సింగ్ భారత ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. 'ఉగ్రవాదులు అమాయకులైన పర్యాటకులను చంపడం చాలా తప్పు. అందువల్ల పాకిస్థాన్‌ పౌరులను దేశం నుంచి వెళ్లిపోమని భారత్‌ ఆదేశించింది. భారత్‌ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదే' అని షైతాన్ సింగ్ అన్నారు.

వీసా కోసం మూడేళ్లు కష్టపడ్డా!
'షైతాన్ సింగ్ పాకిస్థాన్ వీసా కోసం గత 3 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తుంటే, ఈ ఫిబ్రవరిలో వీసా మంజూరు అయ్యింది. ఈ వీసా మే 12 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కానీ పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్‌ పాకిస్థాన్ పౌరుల వీసాలను రద్దు చేసింది. దీనితోపాటు పాక్ పౌరులు కూడా ఇండియా నుంచి వెళ్లిపోవాలని సూచించింది. దీనితో అధికారులు భారత పౌరులను కూడా పాక్‌కు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఇదే నా పెళ్లికి శాపంగా మారింది' అని సైతాన్ షింగ్ విచారం వ్యక్తం చేశారు.

నేను భారత్‌ కోడలిని- నన్ను పాకిస్థాన్ పంపించవద్దు: సీమా హైదర్‌
పాకిస్థాన్‌ పౌరులను దేశం విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో, పాక్‌ జాతీయురాలు సీమా హైదర్‌ చిక్కుల్లో పడ్డారు. తనను భారత్‌ నుంచి వెళ్లగొట్టవద్దని, ఇక్కడే ఉండేందుకు అనుమతించాలని ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు విజ్ఞప్తి చేస్తూ తాజాగా ఓ వీడియో విడుదల చేసింది.

"ఒకప్పుడు నేను పాకిస్థాన్ పౌరురాలిని. కానీ ఇప్పుడు భారత్‌కు చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుని, భారత్‌కు కోడలిని అయ్యాను. ఓ కుమార్తెకు జన్మనిచ్చాను. నేను ఇస్లాంను వదిలేసి హిందూమతం స్వీకరించాను. దయ చేసి నన్ను పాకిస్థాన్‌కు పంపించవద్దు."
- సీమా హైదర్‌

పాక్‌కు చెందిన సీమా హైదర్‌ పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన సచిన్‌ మీనాను ప్రేమించింది. అందుకే 2023లో తన నలుగురు పిల్లలతో సహా పాక్‌ నుంచి పారిపోయి, అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. తరువాత ముస్లిం మతం నుంచి హిందూమతంలోకి మారింది. అయితే ఆమె పాక్ ఏజెంట్ అయ్యుంటుందని పోలీసులు అనుమానించారు. ఈ ఉదంతం ఎన్నో మలుపులు తిరిగింది. ఆమె చివరకు భారత పౌరసత్వం కల్పించాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరింది కూడా.

స్పెషల్ ఆపరేషన్‌- భారత్​లో అక్రమంగా ఉంటున్న 1000మంది బంగ్లా వలసదారులు అరెస్ట్!

కశ్మీరీ పండిట్​లే ఉగ్రవాదుల టార్గెట్?- ఫుల్ అలెర్ట్​లో ఇండియన్ ఆర్మీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.