ETV Bharat / bharat

తాజ్​మహల్​పై ఎటాక్​ అంటూ ఫేక్ ప్రచారం- మంటలు వస్తున్నట్లు AIతో వీడియో! - TAJMAHAL FAKE VIDEO

తాజ్​మహల్​పై పాకిస్థాన్ వైమానికి దాడి జరిపిందని తప్పుడు ప్రచారం- ఏఐతో వీడియో క్రియేట్ చేసి వ్యాప్తి- రంగంలోకి దిగిన పోలీసులు

Tajmahal
Tajmahal (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 12, 2025 at 5:26 PM IST

1 Min Read

Tajmahal Fake Video : భారత్​, పాకిస్థాన్​ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ, సోషల్ మీడియాలో ఫేక్ వీడియోల వ్యాప్తి ఎక్కువైంది. అదే సమయంలో ఆగ్రాలోని తాజ్​మహల్​పై పాకిస్థాన్ వైమానిక దాడి జరిపిందని కొందరు తప్పుడు ప్రచారం చేశారు. అంతే కాదు ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్​తో క్రియేట్ చేసిన వీడియోను షేర్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అది ఫేక్ అని తేల్చారు.

అసలేం జరిగిందంటే?
ఆదివారం రాత్రి సోషల్ మీడియాలో ఒక్కసారి తాజ్​మహల్​పై పాకిస్థాన్ దాడి జరిగిందని తప్పుడు ప్రచారం ఊపందుకుంది. ఏఐతో చేసిన ఫేక్ వీడియో ఫుల్​గా వైరలైంది. దీంతో ఆగ్రా పోలీస్ కమిషనరేట్ సైబర్ సెల్ వైరల్ వీడియోపై చర్యలు తీసుకుంది. ఆ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసినట్లు తేల్చింది. వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించిన సైబర్ క్రైమ్ పోలీసులు, కేసు నమోదు చేశారు.

సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్​లు, వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా ఉద్రిక్తతను వ్యాప్తి చేయడానికి ఆదివారం రాత్రి కొందరు ప్రయత్నించినట్లు డీసీపీ సోనమ్ కుమార్ తెలిపారు. ఫేక్ వీడియో తయారు చేసిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైరల్, ఫేక్ వీడియోలను ప్రజలు నమ్మవద్దని కోరారు. తప్పుదారి పట్టించే వీడియోలు షేర్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

తాజ్​మహల్ వద్ద పర్యాటకులపైకి దూసుకొచ్చిన డ్రైవర్​ లేని కారు

తాజ్ మహల్​లో వాటర్ లీకేజీ- ప్రధాన గోపురం, పైకప్పుకు రిపేర్లు!

Tajmahal Fake Video : భారత్​, పాకిస్థాన్​ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ, సోషల్ మీడియాలో ఫేక్ వీడియోల వ్యాప్తి ఎక్కువైంది. అదే సమయంలో ఆగ్రాలోని తాజ్​మహల్​పై పాకిస్థాన్ వైమానిక దాడి జరిపిందని కొందరు తప్పుడు ప్రచారం చేశారు. అంతే కాదు ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్​తో క్రియేట్ చేసిన వీడియోను షేర్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అది ఫేక్ అని తేల్చారు.

అసలేం జరిగిందంటే?
ఆదివారం రాత్రి సోషల్ మీడియాలో ఒక్కసారి తాజ్​మహల్​పై పాకిస్థాన్ దాడి జరిగిందని తప్పుడు ప్రచారం ఊపందుకుంది. ఏఐతో చేసిన ఫేక్ వీడియో ఫుల్​గా వైరలైంది. దీంతో ఆగ్రా పోలీస్ కమిషనరేట్ సైబర్ సెల్ వైరల్ వీడియోపై చర్యలు తీసుకుంది. ఆ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసినట్లు తేల్చింది. వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించిన సైబర్ క్రైమ్ పోలీసులు, కేసు నమోదు చేశారు.

సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్​లు, వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా ఉద్రిక్తతను వ్యాప్తి చేయడానికి ఆదివారం రాత్రి కొందరు ప్రయత్నించినట్లు డీసీపీ సోనమ్ కుమార్ తెలిపారు. ఫేక్ వీడియో తయారు చేసిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైరల్, ఫేక్ వీడియోలను ప్రజలు నమ్మవద్దని కోరారు. తప్పుదారి పట్టించే వీడియోలు షేర్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

తాజ్​మహల్ వద్ద పర్యాటకులపైకి దూసుకొచ్చిన డ్రైవర్​ లేని కారు

తాజ్ మహల్​లో వాటర్ లీకేజీ- ప్రధాన గోపురం, పైకప్పుకు రిపేర్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.