ETV Bharat / bharat

'ఉగ్రవాదులను మట్టిలో కలిపే సమయం ఆసన్నమైంది'- ప్రధాని మోదీ హెచ్చరిక - MODI ON TERRORISM

ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష- పహల్గాం ఘటనపై మోదీ స్పందన

Modi On Terrorism
Modi On Terrorism (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : April 24, 2025 at 1:32 PM IST

Updated : April 24, 2025 at 2:00 PM IST

2 Min Read

Modi On Terrorism : పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడ్డ ముష్కరులకు ఊహించని రీతిలో శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని, వారిని మట్టిలో కలిపి సమయం ఆసన్నమైందన్నారు. ఇది పర్యటకులపై జరిగిన దాడి కాదని, భారత్‌ ఆత్మపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, వెంటాడి భారత్ హతమారుస్తుందని స్పష్టం చేశారు.

మృతులకు ప్రధాని నివాళులు
ఈ మేరకు గురువారం బిహార్ మధుబనిలో పంచాయతీరాజ్ దినోత్సవంలో పాల్గొన్న మోదీ, పహల్గాం ఉగ్రదాడిపై తొలిసారి మాట్లాడారు. ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఉగ్రదాడికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారని పేర్కొన్నారు. తొలుత తన ప్రసంగం ఆరంభంలో పహల్గాం మృతులకు ప్రధాని నివాళులర్పించారు. మోదీతో పాటు సభలోని వారంతా ఒక నిమిషం పాటు మౌనం పాటించి అంజలి ఘటించారు.

ఉగ్రమూకల వెన్నెముకను 140 కోట్ల మంది విరిచేస్తారు!
కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉందని మోదీ తెలిపారు. క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. ఉగ్రదాడి కారణంగా ఓ తల్లి కుమారుడిని కోల్పోయిందని, ఓ సోదరికి జీవిత భాగస్వామి దూరమయ్యాడని అన్నారు. కార్గిల్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరిలోనూ బాధ, ఆగ్రహం ఉన్నాయని చెప్పారు. బాధితులకు న్యాయం చేసేందుకు ప్రతి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశం మొత్తం దృఢ సంకల్పంతో ఉందని చెప్పారు. ఉగ్రమూకల వెన్నెముకను 140 కోట్ల మంది విరిచేస్తారని మోదీ హెచ్చరించారు.

ఐకమత్య స్ఫూర్తిని బద్దలుకొట్టలేరు!
అదే సమయంలో భారత్‌కు అండగా నిలిచిన దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ తమకు అండగా నిలిచారని అన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాదంతో భారత ఐకమత్య స్ఫూర్తిని బద్దలుకొట్టలేరని మోదీ స్పష్టం చేశారు. ఏప్రిల్‌ 22న పహల్గాంలోని ప్రముఖ పర్యటక ప్రాంతమైన బైసరన్‌లో ముష్కరులు జరిపిన దాడిలో 26 మంది మరణించిన విషయం తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చిన వారు పర్యటకులను చుట్టుముట్టి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు ముష్కరులు.

పాక్ దౌత్యవేత్యకు భారత్ సమన్లు- వారంలోగా దేశాన్ని వీడాల్సిందే!

కశ్మీర్ ఎటాక్ ఎఫెక్ట్- పాకిస్థానీయులకు భారత్​లోకి నో ఎంట్రీ

Modi On Terrorism : పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడ్డ ముష్కరులకు ఊహించని రీతిలో శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని, వారిని మట్టిలో కలిపి సమయం ఆసన్నమైందన్నారు. ఇది పర్యటకులపై జరిగిన దాడి కాదని, భారత్‌ ఆత్మపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, వెంటాడి భారత్ హతమారుస్తుందని స్పష్టం చేశారు.

మృతులకు ప్రధాని నివాళులు
ఈ మేరకు గురువారం బిహార్ మధుబనిలో పంచాయతీరాజ్ దినోత్సవంలో పాల్గొన్న మోదీ, పహల్గాం ఉగ్రదాడిపై తొలిసారి మాట్లాడారు. ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఉగ్రదాడికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారని పేర్కొన్నారు. తొలుత తన ప్రసంగం ఆరంభంలో పహల్గాం మృతులకు ప్రధాని నివాళులర్పించారు. మోదీతో పాటు సభలోని వారంతా ఒక నిమిషం పాటు మౌనం పాటించి అంజలి ఘటించారు.

ఉగ్రమూకల వెన్నెముకను 140 కోట్ల మంది విరిచేస్తారు!
కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉందని మోదీ తెలిపారు. క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. ఉగ్రదాడి కారణంగా ఓ తల్లి కుమారుడిని కోల్పోయిందని, ఓ సోదరికి జీవిత భాగస్వామి దూరమయ్యాడని అన్నారు. కార్గిల్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరిలోనూ బాధ, ఆగ్రహం ఉన్నాయని చెప్పారు. బాధితులకు న్యాయం చేసేందుకు ప్రతి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశం మొత్తం దృఢ సంకల్పంతో ఉందని చెప్పారు. ఉగ్రమూకల వెన్నెముకను 140 కోట్ల మంది విరిచేస్తారని మోదీ హెచ్చరించారు.

ఐకమత్య స్ఫూర్తిని బద్దలుకొట్టలేరు!
అదే సమయంలో భారత్‌కు అండగా నిలిచిన దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ తమకు అండగా నిలిచారని అన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాదంతో భారత ఐకమత్య స్ఫూర్తిని బద్దలుకొట్టలేరని మోదీ స్పష్టం చేశారు. ఏప్రిల్‌ 22న పహల్గాంలోని ప్రముఖ పర్యటక ప్రాంతమైన బైసరన్‌లో ముష్కరులు జరిపిన దాడిలో 26 మంది మరణించిన విషయం తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చిన వారు పర్యటకులను చుట్టుముట్టి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు ముష్కరులు.

పాక్ దౌత్యవేత్యకు భారత్ సమన్లు- వారంలోగా దేశాన్ని వీడాల్సిందే!

కశ్మీర్ ఎటాక్ ఎఫెక్ట్- పాకిస్థానీయులకు భారత్​లోకి నో ఎంట్రీ

Last Updated : April 24, 2025 at 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.