Bride Mother Jumps With Son in Law : ఉత్తర్ప్రదేశ్లోని అలీఘడ్లో కాబోయే అల్లుడితో లేచిపోయిన అత్త తాజాగా బయటి ప్రపంచంలోకి వచ్చింది. కాబోయే అత్త, అల్లుడు 39 ఏళ్ల స్వప్న, 25 ఏళ్ల రాహుల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. లేచిపోయిన వ్యవహారం అందరి నోట తీవ్ర చర్చకు దారితీయటంతో దేశం దాటి వెళ్లాలని భావించిన ఈ జంట పోలీసులకు భయపడి తిరిగి వచ్చింది. కుమార్తెతో రాహుల్కు మరికొన్ని రోజుల్లో పెళ్లి జరుగుతుందనగా, స్వప్న అల్లుడితో లేచిపోవడం 10రోజుల క్రితం సంచలనంగా మారింది. అయితే ఇప్పటికీ స్వప్న మనసు మారలేదు. రాహుల్ను విడిచిపెట్టే ఆలోచన లేదని, ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అతడినే పెళ్లి చేసుకుంటానని తెగేసిచెబుతోంది. తన భర్త తాగొచ్చి కొడతాడనీ అందుకే రాహుల్తో ఉండాలని నిర్ణయించుకున్నానని ఆమె తెలిపింది. ఆమె వ్యవహారంతో ఇరు కుటుంబాలు, పోలీసులు తలలు పట్టుకుంటున్నాయి.
పిల్లలు బతిమిలాడినా నో
పెళ్లికి కొన్ని రోజుల ముందు తన భర్త తనను ఎలా హింసించేవాడో స్వప్న చెప్పడంతో తన మనసు చలించిపోయిందని రాహుల్ తెలిపాడు. అందుకే తనను లేపుకెళ్లిపోయినట్లు చెప్పాడు. అలీఘడ్ నుంచి లఖ్నవూకు, అక్కడి నుంచి ముజఫర్పుర్కు వెళ్లినట్లు రాహుల్ తెలిపాడు. తమ గురించి వెతుకుతున్నారని తెలిసి, పోలీసుల ముందు లొంగిపోయినట్లు చెప్పాడు. అనిత లొంగిపోయిన విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించారు. భర్తతో పాటు ఇద్దరు పిల్లలు తమతో రావాలని దాదాపు 8గంటల పాటు కోరినా ఆమె ఒప్పుకోలేదు. తల్లిని ఒప్పించే క్రమంలో పిల్లలు ఏడుస్తూ స్పృహ తప్పిపోయినా ఆమె కనికరించేలదని కుటంబసభ్యులు చెబుతున్నారు.
మూడున్నర లక్షల నగదు, ఐదున్నర లక్షల బంగారంతో జంప్
స్వప్న లేచిపోయేటప్పుడు మూడున్నర లక్షల నగదు, ఐదున్నర లక్షల బంగారం తీసుకెళ్లిందని, అదంతా తిరిగి ఇచ్చేయాలని ఆమె భర్త జితేందర్ అంటున్నాడు. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారనీ, అందుకే స్వప్నకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధంగా లేనట్లు తెలిపాడు. స్వప్న చేసింది తప్పనీ, ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులతో పాటు ఆమె కుటుంబసభ్యులు కోరుతున్నారు. కాగా స్వప్న, రాహుల్ దేశ సరిహద్దులు దాటి నేపాల్కు వెళ్లి స్థిరపడాలని భావించినట్లు పోలీసులు తెలిపారు.