ETV Bharat / bharat

హనీమూన్ జంట మిస్సింగ్ కేసులో ట్విస్ట్​- భర్తను చంపించింది భార్యే! - HONEYMOON COUPLE MISSING CASE

హనీమూన్ జంట మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్​- భార్యే కిరాయి హంతకులతో భర్తను హత్య చేయించింది: పోలీసులు

Honeymoon Couple Missing Case
Honeymoon Couple Missing Case (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : June 9, 2025 at 8:33 AM IST

Updated : June 9, 2025 at 8:58 AM IST

2 Min Read

Honeymoon Couple Missing Case : మేఘాలయలో హనీమూన్ జంట మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఇండోర్​కు చెందిన రాజా రఘువంశీని అతని భార్యే కిరాయి హంతకులతో హత్య చేయించందని పోలీసులు తెలిపారు.

'నిందితురాలు సోనమ్​ ఉత్తరప్రదేశ్​లోని ఘాజీపూర్​లో పోలీసుల ముందు లొంగిపోయింది. రఘువంశీని హత్య చేసిన ముగ్గురు కిరాయి హంతకులను అరెస్ట్ చేశాం. ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న నిందితులు- సోనమ్​ స్వయంగా తన భర్తను హత్య చేయడానికి తమను నియమించుకుందని తెలిపారు' అని మేఘాలయ డీజీపి ఐ నోంగ్​రాంగ్ సోమవారం​ వెల్లడించారు.

పోలీసులను అభినందించిన సీఎం
ఈ కేసును ఛేదించిన పోలీసులను ముఖ్యమంత్రి కాన్రాడ్​ కె సంగ్మా అభినందించారు.

"దేశాన్ని, రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ కేసును మేఘాలయ పోలీసులు కేవలం 7 రోజుల్లోనే ఛేదించారు. మధ్యప్రదేశ్​కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ దారుణానికి కారణమైన మహిళ పోలీసులకు లొంగిపోయింది. మరో నిందితుడిని పట్టుకోవడానికి ఇంకా గాలింపు చర్యలు సాగుతున్నాయి." - కాన్రాడ్​ కె సంగ్మా, మేఘాలయ సీఎం

ఏం జరిగింది అంటే?
మధ్యప్రదేశ్​లోని ఇందౌర్​ చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీకి సోనమ్​తో ఇటీవల మే11వ తేదీన వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత మే 20న హనీమూన్​ కోసం షీల్లాంగ్​కు వెళ్లారు. అక్కడ గడుపుతున్న వారు, కుటుంబసభ్యులతో మే 25వ తేదీవరకు కాంటాక్ట్​లో ఉన్నారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి ఫోన్​ కాల్​ రాలేదు. ఇద్దరి ఫోన్లు స్విచాఫ్ రావడంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. చివరకు వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

అదృశ్యం అయిన 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో గుర్తించారు. అతడిని ఎవరో కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. కానీ ఆయన భార్య సోనమ్‌ ఆచూకీ దొరకలేదు. దీనితో సోనమ్‌ను కిడ్నాప్‌ చేసి ఉంటారని ఆమె కుటుంబసభ్యులు అనుమానించారు. ఎంతకీ ఈ కేసు మిస్టరీ వీడకపోవడంతో కేసును సీబీఐకు అప్పగించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే తాజాగా ఈ మర్డర్ మిస్టరీ వీడింది. భార్యే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.

పాకిస్థాన్ పరువు పాయే- ఫేక్ ప్రచారాలను బట్టబయలు చేసిన శాటిలైట్ ఇమేజెస్​!

రోల్ మోడల్ రష్మిరేఖ- లేడీ ట్రాఫిక్ కానిస్టేబుల్​గా విధులు- VVIP వస్తే ఆమె ఉండాల్సిందే!

Honeymoon Couple Missing Case : మేఘాలయలో హనీమూన్ జంట మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఇండోర్​కు చెందిన రాజా రఘువంశీని అతని భార్యే కిరాయి హంతకులతో హత్య చేయించందని పోలీసులు తెలిపారు.

'నిందితురాలు సోనమ్​ ఉత్తరప్రదేశ్​లోని ఘాజీపూర్​లో పోలీసుల ముందు లొంగిపోయింది. రఘువంశీని హత్య చేసిన ముగ్గురు కిరాయి హంతకులను అరెస్ట్ చేశాం. ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న నిందితులు- సోనమ్​ స్వయంగా తన భర్తను హత్య చేయడానికి తమను నియమించుకుందని తెలిపారు' అని మేఘాలయ డీజీపి ఐ నోంగ్​రాంగ్ సోమవారం​ వెల్లడించారు.

పోలీసులను అభినందించిన సీఎం
ఈ కేసును ఛేదించిన పోలీసులను ముఖ్యమంత్రి కాన్రాడ్​ కె సంగ్మా అభినందించారు.

"దేశాన్ని, రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ కేసును మేఘాలయ పోలీసులు కేవలం 7 రోజుల్లోనే ఛేదించారు. మధ్యప్రదేశ్​కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ దారుణానికి కారణమైన మహిళ పోలీసులకు లొంగిపోయింది. మరో నిందితుడిని పట్టుకోవడానికి ఇంకా గాలింపు చర్యలు సాగుతున్నాయి." - కాన్రాడ్​ కె సంగ్మా, మేఘాలయ సీఎం

ఏం జరిగింది అంటే?
మధ్యప్రదేశ్​లోని ఇందౌర్​ చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీకి సోనమ్​తో ఇటీవల మే11వ తేదీన వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత మే 20న హనీమూన్​ కోసం షీల్లాంగ్​కు వెళ్లారు. అక్కడ గడుపుతున్న వారు, కుటుంబసభ్యులతో మే 25వ తేదీవరకు కాంటాక్ట్​లో ఉన్నారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి ఫోన్​ కాల్​ రాలేదు. ఇద్దరి ఫోన్లు స్విచాఫ్ రావడంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. చివరకు వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

అదృశ్యం అయిన 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో గుర్తించారు. అతడిని ఎవరో కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. కానీ ఆయన భార్య సోనమ్‌ ఆచూకీ దొరకలేదు. దీనితో సోనమ్‌ను కిడ్నాప్‌ చేసి ఉంటారని ఆమె కుటుంబసభ్యులు అనుమానించారు. ఎంతకీ ఈ కేసు మిస్టరీ వీడకపోవడంతో కేసును సీబీఐకు అప్పగించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే తాజాగా ఈ మర్డర్ మిస్టరీ వీడింది. భార్యే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.

పాకిస్థాన్ పరువు పాయే- ఫేక్ ప్రచారాలను బట్టబయలు చేసిన శాటిలైట్ ఇమేజెస్​!

రోల్ మోడల్ రష్మిరేఖ- లేడీ ట్రాఫిక్ కానిస్టేబుల్​గా విధులు- VVIP వస్తే ఆమె ఉండాల్సిందే!

Last Updated : June 9, 2025 at 8:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.